Vidura Neeti: The Power of Unity and Togetherness Part 10

Vidura Neeti: The Power of Unity and Togetherness Part 10

Vidura Neeti: The Power of Unity and Togetherness Part 10

Vidura Neeti: The Power of Unity and Togetherness Part 10 ఐకమత్యమే బలము: – మహాన ప్యేక వృక్షో బలవాన్ సుప్రతిష్ఠితః, ప్రసహ్య ఏవ వాన సంస్కందో మర్ధితం క్షణాత్! అన్యోన్య సముపష్టంభా దాన్యోన్యపాశ్రయేణ చ జ్ఞాతయః సంప్రవర్ధంతే సరసీవోత్పలాన్యుత! కరితురగాది ఘట్టనయు గాలియు నొంపదె యొంటినున్న య త్తరుష్ము ననేక భూరుహ వితానము గుంపయి పేర్చి బాధలం బొరయున్మై యన్నదమ్ములును బొందిన నేరి కసాధ్య్ము లట్లుగా కెరవయి నిల్చినం గెలని కెలిదమై పరివోదు రెంతయున్!

ఎంతబలంగా భూమిలో వేళ్ళూనుకున్న చెట్లయినా పెనుగాలి వస్తే కూకటి వేళ్ళతోసహా క్షణంలో కూలిపోతాయి. అలాకాక బలమైన బంధుత్వంతో కట్టివేయబడిన వారు అభ్యుదయాన్ని పొందుతారు… ఏకాకిగా ఉన్న చెట్టును ఏనుగులో గుర్రాలో త్రొక్కివేస్తాయి.. గాలి కూల్చి వేస్తుంది. అలాకాక చాలా చెట్లు గుంపుగా ఉంటే వానికి ఏ కీడూ రాదు. అలాగే అన్నదమ్ములు కూడా కలసి ఉంటే వారినెవరూ ఏమీ చేయలేరు. విడిపోతే ఇతరులకు చులకన అయిపోతారు. దిక్కుమాలిన చావు చస్తారు.

పరస్పరాధారిత సమాజం ప్రయోజనకారి. పరస్పరాధారిత సమాజం స్నేహపూర్ణ వాతావరణంలో వికసిస్తుంది. విశ్వాసం లేనిదే స్నేహం లేదు… నిజాయితీ లేనిదే విశ్వాసం లేదు.. అంటారు. విశ్వాసం, స్నేహాలకు మూలం నిజాయితీ. కౌరవులలో ఆ నిజాయితీ కొరవడింది. వారిని సరైన బాటలో నడపవలసిన ధృతరాష్ట్రుడే “నేను నాది” అనే భావనలో ఉన్నాడు. ఇప్పుడు కౌరవ పాండవుల మధ్య సఖ్యత నెలకొంటుందా? అయినా విదురుడు ప్రయత్నిస్తున్నాడు. ఒక చక్రవర్తిగా, ప్రజ్ఞాచక్షువుగా విదురుడు చెప్పే ప్రతి విషయమూ అతనికి తెల్సినవే.. కాని ఎందుకు వింటున్నాడు? నిజానికి ధృతరాష్ట్రుడు తాను సృష్టించుకున్న సమస్యలలో నుండి బయటపడాలనుకోవడం లేదు. అందులోనే విదురుని ద్వారా తనకు నచ్చిన పరిష్కారం లభించాలి. అదీ అతని ఆరాటం.

మానవుల మధ్య పరస్పర గౌరవాధిక్యాన్ని తెలుపుకునేందుకు కావలసిన నైపుణ్యాలు మనుజుల స్వతంత్ర వ్యక్తిత్వంలో నుండే ప్రవహిస్తాయి. కాబట్టి మానవుల మధ్య సంబంధబాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి వాటిని నిలుపుకోవడానికి అనువైన ప్రదేశం మనలోని “అంతరంగ”మే. అది ప్రభావితమయ్యేది మనలో నిర్మాణమయిన శీల సంపదవల్లనే. ఆ శీల నిర్మాణం వల్లనే మనలో వ్యక్తుల పట్ల సంఘటనల పట్ల ఒక ప్రాధాన్యతాక్రమం ఏర్పడుతుంది. అదే పరస్పరాధారితకు మూలం… అదే మానవ సంబంధాలను పటిష్టపరుస్తుంది. ఈ దృష్టి ధృతరాష్ట్రునిలో లేక కాదు. కాని అతనిలో రాజ లోభము, పుత్రవాత్సల్యం న్యాయాన్ని ధర్మాన్ని అధిగమించి ముందుకు సాగడం వల్ల మరొక ఆలోచనను దరిచేరనీయడం లేదు. పాండవులను పరవారిగా తలచడం వల్ల “పరస్పరాధారిత” చట్రంలో వారిని చూడనివ్వడం లేదు.

“సామాజిక ప్రయోజనం కన్నా స్వప్రయోజనమే మిన్న” అనే భావన మనసును ఆక్రమించి… మరొక భావనను దరిచేరేందుకు అనుమతించని కారణంగా అతనిలో చాంచల్యత ఏర్పడింది. ఎదుటి పక్షం వారు బలవంతులవడం వల్ల తన సైన్యం అధికమైనదైనా.. తనలో వ్యగ్రత నిండిపోయింది. అలాగని వారిని దగ్గరగా తీయడం తనకు తనవారికి ఇష్టంలేదు. చాలా కాలం నుండి చాలా అసౌకర్యంగా ఉన్న ఈ బాధ నుండి తాత్కాలిక ఉపశమనం కావాలి. అదే విదురుని పిలిపించుకునేందుకు దారితీసింది. ఈ బాధ తాత్కాలిక విముక్తిని కోరినా అది సాకారమయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ధృతరాష్ట్రుడు ఆ బాధను మరింతగా దాచిపెట్టుకొని పైకి మాత్రం జిజ్ఞాసువుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు.

vidurudu - విదురుడు

ధృతరాష్ట్రుని ఈ మానసిక స్థితిని తెలిసిన విదురుడు తన ప్రయత్నంలో భాగంగా కలసి ఉంటే కలిగే ఉపయోగం గురించి చెపుతున్నాడు. సమస్య యొక్క బాహ్యరూపాలు యొక్క లక్షణాలను గుర్తించిన వైద్యుని పాత్రలో విదురుడు ప్రయత్నిస్తున్నా.. రోగి అంతరంగంలో నుండి వెలువడుతున్న విపరీత లక్షణాలను.. తన ప్రయత్నం విఫలమౌతున్న విషయాన్ని గుర్తిస్తున్నాడు విదురుడు. కాని తన ప్రయత్నాన్ని విరమించలేదు.

ఈ సందర్భంగా, మనందరికీ తెలిసిన “బాతు బంగారు గుడ్ల” కథను గుర్తుచేసుకుందాము. అందులో బంగారు గుడ్లు మనలోని ప్రభావశీలతకు ప్రతీకలు. ఆ బంగారు గుడ్లు ప్రతిరోజూ మనకు కావాలి అంటే… బాతును జాగ్రత్తగా చూసుకోవాలి. మానవ సంబంధాలను అభివృద్ధి చేసుకొని… పటిష్టపరచుకొని… పరస్పరాధిత సమాజాన్ని సాకారం చెయ్యడం వల్లనే అత్యున్నత ఫలితాలను సాధించగలుగుతాము. ఇదే అంశాన్ని విదురుడు చాలా సున్నితంగా చెపుతున్నాడు.

Cooperation is the path to progress.. సహకార స్వభావమే అభ్యుదయానికి మార్గం:

న తద్బలం యన్మృదునా విరుధ్యతేసూక్ష్మో ధర్మస్తరసా సేవితవ్యః ప్రధ్వంసినీ క్రూర సమాహితా శ్రీర్మృదు ప్రౌఢా గచ్చతి పుత్రపౌత్రాన్! రాజా! మెత్తని వానితో శత్రుత్వము పెంచుకోవడం నీ బలమునకు సంకేతము కాదు. సూక్ష్మమగు ధర్మమును తెలిసి ఉపేక్ష చేయకుండా ఆచరించాలి. క్రూరుని వద్ద ఉండే సంపద ఎప్పటికైనా నశించిపోతుంది. మెత్తని వాడు ఆదరిస్తే సంపద పుత్రపౌత్రానుగతంగా వృద్ధి చెందుతుంది. నీ కుమారులగు కౌరవులు పాండవులను, పాండవులు నీ కుమారులను పరస్పరము రక్షించుకొనవలయును. నీవు ఈ ఇరువర్గాలకు ఆధారమైన పట్టుకొమ్మ లాంటి వాడవు. పాండవులను చేరదీసి అందరూ సుఖాలను పొందడం యుక్తము. ప్రజ్ఞానిధివి, ఆలోచించు. గత అనుభవాలను గుర్తు చేసుకో. కౌరవ పాండవుల ఆంతర్యాలను అర్థం చేసుకో. రెండు బలాలు ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు సన్నద్ధమైతే, రెండు బలాల మధ్య నెలకొన్న నకారాత్మక స్పర్ధ సకారాత్మక స్పర్ధగా మార్పుచెందితే నీ ప్రభుత్వానికి ఎదురు ఉండదు.

ఏ సమాజంలోనైనా, స్పర్ధలో ఎదుటి వారిని నాశనం చేయాలనుకోవడం… వల్ల ఆ సంస్థ మాత్రమే కాదు ఆ సంస్థపై ఆధారపడిన వారంతా నిరాశ్రయులౌతారు. అంతేకాదు ఒక కక్షిదారు పతనమైతే మరొకరు రారని గ్యారంటీ లేదు. ఇలా ఎంత మందితో నిరంతర యుద్ధం సాగిస్తాము… అనుభవం అనేది గొప్ప గురువు. అనుభవం జీవిత సత్యాలను గుర్తించేట్టు చేస్తుంది. మన వ్యక్తిత్వం పరిణతి చెందేందుకు ఉపకరిస్తుంది. అనుభవం వల్ల వ్యక్తులను సమాజాన్ని అర్ధం చేసుకోవడం సులువవుతుంది.

మన ఆధిక్యతను చాటుకోవడం తప్పా ఒప్పా అనేదానికన్నా… దాని వల్ల ప్రయోజనం ఏమిటి అనేదే ముఖ్యం. మన అస్థిత్వాన్ని ప్రశ్నించే ఏ ప్రతిఘటననైనా సమర్ధవంతంగా ఎదుర్కొనవలసిందే. ముల్లును ముల్లుతో తీయడం సమంజసమే… కాని ఎదుటి వారు నీ క్షేమాన్ని కోరే సమయంలో వారితో కలహానికన్నా స్నేహమే ఉపయోగకరం. సమర్థులైన వారి మధ్య స్పర్ధ మంచిదే. స్పర్ధ లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. అయితే స్పర్ధ ఎదుటివారి నాశనాన్ని కోరేదిగా ఉండవద్దు. ఎదుటి వారి శక్తి సామర్ధ్యాలు మనకు సవాలుగా మారిన వేళ, నకారాత్మక పోటీ వల్ల ఎదుటి వారి శక్తియుక్తులే కాక మన శక్తియుక్తులనూ వ్యయించాల్సి ఉంటుంది. అదే సకారాత్మక పోటీ వల్ల రెండు వర్గాలలోని అంతర్గత శక్తి సామర్ధ్యాలు అత్యున్నత స్థాయిలో, ఎక్కువ 

మొత్తంలో ఇరువురికీ ఉపయోగపడతాయి. స్పర్ధ జీవితాన్ని ఉన్నతీకరించాలే కాని మన జీవితాన్ని, మనపై ఆధారపడిన వారి జీవితాన్ని అధమాధమ స్థితికి చేర్చడం సరికాదు. సకారాత్మక పోటీ వల్ల రెండు పక్షాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనాలి. నిజానికి సామర్థ్యం కలిగిన వ్యక్తులు లేదా సంస్థలు పోటీదారులైతే ఆత్మీయులైన స్నేహితుల కన్నా అధికమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. అది- ఇరువురు వ్యక్తులు పరుగుపందెంలో పోటీపడిన వేళ… ఎదుటివారిని దాటి వెళ్ళడం రెండు విధాలుగా చేయవచ్చు. వారిని మోసం చేసి పడగొట్టి దాటవచ్చు… ఎదుటివారికన్నా అధిక సామర్ధ్యాన్ని సాధించి అధిగమించవచ్చు. ఎదుటి వారు మనలను దాటిన ప్రతిసారి మనలోని శక్తి సామర్ధ్యాలను ఉన్నతీకరించుకోవడం సకారాత్మక పోటీగా చెప్పుకోవాలి. 

నిన్నటి మీద ఈ రోజు ఉన్నతీకరించబడటం నిజమైన స్పర్ధ. ఎదుటివారిని అధిగమించేందుకు చేసే ప్రయత్నం మనలోని ప్రతిభాపాటవాలను ఉన్నతీకరిస్తుంది, సాంకేతికంగా ఆలోచింపచేస్తుంది, ఆధునీకరింపచేస్తుంది. అందలమెక్కిస్తుంది. స్పర్ధ సంఘర్షణగా మారితే, ఎదుటివారి నుండి దూరంచేస్తే… “నేనూ-నాది” అనే భావనలో ముంచితే స్పర్ధ యొక్క నిజమైన ప్రయోజనం/ ఉద్దేశ్యం మారిపోతుంది. నేను సత్ఫలితాలు సాధించాలి అనుకోవడం మంచిదే కాని ఎదుటి వారు నాశనం కావాలనుకోవడం సమంజసం కాదు. అది ఆరోగ్యకరమైన పోటీ కాదు.

ఇరువురు వ్యక్తులు ఒక అడవిలో తపస్సు చేస్తున్నారట. ఒకరికి దేవుడు ప్రత్యక్షం అయి ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు. అతడన్నాడు.. ఎదుటి వ్యక్తి ఏది కోరుకుంటాడో అతనికన్నా రెట్టింపు నాకు ఇమ్మన్నాడు. దేవుడు సరేనన్నాడు. మరొక వ్యక్తికీ దేవుడు ప్రత్యక్షం అయి అతనిని కోరుకొమ్మన్నాడు. ఆ భక్తుడు.. అయ్యా ముందు వ్యక్తి ఏం కోరుకున్నాడు అన్నాడు. దేవుడు చెప్పాడు. అయితే నాకు ఒక కన్ను లేకుండా చేయమన్నాడట. తథాస్తు అన్నాడు దేవుడు. దానితో వీనికి ఒక కన్ను వానికి రెండు కన్నులూ పోయాయి. కొన్ని సంవత్సరాలు తపస్సుకు ఫలితంగా ఇరువురికీ అదనంగా ఏమీ రాలేదు సరికదా ఉన్న వాటిని పోగొట్టుకున్నారు. ఒకరిని అధిగమించడం అంటే నిజానికి మనలో సృజనశీలత వెలుగుచూడాలి. 

అంతర్గత శక్తి సామర్ధ్యాలను అత్యున్నతస్థాయిలో ఉపయోగించుకో గలగాలి. అదే నిజమైన సకారాత్మకమైన స్పర్ధ. ఆ జ్ఞానం కరవయినప్పుడు పతనావస్థకు చేరుకుంటాము. నకారాత్మక వైఖరి ప్రగతికి మార్గం చూపదు. సకారాత్మక వైఖరితో కూడిన స్పర్ధ నాణ్యత, శ్రేష్ఠత, వ్యయ నియంత్రణ, కచ్చితత్వం, నిర్దుష్టత, సమగ్రత, సంపూర్ణత, విశ్వసనీయత, స్పష్టత, పరిశుద్ధత లాంటి పలు అంశాలకు నాంది పలుకుతుంది. దానితో వినియోగదారులతో సత్సంబంధాలు బలపడతాయి. 

చేసే వ్యాపారంపై ఏకాగ్రతా పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే విధానంలో సమాచార పంపిణీ, విశ్లేషణ సులువవుతుంది. అమ్మకందారులతో, వినియోగదారులతో, ఉద్యోగులతో, పోటీదారులతో సంబంధాలు  బలపడతాయి. నవ్యత, నూతన ఆవిష్కరణలపై శ్రద్ధ పెరుగుతుంది. సాధారణ పనులను అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో నిర్వహించే మానసిక స్థితి పెరుగుతుంది. మన ప్రయాణం… “In search of Excellence” వైపు సాగుతుంది. ప్రయోజనం ప్రభావవంతంగా ఆవిష్కృతమౌతుంది. సమస్యలకు సరళమైన పరిష్కారాలు కనుగొనడం సులువవుతుంది. రాజా! నీ మూలబలం అభ్యుదయాన్ని సాధించాలి అంటే.. నీ కార్య కుశలత శ్రేష్ఠతను సాధించాలి. దానికి నీ విజ్ఞతను జోడించు. అసాధారణ ఫలితాలు సాధిస్తావు. పాండవులకు వారి రాజ్యాన్ని అప్పగించు. రెండు వర్గాలలో నిర్మాణాత్మక వైఖరి, సకారాత్మక స్పర్ధ వెలుగుచూస్తుంది. దానితో నీ రాజ్యం/సంస్థ సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుంది.

Who will win? ఎవరిని విజయం వరిస్తుంది?

జీవితం సాధనాపర్వం అంటాడు విదురుడు. ఏమీ సాధించని జీవితం మృత ప్రాయంగా గుర్తించాలి. మంచిచెడ్డలు, మానావమానాలు, గెలుపు ఓటములు జీవన యానంలో సహజమైనవి. వాటిని సమన్వయం చేసుకుంటూ, సాగితే లక్ష్యాన్ని చేరుతాము. భయం, సమాదరించుకుంటూ ముందుకు వాటిని తప్పించుకోవడం, ఆత్మన్యూనతాభావం, బద్ధకం లాంటివి లక్ష్యసాధనలో ప్రతిబంధకాలు. వీటిని అధిగమించగలిగిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలుగుతారు… విజయ సాధకులుగా నిలుస్తారు.

ఏడుపుగొట్టు వారి యందు, ఒడలెరుగని వారి యందు, సోమరులందు, ఇంద్రియ నిగ్రహణలేని వారి యందు, ఉత్సాహములేని వారియందు లక్ష్మి నిలువదు అంటాడు. విదురుడు. లక్ష్మి అనగా విజయం. ధర్మార్థములకు భంగము కాని సుఖములు అనుభవించవచ్చునే కాని మొండి వ్రతములు చేయరాదని చెపుతాడు విదురుడు. మంచి తనము, దానము, పరాక్రమము, వ్రతము అనునవి హద్దులు మీరి ఆచరించే వానిని, తన తెలివితేటలే గొప్పవని భావించే వానిని చూసి లక్ష్మి భయపడుతుందని అంటాడాయన.

మిక్కిలి గుణవంతులు అనగా అతి మంచివారు, గుణహీనులయందు కూడా లక్ష్మి నిలవదు.. ఎందుకంటే.. విజయలక్ష్మికి గుణములపై మమకారం ఉండదు… ప్రయత్న శీలతయే ముఖ్యము. అతి మంచితనాన్ని ప్రదర్శించే వారిని నీచబుద్ధులు బెదిరిస్తూ ఉంటారు. పనులలో చొచ్చుకొనిపోవుట (Proactiveness), ఇంద్రియ నిగ్రహము, సమర్ధత (Aptitude), పొరపాటు పడకుండుట, ధైర్యము, జాగరూకత, చక్కగా విచారించి కార్యమునకు దిగుట అనునవి విజయానికి ప్రాథమిక లక్షణాలు.

భవిష్యత్తును దర్శించడం విజయసాధనలో ముఖ్యమైన అంశం. లక్ష్యసాధనలో ఎదురయ్యే అవరోధాలను ఊహించి వాటిని అధిగమించే ఉపాయములను తెలిసిన వానికి విజయం అందివస్తుంది. దానికి పనులను పూర్తి చేయాలనే దృఢసంకల్పం ప్రేరణగా నిలుస్తుంది. గతంలో ఎక్కడ తాను అపజయం పాలయ్యాడో, దానికి కారణాలేమిటో గ్రహించగలిగిన వాడు విజయమార్గంలో గమించగలుగుతాడు. దీనికి తెలివి కావాలి కాని అది అతి తెలివిగా మారకూడదు.

వ్యాన్ టైర్ పంక్చర్ అయింది. టైర్ మారుస్తున్న క్రమంలో ఆ చక్రానికి ఒక వ్యాన్ డ్రైవర్ పిచ్చాసుపత్రిలో కొంత సామాను చేరవేశాడు. ఆ క్రమంలో తన మంలో ఒక వ్యక్తి ఆసుపత్రి నుండి వస్తూ.. ఏమయిందని ప్రశ్నిస్తాడు. డ్రైవర్ డిపోయాయి. ఎలా ఆ సమస్యను అధిగమించాలని ఆలోచిస్తున్న సమస్యను చెపుతాడు. దానికి అతను చిన్న పరిష్కారాన్ని సూచిస్తాడు. మిగిలిన అన్ని చక్రాలు ఉన్న నలో నుండి ఒక్కొక్కటి తీసి ఈ చక్రానికి వేయి.. నెమ్మదిగా ముందున్న మెకానిక్ షాపు వద్దకు వెళ్ళాక తిరిగి అన్నింటినీ మార్చుకొమ్మంటాడు. డ్రైవర్ ఆ సలహా పాటిస్తాడు. ఇది తెలివికి ప్రతీక. ఆ డ్రైవర్ అడిగాడు… ఇంత తెలివైన వాడివి ఈ పిచ్చాసుపత్రిలో ఎందుకున్నావు? దానికి అతనన్నాడు.. అన్నీ తెలుసును కాని అత్యుత్సాహంతో చేసిన తప్పులు, అతి తెలివి ఈ పిచ్చాసుపత్రిలో పడేసిందని. ఇదీ తెలివికి అతి తెలివికీ ఉన్న భేదం. సమస్య ఉన్నది అంటే దానికి పరిష్కారం ఉంటుంది. అయితే ఆ పరిష్కారాలు ఎన్ని ఉన్నాయని గుర్తించడం, అందులో అత్యుత్తమమైన దానిని, ఆచరణ యోగ్యమైన దానిని ఎన్నుకోవడం, వెంటనే దానిని అమలుచేయడం విజయానికి చేరుస్తుంది.

జీవితంలో మనం ముందుకు వెళ్లడం లేదు అంటే వెనుకకు వెళుతున్నట్లే పరిగణించాలి. మన మార్గంలో ఆ క్రమంలో ఎందరో మనల్ని దాటి వేసే ప్రమాదం ఉండనే ఉన్నది. ఎవరిలోనైతే శ్రద్ధ, బలమైన కోరిక, శిక్షణతో పరిపుష్టమైన ఆచరణాత్మక జ్ఞానం, నిరంతరసాధన, పట్టువదలని దీక్ష, ఆలోచనాశక్తి, సాధించగలననే అచంచల విశ్వాసం, ఏకాగ్రత, అభ్యాసం, ఆశావహ దృక్పథం, జీవన ప్రమాణాలు పెంచుకోవాలనే తపన నిలుస్తాయో వారి విజయాన్ని ఆపగలిగే శక్తి ఎవరిలోనూ లేదు.

నిజానికి ఆలోచనలు వివిధ రకాలుగా సాగుతాయి. అవి సకారాత్మక ఆలోచనలు, సృజనాత్మక ఆలోచనలు. నకారాత్మక ఆలోచనలు పనికిరాని ఆలోచనలు, విషపూరిత ఆలోచనలు. సకారాత్మక ఆలోచనలు, సృజనాత్మక ఆలోచనలు వ్యక్తి ఉద్ధరణకు ఉపయుక్తమౌతాయి. అంతర్గత శక్తిసామర్ధ్యాలు వెలికి రావాలంటే అంతర్గతంగా పెంచుకున్న నకారాత్మక నమ్మకాలు, విషపూరిత ఆలోచనలు బయటకు వెళ్ళాలి. మనసు పెద్ద ఆయస్కాతం లాంటిది.  ఒక ఇనుపముక్కకు ఆయస్కాంతశక్తిని ఇస్తే అది తన బరువుకన్నా 12 రెట్ల బరువును పైకెత్తగలుగుతుంది. ఆ ఆయస్కాంతశక్తి లేని నాడు అదే ఇనుప ముక్క కాకి ఈకను కూడా కదిలించలేదు. అలాగే సకారాత్మక ఆలోచనలతో సంతృప్తమైన మనస్సు విజయసాధనకు అవసరమైన శక్తిసామర్ధ్యాలను ఆకర్షించగలుగుతుంది.. పనికిరాని ఆలోచనలతో నిండిపోతే… నిరర్థక జీవితాన్ని ప్రసాదిస్తుంది.

ఒక వ్యక్తి క్రుంగిపోవడానికి ఎదురైన బాధలు కారణం అనుకుంటాము కాని దానికన్నా ఆ సన్నివేశంపై తనకున్న అభిప్రాయాలు తన బాధలకు ఎక్కువ కారణాలు అవుతాయి. ఈ సత్యాన్ని గ్రహించి ఏది తన ప్రగతికి కారణమో దానిని ఆదరిస్తే… అంతర్గతంగా నిరుపయోగంగా ఉన్న 90% శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవచ్చని చెపుతారు.

మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యాలు, పోటీతత్వ నైపుణ్యాలు, ప్రక్రియా నైపుణ్యాలు విజయసాధనలో అత్యవసరమైనవి. సాధించిన జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా మలుచుకోవడం, ఆధునీకరించుకోవడం సాంకేతిక నైపుణ్యాలుగా చెప్పుకోవచ్చు. ప్రత్యర్థుల బలాబలాలను తెలుసుకోవడం, ఎత్తుగడలు, తగిన వారిని అర్హత ప్రాతిపదికగా తగిన పదవిలో నియమించడం లాంటివి పోటీతత్వ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయుక్తమౌతాయి. నిర్దుష్టమైన ప్రణాళికలు రచించుకోవడం, అవసరమైన సమాచారాన్ని సేకరించుకోవడం, సరిగా విశ్లేషణ చేసుకోవడం, అవసరమైన శిక్షణను పొంద సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, న్యాయంగా ఉండటం లాంటివి ప్రక్రియా నైపుణ్యాలుగా పరిగణింపబడతాయి.

ఇలా అవసరమైన జ్ఞానాన్ని ఆధునీకరించుకుంటూ… నిరంతరం తనను తాను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగే వ్యక్తి విజయసాధకునిగా నిలుస్తాడు… భావి తరాలకు మార్గదర్శకుడౌతాడు.

Righteousness-Unrighteousness-Consequences ధర్మం-అధర్మం-ఫలితాలు:

ధర్మము ఒక క్రమశిక్షణాయుతమైన జీవన విధానం. భౌతిక జీవితంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలలో అనుసరించదగినది. వేదాలలో చాలా పదం ప్రాకృతిక ధర్మానికి ప్రత్యామ్నాయంగా వాడబడింది. సనాతన సంస్కృతిలో ధర్మం అనేది స్వర్గాదిభోగాలను ఇచ్చేదిగా కాక స్థిరమైన మానవ సమాజాన్ని నిలిపే జీవన విధానంగా, ప్రకృతితో సహజీవనం చేసే సమన్వయతా సాధనంగా చెప్పబడింది. కాబట్టి ధర్మం అనేది సమాజగతి నుండి వేరుచేయడానికి అవకాశం లేనటువంటి దానిగా ధర్మాచరణలో విఫలమవడం లేదా ధార్మిక నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించడం కూడా పరిగణించాలి. దానికి విరుద్ధంగా నడవడం అధర్మంగా పరిగణించబడుతుంది.

 అధర్మమే. నిజానికి సుస్థిర సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్రను పోషించే ధర్మానికీ, ఆధ్యాత్మిక జీవనానికీ సంబంధం లేకున్నా, లౌకిక జీవితాలు గాడి తప్పకుండా ఉండేందుకు ఆధ్యాత్మికతను కూడా దీనికి జోడించడం జరిగింది. ధర్మానుసరణ పుణ్యాన్ని ఇస్తుందని, తద్వారా స్వర్గం లభిస్తుందని, అధర్మాచరణ పాపాన్ని ఇస్తుందని, తద్వారా నరకం కలుగుతుందని సూత్రకారులు సూత్రీకరించారు.

ఇక్కడ సాధారణ వ్యక్తికి ధర్మాచరణ భౌతిక ప్రయోజనానికా లేక ఆధ్యాత్మిక ప్రయోజనానికా? అన్న అనుమానం రావచ్చు. ఈ వైవిధ్యం లేదా సంఘర్షణను నివృత్తి చేస్తూ… ఆపస్తంభుడు భౌతిక ఆధ్యాత్మిక విలువలకు ధర్మాన్ని అనుసరించాలని నిర్ణయం చేశాడు. ఆపస్తంభుడు దీనికి ఒక ఉదాహరణను ఇచ్చాడు. ఒక మామిడి చెట్టును నాటుతాము. అది పెరిగి పెద్దదవుతుంది. దాని కొమ్మల ద్వారా నీడ పరుచుకుంటుంది… ఎంతో మంది పాంథులు (బాటసారులు) ఆ నీడలో సేద తీరుతారు. దాని నుండి వచ్చే వాసనను అనుభవిస్తారు. ఇవన్నీ భౌతిక ప్రయోజనాలే కాని చెట్టు నాటిన వాడి చివరి ప్రయోజనం చక్కని మాధుర్యమైన మామిడిపండ్లను అనుభవించడం.. అదే ఆధ్యాత్మికమైన ప్రయోజనంగా చెప్పాడతను. ఆధ్యాత్మికత లక్ష్యితమైన ఉత్పత్తి కాగా ఉపఫలం (By product) భౌతిక ప్రయోజనాలుగా చెప్పబడింది. ధర్మార్థకామమోక్షాలనబడే చతుర్విధ పురుషార్థాల సాధనలో ధర్మబద్ధంగా అర్థకామాలను సాధించి మోక్షాన్ని పొందాలని సూచింపబడింది.

మానవ జీవన విధానంలో కనిపించే ద్వంద్వ ప్రవృత్తులు… ధర్మము, అధర్మములు కూడా విదుర నీతి ఎనిమిదవ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. అది ఎంత గొప్ప విషయమైనా ధర్మానికి విరుద్ధమైనచో ఎవరు చెప్పినా చెప్పకున్నా దానిని పాము చివికిపోయిన తన కుబుసాన్ని విడిచినట్లుగా వదిలివేయాలి. అధర్మ మార్గంలో గెలిచిన గెలుపు పాపాన్ని కలిగిస్తుందని చెపుతాడు. అంతేకాదు, కామ సాధన కాని, భయము చేత కాని, బ్రతుకుకు ప్రమాదం వచ్చిన వేళనైనా ధర్మాన్ని వదల కూడదంటున్నాడు విదురుడు.

సుఖదుఃఖములు చెడునవే కాని ధర్మము చెడనిది, శాశ్వతమైనది. అశాశ్వతమైన రాజభోగాల కొరకు శాశ్వతమైన ధర్మాన్ని విడవడం కూడదని చెపుతున్నాడు. . మరొక ఉదాహరణను ఇస్తున్నాడు విదురుడు… వ్యక్తి తన శక్తికి మించిన సంపదను గడించాడు… కాని అతని మరణానంతరం ఆ సంపదను ఎవరో అనుభవిస్తారు. శరీరంలోని ధాతువులను క్రిమికీటకాదులు తినివేస్తాయి. శరీరాన్ని అగ్ని భక్షిస్తుంది… తనను వెంట వచ్చేది ఒక్క ధర్మం మాత్రమే అంటూ… ధర్మబద్ధంగా పాండవులకు రాజ్యభాగం ఇమ్మంటాడు.

ప్రజ్ఞాపూర్ణుడై విచక్షణ చేత ధర్మాధర్మాలను తెలుసుకోవాలి. తనకు సందేహం వస్తే తెలిసిన పండితులను అడిగి తెలుసుకోవాలి. అలాంటి వాడు ధర్మాతిక్రమణ చేయడంటాడు. అధర్మాచరణ వల్ల అశాంతిమయ జీవితాన్ని గడపవలసివస్తుంది. కాబట్టి ధర్మ మార్గంలో నిర్ణయం తీసుకోమని ధృతరాష్ట్రుని హెచ్చరిస్తాడు విదురుడు. విదురుని మాటను లెక్కించని ధృతరాష్ట్రుడు అధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు.. మహా సంగ్రామానికి నాంది పలికాడు, తన సంతానంతో సహా ఎందరి మరణాలకో కారణమయ్యాడు.

ముగింపు:

విదురుడు చెప్పిన నీతి జీవిత సారాంశం. శాశ్వతమైన ధర్మాన్ని వదిలిపెట్టి, తాత్కాలికమైన రాజభోగాల కోసం అధర్మాన్ని ఆశ్రయించడం చివరికి నాశనమే తీసుకువస్తుంది. ధర్మమే మనతో జన్మ నుండి మరణం వరకు నడిచే ఏకైక సహచారి. సంపద, శరీరం, బంధువులు అన్నీ ఈ లోకానికే పరిమితం. కానీ మన కర్మలు, ముఖ్యంగా ధర్మబద్ధమైన చర్యలు, మరణానంతరం కూడా మనకు సహకరిస్తాయి.

విదురుని మాటను తక్కువచేసిన ధృతరాష్ట్రుడు తన కుటుంబానికే శాపంగా మారాడు. అతని తప్పుడు నిర్ణయాలే మహాభారత యుద్ధానికి దారి తీశాయి. కాబట్టి, ప్రతి వ్యక్తీ ధర్మాధర్మాలని స్పష్టంగా తెలుసుకుని, బుద్ధి, విచక్షణతో ధర్మ మార్గాన నడవాలి. అదే నిజమైన శాంతికీ, విజయానికీ పునాది.

…..The End….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *