Vidura Niti—Life Lessons That Are Still Applicable: Part 4

Vidura Niti—Life Lessons That Are Still Applicable: Part 4

Vidura Niti—Life Lessons That Are Still Applicable: Part 4

Vidura Niti—Life Lessons That Are Still Applicable: Part Four 4 నిండుకుండ తొణకదు: సాధనకు అలుపు లేదు: ఎదగలేని గానుగెద్దు… పంచుకోవడమే పెంచుకోవడం:

యస్య కృతం న విఘ్నంతి శీతముష్టం ఖాయం రతిః సమృద్ధి రసమృద్ధి ర్వా సవై పండిత ఉచ్యతే!

ఎవరైతే నిశ్చిత మనస్కులై, దృఢసంకల్పంతో కార్యాన్ని ఆరంభిస్తారో, అతనికి తాను చేసే పనికి చలి, వేడి, భయము, కామము, కలిమి లేములు అనేవి, విఘ్నములు కలిగించలేవు.

 ప్రజ్ఞానిధులు “ధృత్యోన్నతోత్సాహులై ప్రారబ్ధార్థము లుజ్జగింపరు” అంటారు. “ఒకచో నేలను పవ్వళించు, నొకచో నొప్పారు బూసెజ్జపై; ఒకచో శాకము లారగించు” అంటూ కార్యసాధకుడు ఏ అవరోధాలను లెక్కింపడు సుఖదుఃఖాలను గణింపడు అంటారు.  కామానికి దూరంగా ధర్మము, అర్థమును అనుసరించి వ్యవహరించే వానిలో ప్రజ్ఞ వెలుగు చూస్తుంది. ప్రజ్ఞకు నిలకడ ఉండదు. ప్రజ్ఞ కలిగినవాడు తన శక్తిమేరకు ఆయా పనులను చేసేందుకు సన్నద్ధమౌతాడు. కార్యసాధనలో తనకు తానే ప్రేరణనిచ్చుకుంటాడు. దేనినీ తేలికగా విడిచిపెట్టడు. Vidura ఇలా సెలవిచ్చాడు

బుద్ధితో విచారించి విషయాన్ని గ్రహిస్తాడు. తన విజ్ఞానాన్ని పెంచుకునేందుకై వినడం, మననం చేయడం, అధ్యయనం చేయడం, అవగతం చేసుకోవడం తన నైజంగా మార్చుకుంటాడు. లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని సాధనలో శ్రమిస్తాడు. ఉచితంగా, అయాచితంగా దేనినీ ఆశపడడు దేనినీ కామించడు. తన అర్హత ప్రాతిపదికగా ఉన్నతమైన ఆశయాన్ని ఏర్పరుచుకొని దాని సాధనలో తపిస్తాడు. అలాగని, దాని ఫలితానికి అతుక్కుపోడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆశించిన ఫలితం రాకపోతే విచారించడు. తన బుద్ధికి పదును పెట్టి మరొక దారిలో ప్రయత్నిస్తాడే కాని, తన అపజయం లేదా ఓటమికి మరొకరిని బాధ్యునిగా చేసే ప్రయత్నం చేయడు అని అంటాడు Vidura.

vidura the mahabharat

ఒక పని చేసే ముందు తన బలాబలాలను, సాధ్యాసాధ్యాలను, అవరోధాలను, అవకాశాలను కూలంకశంగా విచారించి ముందుకు సాగుతాడు. తాను నెరవేర్చలేని హామీలను ఏనాడూ ఇవ్వడు.. ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితిలోనైనా నిర్వహిస్తాడు. అలాగని అభయమునివ్వడం మానుకోడు. ఉన్నత ఆశయం కలిగిన వ్యక్తి తానేది చేయగలడో అదే చెపుతాడు. ఏది చెపుతాడో అదే చేస్తాడు. తానేది చేయగలడో దానికే స్పందిస్తాడు… దేనికి స్పందిస్తాడో దానినే చేస్తాడు. ఏది చేయగలడో దానిని గూర్చి మాత్రమే ఆలోచిస్తాడు… ఏది ఆలోచిస్తాడో . దానిని చేస్తాడు. 

సరైన దానిని ఎన్నుకొని చేస్తాడు, దానిని సరైన విధానంలో నిర్వహిస్తాడు. ఇది బుద్దిమంతుడు, ప్రాజ్ఞాపూర్ణుడైన నాయకుని లక్షణంగా చెపుతున్నాడు Vidura. కానివే. ఏది ఉచితమో దానిని ఆదరించడం… ఏది అనుచితమో దానికి దూరంగా అన్నిటికీ “ఔనని” తలూపడం, అన్నింటిని “కాదని” నిరసించడం రెండూ సమంజసం ఉండటం ప్రయోజనకారి. ప్రజ్ఞ కలిగిన నాయకుడు ఎప్పుడూ తొందరపాటుతో ఒకరి పక్షాన నిలవడు, వార్మి మొండిగా వాదించడు.. పోరాడడు. ధర్మాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు. తాను స్వతంత్ర భావనలతో సమగ్రతా మూర్తియై ప్రవర్తించే ప్రయత్నం చేస్తాడు. దానితో వద్దనుకున్నా ఇతరులే తన వెంట నడుస్తారు అని అంటాడు Vidura.

ఒకప్పుడు ఒక అడవిలో రెండు పిల్లులు స్నేహంగా ఉండేవి. వాటికి ఒకనాడు పెద్ద జున్ను ముక్క దొరికింది. దానిని స్వంతం చేసుకోవాలని ఇరువురికి ఉన్నా స్నేహధర్మాన్ని పాటిస్తూ పంచుకోవాలని భావించాయి. కాని ఆ ముక్కను ఎలా పంచుకోవాలో వాటికి అర్థం కాలేదు. రెండూ ఒక నిర్ణయానికి వచ్చి దగ్గరలో ఉన్న ఒక కోతిని ఆ సమస్యా పరిష్కారానికి సహాయపడమని కోరాయి. కోతి సరేనని ఆ జున్ను ముక్కను రెండు ముక్కలు చేసి ఒక త్రాసు తెప్పించి రెంటినీ రెండువైపులా పెట్టింది. అందులో ఒకటి కొద్దిగా బరువుగా కనిపించింది. పెద్ద ముక్కలోని కొంత భాగాన్ని తాను మళ్ళీ కోసి ఎక్కువైన భాగాన్ని తాను మ్రింగివేసింది. మళ్ళీ అందులోనూ ఒకదానికన్నా మరొకటి పెద్దగా కనిపించింది. పెద్దదాన్ని మళ్ళీ కోయడం ఎక్కువ ఉన్న ముక్కను తాను తినడం… ఇలా మొత్తం జున్ను ముక్కను ఆ కోతి ఆరగించి “మీ సమస్య తీరిపోయింది గదా, మీ సమస్య పరిష్కరించిన దానికి నా ఫీజ్ పంపిస్తాను, డబ్బులు పంపండి” అని వెళ్ళిపోయింది. దానిని గమనించిన సాధారణ నాయకత్వ లక్షణాలు కలిగిన పిల్లులయితే అలాగే జీవించేవి. కాని ఈ పిల్లులు ప్రాజ్ఞత కలిగిన పిల్లులు కాబట్టి కోతి తమను మోసగించిందని తెలుసుకున్నాయి. మరొక తప్పు జరగకూడదని దానికి పరిష్కారం తామే కనుగొనాలని నిశ్చయించుకున్నాయి.

కొద్ది రోజుల తదుపరి వారికి మరొక చోట మరొక జున్నుముక్క దొరికింది. కానీ వారికి మొదటి సమస్యయే ఎదురయింది. దానిని ఎలా పంచుకోవాలో అర్ధం కాలేదు. బాగా ఆలోచించాక పరిష్కారం లభించింది. ఒక పిల్లి తన మిత్రునితో అంది… ఈ మారు కోతికి అవకాశం ఇచ్చి మోసపోకూడదు కాబట్టి మనమే దీనిని పరిష్కరించుకుందాము. ఈ జున్నును ఒకరం రెండు సమానభాగాలుగా చేద్దాము. రెండవ వారం ముందుగా కోరుకుందాము. ఈ మార్గం ఇరువురికీ ఆమోదయోగ్యమైంది. ఒక పిల్లి దానిని రెండు భాగాలు చేసింది. మరొకటి ముందుగా కోరుకున్నది. రెండూ హాయిగా, ఆనందంగా ఆస్వాదిస్తూ ఆరగించాయి.ప్రపూర్ణ నాయకుడు వివాదాలను అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలో పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు.. అందరినీ ఒప్పించి ఒక్కతాటిపై నడిపిస్తాడు. Offer and Receive అనే విధానంలో సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల వారిలో కలిగిన వికాసం శాంతికి మార్గం చూపుతుంది.

There is no end to practice. సాధనకు అలుపు లేదు:

న హృష్య త్యాత్మ సమ్మానే నావమానేన తప్యతే, గాంగో హ్రద ఇవాక్షోభ్యో యః స పండిత ఉచ్యతే! తత్త్వజ్ఞః సర్వ భూతానాం యోగజ్ఞః సర్వకర్మాణాం ఉపాయజ్ఞో మనుష్యాణాం నరః పందిత ఉచ్యతే!

ప్రజ్ఞ కలిగిన నాయకుడు తనకు సమ్మానం కలిగిన వేళ పొంగిపోడు, అలాగని అవమానం జరిగితే క్రుంగిపోడు. ఎలాగైతే గంగా ప్రవాహం ఒక పూలతోటగుండా సాగిపోయినా, మురికి గుంటల నుండి ప్రవహించినా ఆ వాసనలకు అతుక్కు పోకుండా ఆ రెంటినీ సమానంగా తీసుకుంటుందో… అలాగే విజ్ఞుడు, పండితుడైన వాడు మానవమానములను సమంగా చూస్తాడు. మనుషులలో తత్త్వజ్ఞుడు అనగా సర్వభూతముల తత్త్వము నెరిగినవాడు, సర్వకార్యముల రచనా ప్రణాళిక నెరిగినవాడు, అన్ని ఉపాయములను తెలిసిన వాడు.. పండితుడుగా వ్యవహరింపబడతాడు Vidura ఇలా సెలవిచ్చాడు.

తత్త్వము తెలిసినవాడు అంటే తార్కికంగా అన్నింటి అంతరంగ రహస్యాలను తెలిసినవాడు. ఏది మంచి ఏది చెడు విచక్షణా జ్ఞానం కలిగిన వాడు… చక్కని వాక్సంపద కలిగిన వాడు. సమయస్ఫూర్తి కలిగిన వాడు… తనకు జరిగిన మానవమానాలను సమంగా తీసుకుంటాడు. నిజానికి మానావమానాలు సాపేక్షాలే అయినా మానవ స్వభావం వాటికి త్వరగా స్పందిస్తుంది. తత్వము తెలిసిన వారి శాస్త్రజ్ఞానము బుద్ధికి, intellect శాస్త్రజ్ఞానానికి వశమై ఉంటుంది. కాబట్టి తొందరపాటు ఇలాంటి వ్యక్తులలో కనిపించదు అని అంటాడు Vidura.

ఎవరైనా హితవాక్యాలను చెపితే తొందరపడి ఆచరించరు అలాగని అనాదరణ చేయరు. తమ అనుయాయులను గౌరవిస్తూ వారిని సరైన దారిలో నడిపిస్తారు. వీరిలో నైతిక వర్తన ఉంటుంది. అపారమైన శక్తిసామర్ధ్యాలు ఉంటాయి. సమగ్రతతో కూడిన శ్రేష్ఠత, ఉత్తమత్వం ఉంటాయి. క్లుప్తత, సాంద్రత, గాఢత ఉంటాయి. వీరికి జీవకారుణ్య దృష్టి వ్యవసాయాదులపై మక్కువ ఎక్కువ. సరైన పనిని చేయడం, చేసే పనిని సరిగా చేయడం వీరి లక్షణం. స్వచ్ఛత, పవిత్రత, సౌందర్యము, జ్ఞానవికసన, విశదీకరణలు వీరిలో నిలుస్తాయి. వీరిలో విచక్షణతో కూడిన ఆచరణాత్మమైన జ్ఞానం వెలుగు చూస్తుంది. చేసే పనిని ఉపాస్యదైవం లాగా భావించే నైజం వీరి స్వంతం. నిజానికి పనిలో నిమగ్నం అవడమనేది అభివృద్ధికి సోపానం. 

పనిని ప్రేమించడం వల్ల ఏ కామనలు దరిచేరవని చెపుతారు. పని చేయాలనే ఉత్సాహం ఉరకలు వేసినంత కాలం వ్యక్తి  ఆరోగ్యవంతుడని భారతీయ ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. వాడకపోతే యంత్రం తుప్పుపట్టిన విధంగా మన మెదడునూ వాడకపొతే అది బద్ధకానికి అలవాటుపడి, నిరాసక్తంగా మిగిలిపోతుంది. జీవం ఉన్న మొక్కకు పెరగడం సహజం.. అలాగే జీవం కలిగిన వ్యక్తీ ఏదో ఒక పనిని నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి. అయితే తనను అభ్యుదయం వైపు నడిపేదిగా ఉండాలి. అధి భగవద్గీతలో కృష్ణుడు… అర్జునా! ముల్లోకాలలో నేను చేయవలసిన పనిలేదు.. సాధించాల్సినదీ లేదు.. నాకు అవసరమైనదీ లేదు. 

అయినా విరామం లేకుండా ని పనిని నేను చేస్తూనే ఉంటాను. అన్నీ ఉన్నప్పుడు ఎందుకు పని చేయాలి అంటే.. కర్తవ్యాన్ని నేను నిర్వహించకపోయినట్లయితే మిగిలిన వారు కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని కర్తవ్య విముఖులుగా నిలుస్తారు.. కాబట్టి నేను నిరంతరం ఏదో నిర్వహిస్తూనే ఉంటానంటాడు.నా కార్యాన్ని ఇది నిజమైన ఆదర్శప్రాయుడైన, పరివర్తన తీసుకురాగలిగిన నాయకుని లక్షణం. క్రియాశీలతయే నాయకుని లక్షణం. అదే అనుచరులకు ప్రేరణనిస్తుంది.

ఒకప్పుడు ఒక సాధకుడు సంపదను కోరి లక్ష్మీదేవిని గూర్చి తపస్సు చేసాడు. ఆమె ప్రత్యక్షం అయింది. సాధకుడు ఆమెను తన ఇంట నిలవాలని కోరాడు. ఆమె ఒప్పుకుంటూ.. “నీవు ముందు నడువు… నీ వెంట నేను నడుస్తాను… నీవు ఎక్కడైతే వెనక్కి తిరిగి చూస్తావో అక్కడే నేను మాయం అవుతాను” అన్నది. అతడు సరేనన్నాడు. ఇరువురూ నడక సాగించారు. సర్వాభరణ భూషితయై లక్ష్మీదేవి కాలి అందెలు ఘల్లుఘల్లు మనగా నడుస్తున్నది. కొంత దూరం వెళ్ళాక.. ఆయనకు అనుమానం వచ్చింది. వస్తున్న లక్ష్మీదేవి ఎలా ఉన్నదో… ఏయే ఆభరణాలు పెట్టుకున్నదో…చూడాలనే కోరిక కలిగింది. ఆపుకోలేని భావోద్వేగం వల్ల ఒక్కసారి వెనుదిరిగి చూసాడు.. అంతే అతని ప్రయత్నం వృథా అయింది. లక్ష్మీదేవి అంతర్ధానం అయింది.

ఇది కథే అయినా ఇందులో గ్రహించవలసిన నీతి ఉన్నది.

1. అత్యంత గహనమైన లక్ష్మీదేవి సాక్షాత్కరించినా, తానే సాధింపగలిగిన భౌతిక సంపదను కోరడం వల్ల తాను సాధించిన తాపసిక శక్తి వృథా అయింది. 

2. తన వెంట వస్తున్నది దేవత అని.. ఆమె అనుగ్రహించిన వరం నిరర్ధకంగా పోదనే ఇంగిత జ్ఞానం లేకుండా వెనుదిరిగి చూడటం వల్ల ఉదాత్తమైన ఫలితం చేజారిపోయింది.

3. ముందే వెనుదిరిగి చూస్తే ఆగిపోతానని చెప్పినా ఆపుకోలేని “భావోద్వేగానికి” కట్టుబడటం వల్ల సాధించిన ఫలితం నిరర్ధకమైంది.

4. ఏదైనా సాధించాలి అన్నప్పుడు ఆ సాధనకు లభించిన విజయం తాత్కాలికం కారాదు. ఆ విజయం మరొక విజయానికి పునాది కావాలి లేదా ప్రేరణ కావాలి. ఆ సాధన నిలిచిపోతే అభివృద్ధి నిలిచిపోతుంది.

5. లక్ష్మీదేవి (ధనము, పేరు ప్రఖ్యాతులు, విజయాదులు…) మన వెంట రావాలే కాని తన వెంట మనం నడవరాదు.

6. క్రికెట్ ఆటలో 100 పరుగులు తీసిన వ్యక్తి శతకం కొట్టాడని అంటారు. 99 వద్ద ఓపిక నశించి విరమించుకుంటే అతను ఏ నాటికీ శతకాన్ని పూర్తి చేయలేడు.

7. ఒక్కటే కదా అని నిర్లిప్తతను ఆశ్రయిస్తే… అపజయం మననాదరిస్తుంది. లక్షలో ఒక్క రూపాయి తగ్గినా అది లక్షగా పరిగణించబడదు.

8. హనుమంతుడు తన శక్తి సామర్థ్యాలు గుర్తించలేక ప్రక్కన కూర్చున్నాడు. తోటి వారు ఇచ్చిన ప్రేరణతో తన శక్తిసామర్ధ్యాలను గుర్తించాక, సముద్రాన్ని దాటాడు, ఒంటి చేతితో లంకలో రాక్షసులను చంపాడు, లంకను దహించాడు…

9. విజ్ఞులైన నాయకులు తాము నిరంతరం తమ రంగంలో సాధన చేస్తూనే అనుచరులను సన్నద్ధులను చేస్తారు.

ఎదగలేని గానుగెద్దు… 

అశ్రుతశ్చ సమున్నదో దరిద్రశ్చ మహామనాః అర్థాంశ్చా కార్మణా ప్రేప్సుర్మూఢ ఇత్యుచ్యతే బుధైః!

తెలుసుకున్నది చాలా కొద్దిగా.. అయినా తానే పండితుడననే భావనతో మిడిసిపడడం అధికం. ఏ శాస్త్రాలను పరిశీలించడు.. ఏ గురువును ఆశ్రయించడు. విజ్ఞానాన్ని ఆర్జించడు.. ఏ పనినీ చేయడు… ధనార్జనా లేదు.. కటిక దారిద్ర్యంలో మ్రగ్గుతూ.. ఎవరో వస్తారని తనను ఉద్ధరిస్తారనే భావనలో గాలిమేడలలో విహరిస్తూ జీవితం గడుపుతూ ఉంటాడు. చట్టవ్యతిరేక వర్తనతో సులభంగా వచ్చే సంపదకై ప్రయత్నిస్తూ, ఇతరులను వంచిస్తూ, ఉచితంగా వచ్చే సొమ్మును ఆశిస్తూ కాలహరణం చేస్తుంటారు… కొందరు. వారికి వారి జీవితపు విలువ తెలియదు.. ఎవరైనా చెప్పినా గుర్తించరు.. తమకు తెలియక.. తెలిసిన వారు చెపితే వినక గానుగెద్దులాగా బ్రతుకును సాగించే వారిని మూర్ఖులుగా చెపుతున్నాడు Vidura.

vidura life principles

ఇలాంటి వారు సాధారణంగా అన్నింటినీ సందేహిస్తుంటారు… అత్యవసరంగా చేయాల్సిన పనులలో కూడా విలంబన (ఆలస్యం) చేయడం వీరి నైజం. వీరిలో మరొక గుణమూ ఉంటుంది. తమ కార్యాన్ని మానుకొని, తాము చేయవలసిన పనులు ఇతరులకు అప్పగిస్తూ.. ఇతరుల పనికై తిరుగుతూ ఉంటారు. అలాగే ఇతరుల పనులు, వారు మిత్రులే అయినా, కావాలని పాడు చేస్తుంటారు.. అయిన వారిని దూరం చేసుకుంటూ.. దుర్మార్గులను, తనను ద్వేషించే వారిని దగ్గరకు తీసే ప్రయత్నం చేస్తుంటారు. తనకు శక్తి చాలకున్నా శక్తివంతుని ఎదిరించే ప్రయత్నం చేస్తూ వారితో అకారణ ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇదంతా వారు అన్యాయాన్ని ఎదిరించేందుకు చేయరు… వారికి ఆ సమయంలో అలా అనిపించడం వల్ల అలా చేస్తారు.

తనకు ఆహ్వానం లేకున్నా పిలవని పేరంటానికి వెళ్ళడం, అక్కడ అవసరం లేకున్నా తననెవరూ అడగకున్నా సలహాలివ్వడం వల్ల అవమానాలను ఎదుర్కొనవలసివస్తుంది. భావోద్వేగాలతో కూడిన తొందరపాటు, ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియక అధిక ప్రసంగం చేయడం, నమ్మదగని వారిని నమ్మడం, నమ్మదగిన వారిని దూరం చేసుకోవడం వల్ల తన స్థానాన్ని తగ్గించుకోవాల్సిన ప్రమాదం ఉన్నది.

ఒక సామాన్య వ్యక్తి, బలవంతుడైన మహారాజు కుమారునిపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే దానిని మూర్ఖత్వమే అనాలి. అది తన ప్రాణానికే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఆకాశంలో సూర్యుడు ఉంటాడు… నక్షత్రాలు ఉంటాయి.. నక్షత్రాలు రాత్రివేళలో ప్రకాశిస్తుంటాయి. అవి సూర్యునితో సమానమైన తేజస్సు కలిగి ఉండవచ్చు.. లేదా అంతకన్నా అధికమైన తేజస్సును కలిగి ఉండవచ్చు. కాని పగలు తమకు తాము ఉంటాయి. పగలు అధికారం సూర్యునిదే. అధికారం ఎప్పుడూ అధికమే. అందుకే సూర్యుని ప్రభ ఉన్నంతవరకూ ప్రచ్ఛన్నంగా ఉండి రాత్రివేళలో ప్రకాశవంత అవుతాయి. దానినే “అనువు కానిచోట అధికులమనరాదు, కొంచముండు టెల్ల గొదువ “కాదు” అధికారాన్ని అందలం ఎక్కించడం వల్ల మీ ప్రయోజనాలు కాపాడబడతాయి..

చుట్టూ ఉండే సమాజం.. చెడ్డదయిన వేళ వారి మధ్య తన ఆధిక్యతను ప్రదర్శించడం కన్నా.. సర్దుకుపోతూ.. అవకాశం వచ్చినప్పుడు తన ఆధిక్యతను చాటడం ఉత్తమం. అన్ని వేళలా మంచిగా ఉండాలనుకోవడం మంచిదే కావచ్చు కాని సమయం అనుకూలంగా లేనివేళ ప్రమాదాలను కొనితెస్తుంది. “రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు” అన్నారు.

 అధికారం తనకు అనుకూలంగా ఉన్నది కదా అని ఉచిత సలహాలు ఇస్తూ.. మన ప్రతిభాపాటవాలను అధికంగా ప్రదర్శించే వ్యక్తి వెంటే అతనిని పడద్రోసే శక్తులు ఉంటాయి. ఎప్పుడూ… అధికారం తన వెసులుబాటు చూసుకుంటుందే కాని, స్వార్థ ప్రయోజనం లేకుండా ఆశ్రిత పక్షపాతానికి పెద్దపీటనేమీ వేయదు. అధికారానికి ఎవరిపై ప్రేమ ఉండదు ద్వేషమూ ఉండదు.. ఎప్పటి కెయ్యది ప్రస్థుతమో ఆ విధంగా ప్రవర్తిస్తూ తమ కార్యాలు నిర్వహించుకుంటుంది. అందులో ఒకసారి మనలనూ దగ్గరకు తీయవచ్చు

మనకు శక్తియుక్తులు ఉన్నా లేకున్నా మన పరిధిలో ఉండటమే ప్రయోజనం అంతే కాని నాకు తెలుసుకదా అని అడగకముందే చెపుతూపోతే… అలుసైపోతాము. నిజానికి మన పట్ల ద్వేషభావన కలిగి మనలను మోసగించడము, అవమానించడము చేసిన వారు శత్రువులైనా వారిని క్షమిస్తూ, వారిని సంస్కరిస్తూ వారి పట్ల మైత్రీభావన కలిగి ఉండటం మంచితనం అనుకుంటాము.. ఆ భ్రమలో ఉంటాము. శత్రువులను సంస్కరించే ప్రక్రియలో కొందరు ఆప్తులైన మిత్రులను దూరం చేసుకుంటాము. శత్రువులను ఉద్దరించే ప్రయత్నంలో భాగంగా వారితో పాటు మనమూ తెలియకుండానే కొన్ని దుర్మార్గ కార్యాలలో భాగస్వామ్యులు అవుతాము అని అంటాడు Vidura. ఈ విధానంలో దుర్మార్గులు మారరు సరికదా ఆ పరిణామాలు మనలను ప్రమాదంలోకి నెట్టవచ్చు.

నిజానికి తాను తప్పు చేస్తూ, అది తప్పనే సంకేతం రాగానే దానిని ఇతరులపై నెట్టివేసే ప్రయత్నం చేస్తుంటారు. తప్పు ఎక్కడ జరుగుతున్నదని కాక, తప్పెవరు చేస్తున్నారనే దానిపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల అటు తప్పు సరిచేసుకోలేము, ఇటు ప్రతిభ కలిగిన వారినీ దూరం చేసుకోవలసివస్తుంది. ఆశించిన ఫలితం విపరీతమైనప్పుడు, ఇతరులపై కోపగించుకోవడం వల్ల సమాజానికీ దూరమౌతాము… ప్రశాంతతా పోతుంది. ఇలాంటి లక్షణాలు మూర్ఖత్వానికి పరాకాష్టగా చెపుతున్నాడు Vidura.

పంచుకోవడమే పెంచుకోవడం:

ఏకః సంపన్న మశ్నాతి వస్తే వాసశ్చ శోభనం, యో౨ సంవిభజ్య భృత్యేభ్యః కో నృశంసతర స్తతః!

కొందరు సంపదను సాధిస్తారు. కాని ఆ సంపద తమ కష్టార్జితం కాబట్టి తామొక్కరే అనుభవించాలనే భావనతో ఉంటారు. వస్త్రభూషణాదులు సంపాదిస్తారు కాని అవి పూర్తిగా తామే ధరించాలని భావిస్తుంటారు. 

తాను సాధించిన దానిని తానే అనుభవించాలనే భావన సమంజసమే అయినా ఆ సంపద సమాజం నుండి వచ్చిందే. సమాజం ఇచ్చిన దానిని సమాజంతో పంచుకుంటూ సమాజానికై వెచ్చించాల్సిన అవసరాన్ని మరచిపోయిన వారికి శ్రేయస్సు ఉండదు. తనకా సంపదను తెచ్చిపెట్టిన వారిని విస్మరించడం వల్ల తాను విశ్వాసఘాతకునిగా నిలుస్తాడు అంటాడు Vidura.

 తోటి వారితో పంచుకోవాల్సిన వైభవాన్ని స్వార్ధంతో అనుభవిద్దామని అనుకోవడం అవివేకం.. అర్ధరహితం.. క్రూరత్వం.. ప్రమాదకరం కూడా. ఈ వైఖరి ఆధిపత్య భావనకు బీజం వేస్తుంది. సమాజంలో ఒంటరిని చేస్తుంది. ఎక్కువ మంది ఈర్యాపరులైన శత్రువులను తయారు చేస్తుంది. కాబట్టి నలుగురితో కలసి తిరగడం ఉత్తమోత్తమం. ఇతరులకు దూరంగా ఉండాలనే భావనతో… దుర్గమమైన దుర్గాలను నిర్మించుకొని ఉండేవారు…సమాచార వ్యవస్థకు దూరమౌతారు. ఇతరులు వారి పట్ల అసూయాద్వే షాలతో వ్యవహరిస్తారు. సమయం కోసం చూస్తుంటారు… సమయం వస్తే త్రొక్కివేస్తారు Vidura ఇలా సెలవిచ్చాడు.

If you want to be happy and wise… సుఖవంతుడు, వివేకధనుడు కావాలంటే…

ఏకయా ద్వే వినిశ్చిత్వా త్రీం శ్చతుర్భి ర్వశే కురు, పంచ జిత్వా విదిత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవ!

ఒకదానిచే రెంటిని నిర్ణయించి, మూడింటిని నాల్గింటితో వశపరచుకొనుము. అయిదింటిని గెలిచి, ఆరింటి నెరిగి, ఏడింటిని వదిలి సుఖవంతుడవు కమ్ము, అంటాడు Vidura.

ఒకటితో అనగా బుద్ధితో, రెంటిని అనగా కార్యము అకార్యము లేదా చేయదగిన కార్యము, చేయకూడని కార్యములు ఏవో తెలుసుకొని, చక్కగా నిర్ణయించి, త్రీని అనగా శత్రువులను, మిత్రులను, ఉదాసీనులను గుర్తించి, చతుర్భిః అనగా నాలుగు ఉపాయముల చేత లేదా సామదాన భేద దండోపాయములచే వారిని తన వశం చేసుకొని (సామము చేత మిత్రుని, దానభేదముల చేత ఉదాసీనుని దండోపాయము చేత శత్రుని) పంచ అనగా అయిదింటిని లేదా పంచేద్రియాలను తన వశం చేసుకొని, షడ్ విదిత్వా అనగా ఆరింటిని తెలిసి… లేదా సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, సంశ్రయము అనే ఈ ఆరింటినీ ఎరిగి, వీటిని కొద్దిగా వివరించుకుంటే… సంధి (బలవంతుడైన శత్రువుతో పొందుచేసుకోవడం) విగ్రహము (యుద్ధం చేయడం) యానము (దండయాత్ర సలపడం) ఆసనము (దేశ కాలపరిస్థితులను బట్టి ఉపేక్షవహించి ఉండటం) ద్వైధము (బలవంతులైన ఇద్దరు శత్రువులను ఎదుర్కొనవలసి వచ్చినపుడు ఒకరికి తెలియకుండా ఒకరితో సంధి చేసుకొని వారిలో వారికి వైషమ్యాన్ని కల్పించటం) ఆశ్రయము (శక్తి లేనప్పుడు బలవంతుని ఆశ్రయించి వానిని తోడు చేసుకోవటం)… వీటిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియడం, సప్త హిత్వా అనగా సప్త వ్యసనాలను వదలి (స్త్రీ, వేట, ద్యూతము, మద్యపానము, పరుషముగా మాట్లాడుట, కఠినంగా దండించడం, ధనమును వృథా చేయడం ఈ ఏడు సప్త వ్యసనములుగా చెపుతారు) సుఖవంతుడవు కమ్ము, అంటాడు Vidura.

శత్రు, మిత్ర ఉదాసీనులలో… శత్రువుల పట్ల ఎలాగూ మనం అప్రమత్తంగానే ఉంటాము… కాని మిత్రులుగా నటిస్తున్న వారిలో కూడా అసూయాగ్రస్తులైన వారు మనకపకారం తలపెట్టవచ్చు. అలాంటి వారినీ ఒక కంట కనిపెట్టుకునుండటం అవసరం. ఇక ఉదాసీనులు దేనినీ పట్టించుకోరు. వారు అవకాశం మేరకు శత్రుత్వం చేపట్టవచ్చు, మిత్రులుగానూ మారవచ్చు. అలాంటి వారిని మనకనుకూలంగా మలుచుకోవడంలోనే నాయకుని ప్రతిభ వెలుగుచూస్తుంది… విజయాన్నీ ఇస్తుంది. ఈనాటి రాజకీయనాయకులు ఓట్ల వేటలో పట్టుకునేది ఈ ఉదాసీన వర్గాన్నే… వారినే ప్రలోభాలతో తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు.అంటాడు Vidura.

దీనిని మరొక విధంగా చెప్పుకుంటే.. ప్రభుత్వాన్ని చేపట్టి (ఒకటి) మంత్రాంగం, ఉత్సాహములను రెంటిని) నిశ్చయించుకొని, మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాలనూ (మూడు) సామదానభేదదండోపాయాలతో (నాలుగు ఉపాయాలతో) పూర్తిగా వశపరచుకొని, పంచేద్రియాలయిన త్వక్ (చర్మము) చక్షు (కన్నులు) శ్రోత్రములు (చెవులు) జిహ్వ (నాలుక) ఘ్రాణ (ముక్కు) లను అయిదింటినీ జయించి, సంధి విగ్రహ యాన ఆసన ద్వైదీభావ సంశ్రయములనే ఆరింటినీ తెలుసుకొని సప్తవ్యసనాలకూ దూరంగా ఉండేవాడు వివేకధనునిగా చెపుతారు Vidura.

దీనినే ఆధ్యాత్మికపరంగా చెపితే… బుద్ధితో (ఒకటి) వాక్కు, క్రియ అనే రెంటినీ నిశ్చలంగా చేసి లేదా సమన్వయపరచి లేదా ఏది చెపుతామో దానిని చేయడము, ఏది చేయగలమో దానినే చెప్పడము, ధర్మార్థకామాలనే మూటిని బ్రహ్మచర్య, గార్హస్య, వానప్రస్థ, సన్యాసములనే నాల్గింటితో వశం చేసుకొని, వాక్కు పాణి పాదము పాయువు (మలద్వారము) ఉపస్థ (జననేంద్రియము)లనే కర్మేంద్రియాలను అయిదింటినీ గెలిచి, యజన యాజన అధ్యయన, దాన, ప్రతి గ్రహాలనే ఆరు స్మార్తకర్మలను తెలిసి, పంచ భూతాలు (పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ అయిదూ ఆవరణాలుగా చెప్పబడతాయి) మరియు బుద్ధి అహంకారం అనే ఏడింటినీ విడిచి వర్తించే వాడు వివేకవంతుడు అంటారు.

దీనినే మరొక విధంగా చెప్పుకుంటే… ఒకటి సత్వం, రెండు రజస్సు తమస్సు, మూడు ఏషణత్రయం (ధన, దార, పుత్ర.. ఇవి మూడు ఏషణ త్రయములుగా చెపుతారు. ఏషణము అంటే కోరిక) ధ్యాన, ధారణ, యోగ, సమాధులు (నాలుగు) పంచేద్రియాలయిన త్వక్ (చర్మము) చక్షు (కన్నులు) శ్రోత్రములు (చెవులు) జిహ్వ (నాలుక) ఘ్రాణ (ముక్కు) లను అయిదింటినీ జయించి, యజన యాజన అధ్యయన, దాన, ప్రతిగ్రహాలనే ఆరు స్మార్తకర్మలను తెలిసి, పంచభూతాలు (పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ అయిదూ ఆవరణాలుగా చెప్పబడతాయి) మరియు బుద్ధి అహంకారం అనే ఏడింటినీ విడిచి వర్తించే వాడు వివేకవంతుడు అంటారు.

మిగితాది పార్ట్ 5 లో...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *