Vidura Part-6: Secrets of Wisdom and Dharma Unfold

Vidura Part-6: Secrets of Wisdom and Dharma Unfold

Vidura Part-6: Secrets of Wisdom and Dharma Unfold

Vidura Part-6: Secrets of Wisdom and Dharma Unfold: పాండవులు, ధర్మము, రాజకీయం, జీవన సూత్రాలు విదుర నీతి –6 కలతచెందితే చెదిరిపోతారు: “ఏకం విషరసో హంతి శస్త్రేణైకశ్చ వధ్యతే సరాష్ట్రం సప్రజం హంతి రాజానాం మంత్ర విప్లవః!విషరసం ఒక్కడిని మాత్రమే చంపుతుంది. శస్త్రము ఒక్కనిని చంపుతుంది. కాని కల్లోలము పుట్టించు మంత్రాలోచనము రాష్ట్రముతో, ప్రజలతో కలసి రాజునూ రూపుమాపుతుంది.

రాజా! ఈ సృష్టిలో ఉన్నది ఒక్కటే.. అదే సత్యము. దానిని అనేకంగా భ్రమించడం వల్ల తన పర అనే భేదం కనిపిస్తుంది. దానిని గుర్తెరుగు. ఒక్కడు పాపాలు చేస్తాడు.. దాని ఫలితాలను మాత్రం వేరువేరు జనులు అనుభవిస్తారు. అధర్మాలోచనతో ఒడిగట్టుకున్న పాపంవల్ల కౌరవులే కాదు ప్రజలంతా అనుభవిస్తారు. ఆ అనుభవం వల్ల ప్రజలా పాపాన్నుండి బయటపడతారు కాని ఆ పాపమును చేసిన వానికి ఆ దోషము తప్పక అంటుకుంటుంది..

రాజా! నైపుణ్యం కలిగిన విలుకాని బాణము ఒక్కనిని చంపుతుంది.. ఒక్కొకమారు అది తప్పిపోవచ్చు.. కాని నీతిశాలి ప్రయోగించిన నీతి, శత్రువును వాని రాజ్యాన్ని, నాయకుని గూడా ఇబ్బందులకు గురిచేస్తుంది. పాండవులు నీతిని శీలాన్ని గుర్తించు..

ఏ రుచిగల భోజనాన్ని “నేనే” అనుభవించాలనుకోవడం సమంజసం కాదు. “నేను కూడా” అనుకోవడం సరైనదే.. కాని కలసి భుజిస్తాననుకోవడం ఉత్తమోత్తమం. రాజ్యాన్ని కలసి అనుభవించడం ఉత్తమం. నీకు తెలియనిది కాదు కాని ఒక్కడే కార్యాన్నైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఫలితం ఉన్నతంగా ఉండదు. తనను సమర్ధించే వారి ఆలోచన తన ఆలోచనకు భిన్నంగా ఉండదు. తన ఆలోచనకు మరొక ఆలోచనను జోడించగలిగిన వారి ఆలోచనను తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. అలాగే నేను నా బాటలోనే ఒంటరిగా వెళతాననడం మూర్ఖత్వమౌతుంది. ప్రమాదాలు ఎదురవవచ్చు. ధర్మము నడిచే బాట ఐనా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. అందుకే తోడు ఉండటం ఎప్పుడూ మేలు చేస్తుంది. ఎప్పుడూ అందరూ నిద్రిస్తున్న సమయంలో మేల్కొని ఉండటం కూడా ప్రమాదమే…

అనుకోవడం, తననాశ్రయించిన వారికి ఏమీ ఇవ్వలేకపోవడం క్రూరత్వమౌతుంది. సంపదకు ఫలితం కలసి అనుభవించడమే.. తానే పూర్తిగా అనుభవించాలని సంపద, విద్య, అధికారం ఉన్నా మిడిసిపాటు లేనివాడు, పండితుడుగా ప్రశంసలందుకుంటాడు. పాండవులు ధర్మాత్ములు కావడం, నీపై తండ్రియన్న భావంతో, గౌరవ భావంతో ఉండటం, శక్తి సామర్ధ్యాలున్నా, బలపరాక్రమాలున్నా, నీవు పెట్టిన పాట్లన్నీ పడీ సంధికై, నీవిచ్చే అయిదూళ్ళకై యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నారు. నీవేమో దుష్టచతుష్టయం మాయలో పాండవుల ప్రార్థనను పెడచెవిన పెడుతున్నావు. ఇక నీకు మేలు ఎలా సంభవిస్తుంది. ధర్మము ఉత్తమోత్తమం కదా!

ఓర్పు అనే దానికి కూడా పరిమితులు ఉంటాయి.. పాండవుల ఓపికను ఇంకా పరీక్షచేయడం సమంజసం కాదు. నీ సంతానం మాత్రం ఓర్పులేనితనంతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. గడ్డిపరకలు లేనిచోట నిప్పు తనంత తానుగా ఆరిపోతుంది కాని ఎంత దట్టంగా గడ్డిపరకలు ఉంటే నిప్పు అంతగా జ్వలిస్తుంది. నీ కుమారులు ఎంతగా సంధికి అవరోధాలు సృష్టిస్తే పాండవాగ్ని అంతగా జ్వలిస్తుంది. కౌరవులు తమ అగ్నిని తామే అంటించుకుంటున్నారు… పాండవులు శాంతి అనే ఖడ్గాన్ని పట్టుకు వస్తున్నారు. దానిని ఆదరిస్తే శాంతి నిలుస్తుంది. ఓర్పు లేకపోతే కౌరవులు తమ దోషములనే అగ్నితో తామే అంటించుకుంటారు. సహనమే ఉత్తమమైనది, ఉన్నతమైనది. అహింస వల్ల పరమసుఖము కలుగుతుంది. ఆలోచించు. ధర్మము ను కాపాడుట రాజుల విధి.

ఓర్పు వహిస్తున్న ధర్మరాజుది చేతకానితనంగా భావిస్తున్నారు. కాని ఓర్పే గొప్పబలము, అదే అలంకారము కూడా. సంధి కుదురుతుందా అనే అనుమానం ఎందుకు? ముందు ప్రయత్నించాలి కదా. సన్యాసియై అన్నింటికీ తానే అని ముందుకు వచ్చేవాడు, ప్రయత్నహీనుడైన నాయకుడు… ఈ ఇరువురు అధములని చెపుతారు. సమర్థుడై ఉండీ సహనాన్ని ప్రదర్శించే వాడు, దరిద్రుడై ఉండీ దానము చెసేవాడు… ఇరువురూ ఉత్తమోత్తములుగా పరిగణింపబడుతున్నారు.

రాజా! “త్రయః ఉపాయ:” అంటుంది వేదం.. సంధి ఆర్షము అనగా ఉత్తమోత్తమము… యుద్ధము అధమాధమము, భేదము దానము మధ్యమములు, సామంగా సాధించడం ఉత్తమము. కాబట్టి ఎలాగైనా యుద్ధాన్ని ఆపడం వల్ల ప్రపంచానికి శాంతి కలుగుతుంది. కాదు పరుల సొమ్మును హరించుట, పర భార్యను కామించుట, సమర్థులైన మిత్రులను వదులుకొనుట.. ఇవి నాశన హేతువులు. కామక్రోధలోభాలు మనిషి పతనానికి హేతువులు. మందమతులైన వారితో సంప్రదింపులు చేయడం అనర్ధాన్ని 5 మనస్తత్వం కలిగిన వారితో, ఊరికే పొగిడే వారితో చేసే మంత్రాంగం నిరుపయోగమే తెచ్చిపెడుతుంది. 

బుద్ధితక్కువ వారితోనూ, ఆర్బాటము చేసే వారితోను, సాగదీసే దేవతల సంకల్పం వల్ల కలుగుతుంది. బుద్ధిమంతుల మహిమవల్ల కలుగుతుంది. అనర్ధహేతువు కూడా. నీకు అప్పటికప్పుడు ఫలితం రావాలి అంటే.. అది విద్యాధికులైన వారి వినయం వల్ల కలుగుతుంది. పాపకర్ములు నాశనం వల్ల కలుగుతుంది. ఇందులో ఎవరిని ఎక్కడ పెట్టుకుంటావో… అది నీ విజ్ఞత. ఈ ఆరు దోషాలు ఎవరిలో ఉంటాయో వారు అపజయాన్ని పొందుతారు. నీవు అని సోమరితనము, భయము, ద్వేషము, అలసట, సాగతీత అను నిర్ణయిస్తే ఉత్తర క్షణంలో సంధి జరుగుతుంది. పగిలిన నావను సముద్రంలో పారవైచినట్లు అవసరమైతే దుర్మార్గులైన సంతానాన్ని వదలివేయాలి.

పాండవులు ఆపదలు సంభవించాయని క్రుంగిపోలేదు.. అరణ్యవాస సమయాన్ని సాధనలో గడిపారు. ప్రమాదమని భయపడి చేతులు ముడుచుకు కూర్చోలేదు.. యుద్ధ సన్నాహాలు చేసుకున్నారు. మంచికాలం ముందున్నదనే నమ్మకంతో ఎన్ని దుఃఖాలనయినా సహించారు. ముఖ్యంగా నీపై అధికమైన భక్తి కలిగిన పాండవులకు రాజ్యభాగమునిచ్చి కొడుకులతో కూడి ఆనందంగా ఉండుము.. అంటున్నాడు Vidura .

హద్దులను చెరిపేయండి:జాగ్రతో దహ్యమానస్య యత్కార్య మనుపశ్యసి, తద్ర్భూహిత్వంహి నస్తాత ధర్మార్ధ కుశలోహ్యసి!

త్వం మాం యధావ ద్విదుర ప్రశాధి ప్రజ్ఞాపూర్వం సర్వ మజాత శత్రోః యన్మస్యసే పథ్య మదీన సత్త్వ శ్రేయస్కరం బ్రూహి తద్వైకురూణాం!

నాయనా Vidura ! నీవు ధర్మవేత్తవు.. నేను నిద్రపట్టక కాలిపోతున్నాను. నాకు, ధర్మరాజునకు హితమైనది, కౌరవులకు శ్రేయస్కరమైనది ఏదో చెప్పు. అది నాకు ప్రశాంతినివ్వాలి, అంటున్నాడు Dhritarastra. ఇక్కడ ధృతరాష్ట్రునికి కావలసింది.. తనకు ప్రశాంతతయే కాని లోక క్షేమం కాదు, పాండవుల క్షేమం కాదు. పాండవులతో తన బంధుత్వంకన్నా కౌరవులకు రాజ్యాన్ని ఇప్పించడమే ముఖ్యం. అయితే పాండవుల బలం తనను భయపెడుతున్నది. ఆ భయం వల్ల తనకు నిద్దుర రావడం లేదు. ఈ సంగతి తెలిసిన Vidura ….

రాజా! ధర్మరాజులో మంచి లక్షణములు నిండుగా ఉన్నాయి. నిన్ను తండ్రిగా గౌరవిస్తున్నాడు. అతడు ఈ హస్తినాపురానికే కాదు ముల్లోకాలకు రాజు కాదగినవాడు. అంతేకాదు, నీ కొడుకులందరినీ మించి రాజ్య విషయమున మన్నన పొందిన వాడు. తేజస్సు ప్రజ్ఞ అతనిలో ఎక్కువగా ఉన్నాయి.. ధర్మార్థతత్వాలను తెలిసిన వాడు. క్రూరస్వభావము లేనివాడు. నీ బంధుత్వమును గౌరవిస్తూ ఎన్నో కష్టములను అనుభవిస్తున్న వాడు… అతనిని పిలిచి రాజ్యభాగము ఇవ్వడం వల్ల నీకు ప్రశాంతత మిగులుతుంది.

ధృతరాష్ట్రుని అశాంతికి మూలం… దుర్యోధనుని అసూయ, తనలోని ఈర్ష్య. పాండవులకు రాజ్యభాగం ఈయనని భీష్మించుకు కూర్చున్న కుమారునిపై అమితమైన లేదా పరిధులు దాటిన పుత్రవాత్సల్యం. నిజానికి ఏ తండ్రికైనా, పుత్రవాత్సల్యం ఉండటం సహజమే. అది అవసరమూ, అధిగమించలేనిది కూడా. అయితే ఆ బంధనాలలో చిక్కుబడకుండా దానిని నిర్వహించుకోవడం ఎలాగో తెలుసుకోవడం కూడా అవసరం.

నిరాశానిస్పృహలు, మనోవైకల్యం, బాధ, అశాంతి కలిగి నిద్రలేకుండా చేస్తున్నాయి. పాండవులు బలవంతులు కాబట్టి నీవు భయపడుతున్నావు. ఆ భయం వల్ల నీలో పాండవులు ఎవరో కాదు.. స్వయానా నీ తమ్ముని సంతానమే కదా. ఆ రక్త సంబంధాన్ని పరిగణలోకి తీసుకో. ఎదుటివారు నీకన్నా బలహీనులైనా, తక్కువస్థాయిలో ఉన్నా వారిపై సానుభూతిని దయను చూపడం వల్ల నీ అవగాహన పెరుగుతుంది. ఆ అవగాహనను ఆచరణలో చూపితే నీలోనూ.. రాజ్యంలోనూ శాంతి నిలుస్తుంది..

pandavas pandavulu

రాజా! పాండవుల మాయాజూదం నెపంగా ఇన్ని సంవత్సరాలు వనవాసాన్ని చేశారు, అవమానాలు భరించారు. వారికీ కొన్ని పరిమితులున్నాయి. ఇన్ని సంవత్సరాల వారి సాధన వారి అవగాహనా పరిధిని, పరిమితుల పరిధిని పెంచింది. ఇప్పుడు వారి ఇష్టాయిష్టాల పరిమితులను అవగాహన చేసుకునే ప్రయత్నం జరగకపోతే, నీ సంతానం క్షేమంగా ఉండాలనే నీ ప్రయోజనం సిద్ధించదు. వారి పరిమితులు వారి సామర్ధ్యాన్ని ఆధారం చేసుకొని ఏర్పరచుకొన్నవి. దుర్యోధనుని పరిమితులు ఇతరుల బలాబలాలను ఆధారం చేసుకొని ఏర్పరుచుకున్నవి. కాగా నీ పరిమితులు పుత్రవాత్సల్యంతో ముడిబడి, పాండవులపై ద్వేషభావనలో ఏర్పరుచుకున్నవి.

రాజా! జాగ్రత్తగా విను. ఎదుటివారితో మనం ఏర్పరుచుకున్న బంధం మనలో వారిపై ఇష్టాయిష్టాలకు లేదా రాగద్వేషాలకు కారణమౌతుంది. ఇష్టాయిష్టాలు ఎదుటివారిని మనం అంచనా వేసి తీర్పు చెప్పుకున్న విధానానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆ అంచనాలు మన వ్యక్తి కూడా తన అవసరాలు, అవకాశాలపై ఆధారపడి కూడా ఉండవచ్చు. ఇష్టాయిష్టాలను పూర్తిగా సంతృప్తిపరుచుకోలేడు. పరిమితులను అర్థం చేసుకోవడం వల్ల కలిగే సకారాత్మక వైఖరి మన విజయానికి మార్గం చూపుతుంది. ప్రశాంతతనిస్తుంది.

వ్యక్తి ఇష్టాయిష్టాలు ప్రయోజనాన్ని అనుసరించాలి. అలాకాక ఇష్టాయిష్టాలను ప్రయోజనం అనుసరించాలనుకుంటే.. అశాంతి కలుగుతుంది. మన ఆలోచనలను అనుసరించి ప్రపంచం నడవదు. ప్రపంచాన్ని అనుసరించి మనమూ నడవలేము. సామరస్య వైఖరితో సమన్వయం చేసుకోవడమే ప్రశాంత జీవితానికి రాజమార్గం -ధర్మ మార్గం. వ్యక్తి పరిమితులు, నైపుణ్యాలు, సమగ్రత, అసమగ్రత, సమర్ధత, అసమర్ధతలు ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. తనకు తాను అర్థం అయితే ఎదుటివారిని అర్థం చేసుకోవడం సులువవుతుంది. ముందుగా పాండవుల పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో. నీ పరిమితులు తెలుసుకోగలిగితే.. నీ అవగాహనలో స్పష్టతవస్తే ఎదుటివారి కోణం అవగాహనకు వస్తుంది.

ఇంతవరకు జరిగినది ఏదైనా ఇరువర్గాల మధ్య భేదం విస్తృతమౌతున్నది. ఆ విభేదాలు సమసిపోనంత వరకు సమస్య పరిష్కారం కాదు, నీకు మనశ్శాంతి కలగదు. ఎదుటివారు వినడం లేదు నేనేం చేయగలనని అనడం లేదా ఎదుటి వారిని ఒప్పించడంలో విఫలమయ్యామంటే అది మన భావవ్యక్తీకరణలో లోపం లేదా సమర్ధవంతంగా మన భావాన్ని వ్యక్తీకరించలేకపోవడం మాత్రమే. అందులో స్పష్టంగా మన ప్రయత్నం లోపం కనిపిస్తుంది. ఉమ్మడి ప్రయోజనం కనిపించనంత వరకూ అలాంటి ప్రయత్నాలు సిద్ధించవు. అయితే భావ వ్యక్తీకరణకు కూడా పరిమితులుంటాయని గుర్తించాలి. ఆ పరిమితులు మన ఇష్టాయిష్టాలు, అవతలి వారి ఇష్టాయిష్టాలపై కూడా ఆధారపడి ఉంటాయి.

vidura niti mahabharata
పాండవులే

“ఓ Vidura ! తొల్లి నే చేసిన దోషమునే స్మరించుచున్న పాప ఆశంకీ.. రాబోవు దుఃఖమును గురించి కుమిలిపోతున్న వాడనై… నాకు ఏదో కీడు మూడుననిపించుచున్నది. దానితో నా హృదయము అంతయు గగ్గోలుపడుచున్నది. అట్టి మనస్సుతో అడుగు చున్నాను. సర్వజ్ఞుడా! ఇప్పుడా అజాతశత్రువు (ధర్మరాజు) ఏమి సాధింపగోరుచున్నాడో…. అది అంతయు ఉన్నదున్నట్లుగా చెప్పుము” అంటున్నాడు Dhritarastra.

గతంలో తప్పో, ఒప్పో చేసాము… దాని వల్ల వచ్చే ఫలితం అనుభవిస్తున్నాము. దానినే తలుస్తూ వర్తమానాన్ని విస్మరిస్తే ఉపయోగం లేదు. అది బాధలనూ మిగుల్చవచ్చు. మన బాధలను నిశ్శబ్దంగా ఉంచాలి… అంతర్గత బలాల నుండి సామర్ధ్యాల నుండి శక్తిని గ్రహించాలి… ఆ ప్రవాహంలో ముందుకు సాగాలి. కాని మనలో చాలామందిమి అంతర్గత బలాలను, శక్తి సామర్ధ్యాలను గుర్తించేందుకు సన్నద్ధం కాము అంటున్నాడు.Vidura .

రాజా! నీ బుద్ధి, నీ కొడుకుల బుద్ధి అహంకారంతో కప్పబడి, సత్యాన్ని గుర్తించలేకున్నది. బుద్ధి కలుషితమైనప్పుడు, వినాశము దాపురించినప్పుడు అవినీతి, నీతి వలె కనిపిస్తుంది. బుద్ధి ప్రక్కకు జరిగిన వానికి పరాభవము కలుగుతుంది. తన బలాన్నే కాదు ఎదుటి బలాన్నీ సరిగా అంచనా వేస్తేనే స్థిత ప్రజ్ఞుడౌతాడు. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో… ఆ నిర్ణయమే నీకు ప్రశాంతతనిస్తుంది అంటాడు Vidura .

గతజల సేతుబంధనం… పాపాశంకీ పాపమే వానుపశ్యన్ పృచ్చామి త్వా వ్యాకులే నాత్మనా హం కవే తన్మే బ్రూహి సర్వం యథావ స్మనీషితం సర్వ మజాత శత్రోణి

“ఓ విదురా! తొల్లి నే చేసిన దోషమునే స్మరించుచున్న పాప ఆశంకీ.. రాబోవు దుఃఖమును గురించి కుమిలిపోతున్న వాడనై… నాకు ఏదో కీడు మూడుననిపించుచున్నది. దానితో నా హృదయము అంతయు గగ్గోలుపడుచున్నది. అట్టి మనస్సుతో అడుగు చున్నాను. సర్వజ్ఞుడా! ఇప్పుడా అజాతశత్రువు (ధర్మరాజు) ఏమి సాధింపగోరుచున్నాడో…. అది అంతయు ఉన్నదున్నట్లుగా చెప్పుము” అంటున్నాడు Dhritarastra.

గతంలో తప్పో, ఒప్పో చేసాము… దాని వల్ల వచ్చే ఫలితం అనుభవిస్తున్నాము. దానినే తలుస్తూ వర్తమానాన్ని విస్మరిస్తే ఉపయోగం లేదు. అది బాధలనూ మిగుల్చవచ్చు. మన బాధలను నిశ్శబ్దంగా ఉంచాలి… అంతర్గత బలాల నుండి సామర్ధ్యాల నుండి శక్తిని గ్రహించాలి… ఆ ప్రవాహంలో ముందుకు సాగాలి. కాని మనలో చాలామందిమి అంతర్గత బలాలను, శక్తి సామర్ధ్యాలను గుర్తించేందుకు సన్నద్ధం కాము అంటున్నాడు Vidura .

జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఫుట్బాల్ ఆటను గమనించండి. ఇరువర్గాల క్రీడాకారులు బంతిని కాలితో తంతూ ఉంటారు. ఆ బంతి మన జీవితం అనుకుంటే మనకెదురయ్యే సన్నివేశాలు లేదా సందర్భాలు ఆ బంతికి తగిలే తన్నులుగా చాలా మందిమి భావిస్తాము. నిజానికి అందులో కొన్ని మనం కొనితెచ్చుకునేవి మరికొన్ని మనం ఊహించుకునేవి. ఎప్పుడో ఏదో జరుగుతుంది… దానిని గుర్తుతెచ్చుకొని బాధపడతాము. ఆ బాధ మరొక బాధామయ సన్నివేశాన్ని గుర్తుచేస్తుంది. అది మరొక దానిని… ఇలా ఎన్నో అసంతృప్త సన్నివేశాలు బాధపడడమనే ఒక “అలవాటు”ను మనకు బహూకరిస్తాయి. 

ధృతరాష్ట్రుడూ అలాగే అంటున్నాడిక్కడ. పూర్వం తాను పాండవులకు చేసిన అపచారాలు బాధిస్తున్నాయంటున్నాడు. కాని దానికి ప్రత్యామ్నాయంగా వారిని పిలిచి అర్ధరాజ్యం ఇస్తే వారు సంతోషిస్తారు.. తనకూ బాధలేదు.. కాని ఆ పరిష్కారం తనకు తన సంతానానికి ఆమోదయోగ్యం కాదు. అదే అతని బాధకు మూలం. నిజానికి మనలను బాధించేది సందర్భం లేదా సన్నివేశం కాదు అది మన అంతర్గతస్థితి మాత్రమే. మనకదే సంతోషాన్ని ఇస్తుంది లేదా బాధలను ప్రసాదిస్తుంది. ఎదురయ్యే సన్నివేశాన్ని ఎదుర్కొనేందుకు అడ్డంకి మనలోని అజ్ఞానం, తెలివిలేనితనం, – మూర్ఖత్వం మాత్రమే. మన జీవితంపై వీటి ప్రభావం చాలా ఎక్కువ. ఇవి ఇచ్చే మత్తు వల్ల ఏది ఉచితమో ఏది అనుచితమో ఏది యోగ్యమైనదో ఏది కాదో వివేకించి, విచారించి గ్రహించే స్థాయిని విస్మరిస్తాము.ధర్మమే గెలుస్తుంది.

బాహిరమైన సత్య అంతరంగికమైన సత్యం రెండూ జీవితంపై తమ ముద్రలను వేస్తాయి. బాహ్యంగా కనిపించే దానిని ఎలా ఉన్నదో అలా చూడటం బాహిరమైన సత్యం కాగా దానిని మన మానసిక పరిధిలో మన దృష్టికోణంలో వ్యాఖ్యానించుకుంటూ, వివరించుకుంటూ దానిని దర్శించడం ఆంతరంగిక సత్యం. ఈ విధానంలో మన ఇష్టాయిష్టాలు, పూర్వనిశ్చితాభిప్రాయాలు ఆ దర్శనపై ప్రభావం చూపుతాయి. బాహిరమైన సత్యం, అంతరంగిక సత్యం.. ఈ రెంటి కలయికయే జీవితం. ధర్మము -అధర్మము  మన వద్ద ఏదో లేదు.. మనకు బాధ లేదు. కాని అది మరొకరి వద్ద ఉన్నది.. అది మరొకరి వద్ద ఉండటం మనకు బాధను ప్రసాదిస్తుంది. మనం ఉద్యోగిస్తున్నాము. వచ్చే వేతనం సంతోషాన్నిస్తున్నది. 

ఊహించకుండా ఒకనాడు యాజమాన్యం మనలను పిలిచి మన పనితనాన్ని ప్రశంసిస్తూ, పదవిని ఉన్నతీకరించి, వేతనాన్ని గణనీయంగా పెంచింది. మన ఆనందానికి అవధులు లేవు. దానిని ఉత్సాహంతో సంబరంగా జరుపుకున్నాము. ఆ సంబరాలలో మనకొక విషయం తెలిసింది. మనతో పనిచేసే మన మిత్రునికి మరొకరికి కూడా యాజమాన్యం పదవిలో ఉన్నతిని కల్పించి వేతనంలో వృద్ధిని కల్పించింది. అయితే అది మనకంటే ఎక్కువగా ఉన్నది. మన ఉత్సాహం ఆవిరయింది.. ఆ స్థానంలో నాకంటే వాడేవిధంగా అధికుడు.. వానికి నా కన్నా పెద్ద ఉద్యోగం అధిక వేతనం ఎలా వచ్చింది… ఈ బాధయే మన అశాంతికి కారణమయింది. ముందున్న ఆనందం స్థానంలో అశాంతితో కూడిన ఆవేదన నిలిచింది.

ఇక్కడ సందర్భం కాని సన్నివేశం కాని మన అశాంతికి కారణం కాదు. మన మనసు దానిని తీసుకున్న విధానమే దానికి మూలమయింది, కారణమయింది. ఏ సన్నివేశమయినా దానికి మన మనస్సు స్పందించే విధానమే మనలను బంధీలుగా మారుస్తుంది లేదా దివ్యులుగా మారుస్తుంది. భౌతికస్థితిలో మనకు కనిపిస్తుంది.. భావోద్వేగస్థితిలో దానికి స్పందిస్తాము… మేధాసంబంధితస్థితిలో లేదా వివేచనాస్థితిలో దానిని ఆలోచిస్తాము… కాని ఉన్నది.. ఏదో దానిని ఆధ్యాత్మికస్థితిలో ఆనందంగా, నిశ్శబ్దంగా ఆస్వాదిస్తాము. ఆ ఆస్వాదనే ఆనందం…అదే విజయానికి దారి చూపుతుంది.

అడగకున్నా ఆత్మీయులకు చెప్పుకోవాలి… శుభం వా యది వా పాపం ద్వేష్యం వా అయది వా ప్రియమ్ అపృష్ట స్తస్య తద్ బ్రూయా ద్యస్య నేఛ్ఛేత్ పరాభవమ్ !

రాజా! తానెవరి శ్రేయస్సును కాంక్షిస్తాడో, తానెవని పరాభవమును కోరుకొనడో, అలాంటి వారికి పుణ్యమో పాపమో అప్రియమో అడుగకున్నను చెప్పకనే చెప్పాలి. అందువల్ల కౌరవులు నాకు అత్యంత ఆత్మీయులు కాబట్టి వారికి హితమైన దానిని చెప్పుతున్నాను. నా మాట ధర్మమును తప్పిచనదు. మీ అందరికీ శ్రేయస్సును ఇస్తుంది. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి అంటున్నాడు Vidura ..

కపటోపాయములతో కావలసిన వారిని మోసగించడం సరైనదికాదు. చెడు దారులలో నడిస్తే ఒక్కొకసారి త్వరగా చేరవచ్చేమో కాని అది చాలా ప్రమాదకరమైనది. ఆ కర్మలెప్పుడూ శ్రేయస్సును ఇవ్వవు. అలాగే నేర్పుతో ఉపాయముతో చేసిన పని ఒక్కొక్కసారి నెరవేరకపోవచ్చు అంతమాత్రాన క్రుంగిపోవడం బుద్ధిమంతుల లక్షణమూ కాదు. ఒక్కొకమారు సజ్జనులు దుర్జనులను ఏదైనా సాయం అడగవచ్చు. అంతమాత్రాన వారు తగ్గినట్లు కాదు.. వీరు గొప్పవారైనట్లు కాదు. లక్ష్యం వెంట గమిస్తున్నప్పుడు, దానికి అనుబంధమైన పనులన్నీ పరిశీలించి, విమర్శతో విశ్లేషించుకోవాలి. తొందరపాటు లేకుండా, ఏది యుక్తమైనదో చక్కగా నిర్ణయించుకొని చేయవలయును.

తన స్థానము ఏమిటి? దాని పరిధి ఎంత? అది వృద్ధిలో ఉన్నదా…. తగ్గుతున్నదా…. తన కోశము లేదా బొక్కసము ఎలా ఉన్నది జనపదము యొక్క స్థితిగతులు ఎలా ఉన్నవి.. అన్నింటినీ రక్షించే సేన యొక్క పరిణామము, పరిమాణము ఎలాంటిది.. వీటిపై సరైన, స్పష్టమైన అవగాహన లేని పాలకుడు తన స్థానాన్ని రక్షించుకోలేదు. వీటిని సరిగా అవగాహన చేసుకున్నవానికి రాజ్య వైభవము తనంత తానుగా చేరుతుంది. రాజ్య వైభవం దక్కినదని అనుచితవర్తన, అవినయశీలత కలిగి ప్రవర్తిస్తే, ఎంత చక్కని అందమైన వాడినైనా ముసలితనము ఎలాగైతే కురూపిగా మారుస్తుందో, అలాగే అతని సంపదలు హరించుకుపోతాయి. రానున్న కీడును గమనించని చేప పేరాసతో ఇనుప గాలమునకు కట్టిన ఎరను మ్రింగి నశించిన విధంగా అహంభావ పూరితంగా, లోభస్వాంతులైన వారును తమ జీవితాలను కోల్పోయే ప్రమాదం ఉన్నది. కుండలో పెట్టిన దీపం వెలుతురు ఆ కుండలోనే ఉండి పైకి వ్యాపించనట్లు, తన లాభం మాత్రమే కోరేవాడు ఇతరులకు మేలు చేయడు.

ఆయా పనుల ప్రయోజనాన్ని, పరిపక్వతను, తన వనరులను సమగ్రంగా సమీక్షించుకొని ఆ యత్నము ఫలవంతమౌతుందనే నమ్మకం ఉన్నట్లయితే ముందుకు సాగాలి.. అది ఉత్తమమైనది కాదని అనిపిస్తే.. వదిలివేయడం మంచిది. ధర్మము వీడ కూడదు. పసరుకాయలు తినేందుకు పనికిరావు.. అలాగే అపరిపక్వ మనస్కుల నిర్ణయాలు సమాజానికి శ్రేయస్కరం కావు. గాజు కుప్పెలోని దీపం ఎంత గాలి వీచినా కదలకుండా నిలిచినట్లు స్థిరంగా ఉన్న వ్యక్తిత్వం పరిణతి చెందుతుంది. సంపద ఎంత ఉన్నా ఆశ చావు.. ఇంకా కావాలని కోరుకుంటుంది. దానికి దాయాదులనే భావన నిలువదు. తన పర భేదం ఉండదు.

vidura-విదురుడు

మాలలు అల్లేవాడు తోటలోని పూవులు కోసిన విధంగా, పూవులు కందకుండా తుమ్మెదలు ఎలాగైతే మకరందాన్ని గ్రహిస్తాయో, అలాగే పాలకులు పన్నుల రూపంలో ప్రజలను బాధించకుండా బొక్కసాన్ని నింపుకోవాలే కాని బంగారు గుడ్డును పెట్టే బాతును చంపినట్లయితే మొదటికే మోసం వస్తుంది. ఏ పనినైనా ఆరంభించడానికి ముందే దాని వల్ల ప్రయోజనాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. ఫలితం రాదనే విషయం తెలిశాక, ఫలితానికన్నా ప్రయోజనం చాలా తక్కువ అనే విషయం అర్థమయ్యాక, దాని వల్ల ఎక్కువ మంది నష్టపోతారని అవగాహన కుదిరాక ఆ పనిని చేయకూడదు.

పేద గొప్ప అనే తేడా లేకుండా అన్నిచోట్లా సమానంగా వెన్నెల వెలుగులు కురిపించే చంద్రుని విధంగా హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ సమానంగా ఆదరించే పాలకులను ప్రజ్ఞాపూర్ణ నాయకులుగా ప్రజలు ఆదరిస్తారు. అలాంటి నాయకుడు కొద్ది ప్రయత్నం చేత ఎక్కువ మందికి గొప్ప ఫలితం వచ్చే కార్యాలను ఆలస్యం చేయకుండా ఆరంభించి పూర్తి చేస్తాడు. దీపంతో వ్యక్తి చీకటిని చూసినట్లు జ్ఞానముతో అజ్ఞానాన్ని చూసే నాయకుని ప్రయత్నము ఫలవంతమౌతుంది… అట్లు చూడలేని నాయకుని, పేడివానిని స్త్రీలు భర్తగా తిరస్కరించే విధంగా తిరస్కరిస్తారు. ఒక గ్రుడ్డివాడు, ప్రతిరోజూ ఒక రహదారి కూడలి ప్రాంతంలో దీపం వెలిగించి పొద్దుపోయేవరకు నిలబడేవాడట. అది చూసిన బాటసారి ఒకరు ఆ అంధునితో “నీకు దీపంతో పనేమిటి? అని అడగగా అతడు “నేను చీకటిలో నా పనులు చేసుకోగలను. కానీ ఈ దారిన వెళ్ళేవారు చీకటిలో ఇబ్బంది పడకూడదని ఈ ఏర్పాటు” అని అన్నాడట. ధర్మము వెంట నడవాలి.

అలాగే ఇతరులకై తన సంపదను వ్యయించే వానికి వంశపారంపర్యముగా దక్కిన రాజ్యము నతడు అధర్మము ప్రాతిపదికగా పాలించినంత కాలము వాని సంపద ఏనాటికీ తరుగదు. దీపం నాదే కదా అని ముద్దుపెట్టుకోబోతే మూతి కాలక మానదు. అలాగే తాను ధర్మము ప్రాతిపదికగా రాజ్యము చేసినా; తన రాజ్యములో గాని, పొరుగున ఉన్న రాజ్యములో గాని అధర్మపరులు తన ప్రజలను ఇక్కట్లపాలు చేయరని చెప్పలేము. కాబట్టి పొరుగు రాజ్యంలోని వారిని ప్రయత్న పూర్వకంగానైనా అణచివేయాలి.. అలాగే తన రాజ్యాన్ని రక్షించుకొనడంలో కూడా జాగరూకత వహించాలి. తనకన్నా బలహీనుల పట్ల దయతో ఉండాలి. సాధారణంగా వంచితే వంగేదానిపైన ఎవరూ ఒత్తిడి పెట్టరు కాబట్టి తనకన్నా బలవంతులకు అణిగి ఉండటం కూడా ధర్మమేయగును.

రాజా! పరుల ధనమునకు, రూపమునకు, బలమునకు, సుఖసౌభాగ్యాలకు, సత్కారాలు ఈర్ష్య పొందడం ఒక జబ్బు. దానికి మందులేదు. ఆ రోగానికి అంతమూ ఉండదు. దుర్యోధనుడు అలాంటి మానసిక స్థితిలో ఉన్నాడు. దానికి నీవు వత్తాసు పలుకుతున్నావు. దానివల్ల మీకు శ్రేయస్సు కలగదు. విద్యను అభ్యాసం ఎలాగైతే రక్షిస్తుందో రాజు ప్రజలను అలా రక్షించాలి. రాజునకు మంత్రులే చుట్టాల లాంటివారు. కాబట్టి మంత్రులు సమస్యను కూలంకశంగా చర్చించి సరైన సలహాలను ఇవ్వాలి. ఆ సలహాను పాటించే రాజు లేదా పాలకుడు సుఖాన్ని పొందుతాడు. ఇక్కడ మీరు ఎవరి సలహానూ పాటించకుండా దుర్మార్గానికి ఒడిగట్టడం ధర్మం కాదు.

ఒకవేళ మంత్రులు; రాజునకు చేయకూడని పనులు చేయుటకు, చేయవలసిన పనులను వదులుటకు, పని నెరవేరక ముందే ఆలోచనను బయలుపరచడం లాంటివి చేస్తే… అలాంటి వారిని వదిలివేయాలి. పొగరెక్కిన వానికి సంపదలు, చదువు, అధికారం ఇంకా ఆ మదాన్ని పెంచుతాయి. కౌరవులు ఆ మత్తులో మునిగి, కర్ణాదుల బోధనలతో మరింతగా పతనమై యుక్తాయుక్త జ్ఞానాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి… నీవే ముందుండి ధర్మము ప్రాతిపదికగా నీ తమ్ముని కుమారులను ఆదరించడం వల్ల పెను ప్రమాదాన్ని ఈ జగత్తుకు తప్పించిన వాడవవుతావు. ఆత్మవంతులకు సత్పురుషులే గతి. (ఎప్పటికైనా నీకు పాండవులే గతి అవుతారని అన్యాపదేశంగా చెపుతున్నాడు) దాని వల్ల మీకు ప్రజలకూ శుభం కలుగుతుంది అంటాడు.

మిగితాది పార్ట్ 7 లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *