Shimla – The Queen of Hills Awaits You-5 కొండల రాణి సిమ్లా మిమ్మల్ని ఆహ్వానిస్తోంది:

Shimla – The Queen of Hills Awaits You-5 కొండల రాణి సిమ్లా మిమ్మల్ని ఆహ్వానిస్తోంది:

Shimla – The Queen of Hills Awaits You కొండల రాణి సిమ్లా మీను ఆహ్వానిస్తోంది:

“కొండల రాణి”గా ప్రసిద్ధి పొందిన Shimla, భారతదేశపు ప్రఖ్యాత హిల్ స్టేషన్లలో ఒకటి. హిమాలయాల మధ్యం లోనివున్న ఈ నగరం, శీతల వాతావరణం, కాలనీల శైలిలో నిర్మించిన భవనాలు మరియు పైన్ చెట్ల తివాచీలతో అలరారుతుంది. బ్రిటిష్ ఇండియా కాలంలో ఇది వేసవి రాజధానిగా ప్రసిద్ధి పొందింది.

చరిత్ర, ప్రకృతి, మరియు శాంతి పరవశంలోకి తీసుకెళ్ళే ఈ నగరాన్ని సందర్శకులు ఇప్పటికీ ఆకర్షితులవుతూనే ఉన్నారు. మాల్ రోడ్డులో సంచారం చేయాలా? లేదా మంచుతో కప్పబడిన శిఖరాలను ఆస్వాదించాలా? Shimla లో అన్నీ ఉన్నాయి. ఈ వ్యాసం సిమ్లా అందాలను, ముఖ్య ఆకర్షణలను, మరియు విశేష గమ్యాలను పరిచయం చేస్తుంది.

Shimla – The Queen of Hills

పశ్చిమ హిమాలయ పర్వత పంక్తుల్లో 2150 మీటర్ల ఎత్తులో విస్తరించిన అతి సుందర పర్వత పట్టణం Shimla! ఈ నగరం అంతా కొండల వరుసలతో అంచెలంచెలుగా అలుముకుని వుంది. 1966వ సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని హోదాని సంతరించుకున్న ఈ నగర జనాభా కేవలం ఓ లక్ష మాత్రమే వుంటుందని అంచన. 1819వ సంవత్సరంలో ఆంగ్లేయుల పరిపాలనలో ఈ నగరం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. బ్రిటిష్ రాజ్యాధికారుల ప్రమేయం వల్ల Shimla 1822 నుంచి జనవాసయోగ్యంగా రూపుదిద్దుకోవటం ప్రారంభించింది.

బ్రిటిష్ వైస్రాయి రెసిడెన్సీ భవనం ఓ కొండపైన ప్రత్యేకంగా నిర్మి చబడివుంది. పెద్దకోటలా కనిపించే ఈ ప్రాచీన భవనంలోనే భారతదేశ స్వాతంత్య్రానికి సంబంధించిన అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి! మన దేశచరిత్రలోనే ఓ ప్రముఖస్థానాన్ని సంతరించుకున్న ఈ భవనంలో యిప్పుడు ఓ గ్రంథాలయం నెలకొనబడివుంది.

బ్రిటిష్ నాగరికతకి చిహ్నంగా ఆనాడు నిర్మింపబడిన భవనాలన్నీ కూడా నేటికీ చెక్కు చెదరకుండా వున్నాయి. క్రిస్ట్ చర్చి, గోల్డెన్ కాజిల్, వైస్రాయల్ లాడ్జ్, ప్లానిటోరియంలు సిమ్లాలోని ముఖ్యాకర్షణీయ ప్రాంతాలుగా చెలామణి అవుతున్నాయి.

Shimla నగరం బ్రిటిష్ కాలంలోనే ఇండియా వేసవి రాజధానిగా ఆ రోజుల్లోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది! కొండల వరుసలో లోయలోకి జారిపోతున్నట్లుగా కనిపించే ఈ నగర అంతర్భాగంలో ఓ అందమైన మైదానం వుంది. దాన్ని ‘మాల్’ అని పిలుస్తారు. ఇక్కడి నుంచి సిమ్లా లోయలన్నీ కూడా ప్రకృతి శోభని మనకళ్ళకి సాక్షాత్కరింపచేస్తాయి.

 మంచుముసుగు వేసుకున్న కొండ శిఖరాలన్నీ కూడా మనకు అందుబాటులో వున్నట్లుగా భ్రమని కలిగిస్తాయి. శీతాకాలంలో మంచు తుఫానుకు గురి అయ్యే ఈ నగరం పర్యాటకుల్ని ఓ అద్భుత అనుభూతికి లోనుచేస్తుంది. మంచు రజను కురుస్తుంటే పర్యాటకుల రద్దీ అధికంగా వుంటుంది.

 లోయలన్నీ కూడా మంచుపొడితో నిండి పోవటం జరిగినప్పుడు ప్రయాణ సౌకర్యాలు కొద్దిగా యిబ్బందిని కలిగిస్తాయి. పేరుకునిపోయిన రోడ్డు పైన మంచుని తొలిగించటానికి పెద్ద పెద్ద యంత్రాల్ని ఉపయోగిస్తారు. ఈ సీజనులోనే యిక్కడ మంచు క్రీడలు కొనసాగుతాయి. కారణంగానే అనేక స్కేటింగ్ కేంద్రాల్నిక్కడ అభివృద్ధి చేయటం జరిగింది.

నగరంలోని రోడ్డు మార్గాలన్నీ కూడా కొండ అంచులపైన నిర్మించబడివున్నాయి. అతి ఇరుగ్గా కనిపించే యిక్కడి వీధులన్నీ కూడా రంగురంగుల వస్తుసముదాయంతో అతి సుందరంగా కనిపిస్తాయి.

Shimla చేరుకోవటానికి న్యారోగేజి రైలుమార్గం కూడా వుంది. చండీఘర్ దగ్గరి కల్కానుంచి ఈ రైలు బయలుదేరుతుంది. నగరంలో నివసించటానికి అనేక హోటళ్ళున్నాయి. Shimla లోని ప్రతి ప్రాంతం కూడా ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది. ముఖ్యంగా ‘మాల్’ నుంచి ఓ గంటనడక మనని 2450 మీటర్ల ఎత్తులోని ఓ శిఖరానికి చేరుస్తుంది. 

Shimla లోని ప్రతి ప్రాంతం కూడా ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది.

అక్కడి ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని ‘ఝంకూ మందిరం’ అని పిలుస్తారు. యిక్కడి నుంచి హిమాలయ పర్వత శిఖర దర్శనం మన కళ్ళని చెదరగొడుతుంది. సిమ్లాలోయంతా అక్కడి నుంచి సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది.

Shimla లోని ఇళ్ళన్నీ దాదాపుగా కర్రతోనే నిర్మించబడి ఉంటాయి. వసతిని ఏర్పాటు చేసుకోవటం జరుగుతోంది. ప్రాచీన కాలంటేనే కర్రతో చలిబారినుంచి తప్పించుకునేందుకు ఈ నిర్మించబడిన కొన్ని దేవాలయాలు నేటికీ ఆనాటి చిత్రకళని ప్రదర్శిస్తున్నాయి. పోలీ, కంగ్రా సంస్కృతికి చెందిన అనేక నిదర్శనాల్ని ఇక్కడ ఓ మ్యూజియంలో భద్రపరచటం జరిగింది.

Himachal Pradesh రాష్ట్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో సిమ్లానుంచి అనేక యాత్రస్థలాలకి బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. తారాదేవీ, సంకటమోచాన్, కామనాదేవీ మందిరం మొదలగునవి. యితర దర్శనీయస్థలాలుగా చెప్పుకోదగ్గవి! చాడ్విక్ జలపాత సుందర దృశ్యం వర్షాకాలంలో అద్భుతంగా వుంటుంది. సంవత్సరంలోని ఏ కాలంలోనయినా సిమ్లాని చేరుకోవచ్చును. కాని జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మాత్రం చలిబారి నుంచి తప్పుకునేందుకు ముందుగానే తగు శ్రద్ధ వహించాలి !

ఒకప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్వారు తమ కలోనియల్ భవనం నుంచి పరిపాలించారు. ఆ భవనమే నేడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ రూపొందింది. లార్డ్ కర్జన్ పీటర్ కట్టించిన భవనం నేడు హిమాచల్ టూరిజం వారి అధీనంలో లార్డ్ రాబర్ట్ బాడెన్ పావెల్, రడ్ యార్డ్ కప్లింగ్, అమృతా సిగ్గిల్ లేడీ థియేటర్లు ఇక్కడ వున్నాయి. గైట్ ఒక సాంస్కృతిక కేంద్రం. ఇక్కడ ఇప్పటికి ఎన్నో మంచి నాటకాలను ప్రదర్శిస్తారు. ఇది వందవ జయంతి వుత్సవాన్ని జరుపుకుంది.

బాంటోని హిల్స్; హిమాచలప్రదేశ్లో హిమాచల స్టేట్ మ్యూజియం వుంది. ఇందులో దారుశిల్ప కళ, నగిషీ చేసిన నగలు, తాళపత్రాలు ఆయుధాలు ఇంకా ఎన్నో వున్నాయి. ఇది సిమ్లా లోని నాలుగవకొండ. ఇందులో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఘట్టాలున్నాయి. ఇది విలియం బెంటిక్కు నివాస స్థానంగా వుండేది. బాంటోనికి పాత నివాస స్థానంగా ప్రస్తుతం అతిపెద్ద పోలీసు క్వార్టర్స్ గా చెలామణీ అవుతోంది. బాంటోని కొండకు ఇంకా ముందుకు వెళితే శ్యామల అమ్మవారి గుడి వుంది. ఇంకా కొంచెం మందికి వెళితే య్యాండ్రూస్ చర్చి వుంది. అక్కడే కాళిబరి ఆలయం వుంది.

ఎలీసియం అండ్ జకూ కొండలు: ఎలిసియం కొండ నుండి కిందకు చూస్తే Shimla పరిసరాలలో వ్యాపించి వున్న దృశ్యణి చూడవచ్చు. నాటి లార్డ్ అకండ్ ఇల్లు నేడు ఒక స్కూలుగా మారింది. దానిని దాటి కొంచెం ముందుకు వెలితే పాటో, కమీనా గ్రామాల్ని చూడవచ్చు. జకూహిల్ ఈ ప్రాంతంలోని మిగిలిన చలన్నిటిలోకి పెద్దది. ఇది సెంట్రల్ రిమ్లాలో వుంది. ఇక్కడి హనుమంతుని ఆలయం చాలా పెద్దది. సిమ్లాలోని సూర్యో దయాన్ని మనం ఇక్కడ నుంచి ఎంతో ఆనందంగా చూడవచ్చు. ఇక్కడి క్రీస్తు చర్చిని ఎన్నో మైళ్ళదూరం నుంచి కూడ చూడవచ్చు. . ఇక్కడ ప్రతి ఆదివారం పేద ప్రజలకు సేవలు వస్తుంటారు.

shimla the queen of hills

Shimla కి ఒక స్పష్టమైన ఆకృతిని తీర్చిదిద్దాడు రుడ్ యార్డ్ తండ్రి జెలార్క్ుడ్. ఆయన ప్రతిష్టాత్మకమైన జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్కు ప్రధానోపాధ్యాయుడు. అఖిల భారత కాంగ్రెస్ను స్థాపించి ఏ.ఓ. హ్యూమ్ ఇల్లు ఇక్కడే వుంది. ఇక్కడ పట్టణంలోని ట్రాఫిక్ను ఆపేందుకు అందరిని నడవమంటారు. ఇక్కడ రోల స్కేటింగ్, ఐస్ స్కేటింగ్లింక్, ఐస్ స్కేటింగ్ జరుగుతూ వుంటాయి.

ఇక్కడ వాకింగ్ స్టిక్లు, వులెన్ శాలువాలు, టోపీలు కులుమనాలీలు తయారు చేసి అమ్ముతారు. కెనెకెనెరిమఫ్లర్లు స్కార్లు, చంబా రుమాలలు, బుద్ధిస్ట టంగ్కాలు, కాంగ్రామిని ఏచర్లు ఇంకా అనేక సావనీర్లు వుంటాయి. 

చబ్సీలీ : ఇది అన్లాండ్ ఎదురుగా వుండేది. ఇక్కడ 6 రూములు వున్నాయి. ఇక్కడ క్రెడిట్ కార్డ్, వీసాను కూడ అంగీకరిస్తారు. ఇక్కడ కార్డ్ రూమ్, క్రోక్వెట్లాన్, టెన్నిస్ కోర్టు కూడ వున్నాయి. ఇక్కడ రాజకళ ఉట్టిపడుతూ వుంటుంది.

వుడ్ విల్లీ ప్యాలెస్: ఇది కొండ ప్రక్కన వుంది. ఇక్కడ 25 రూములు వున్నాయి ఇక్కడ, ఇక్కడ క్రెడిట్ కార్డ్, వీసాను కూడా అంగీకరిస్తారు. ఇక్కడ రెస్టారెంటు, ఆధునిక సదుపాయాలు కూడా వుంటాయి. ఇక్కడ రూములను ఢిల్లీ నుంచి కూడ రిజర్వ్ చేసుకోవచ్చు.

బిలాస్పూర్: బిలాస్పూర్ హిమాచల్ రాష్ట్రంలోని ఓ హిల్ స్టేషనుగా ప్రసిద్ధి చెందింది. చారిత్రికంగా ఒకప్పుడే ప్రాంతం బిలాస్పూర్ రాజ్యంగా వుండేది. సట్లెజ్ నది వొడ్డున ఓల్డ్ బిలాస్పూరక్కు ఎత్తయిన చోట నేటి బిలాస్పూర్ విస్తరించి వుంది. ఇది హిమాచల్ ప్రదేశ్లో మొట్టమొదటి ‘ప్లాన్డ్ హిల్ స్టేషను’గా చెప్పవచ్చు. ఇక్కడి ఓ సదస్సు పర్యాటకులకు బోటు షికారు సౌకర్యాన్ని కలిపిస్తుంది. దీన్ని గోవింద సాగర్ అని పిలుస్తారు.

ఈ కొండపై నుంచి లోయల్ని వీక్షించటం, పరిసరాల్లోని ప్రకృతిని ఆస్వాదించటం యిక్కడి కొచ్చే పర్యాటకుల ముఖ్యోద్దేశ్యం. సిమ్లా నుంచీ, చండీఘర్ నుంచి యిక్కడికి బస్సు సౌకర్యం వుంది. శీతాకాలంలో ఊలెన్ దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. స్థానికంగా బహుద్దూర్ కోట, నైనాదేవి మందిరం, సరియా ఫోర్ట్, టియున్ ఫోర్ట్, వ్యాస గుహ, స్వరఘాట్, మార్కండేయ గుడి ముఖ్య దర్శనీయ స్థలాలుగా గమనించాలి.

మణిమహేశ్ : హిమాచల్ ప్రదేశ్ లోని ‘చంబా’ జిల్లాలో వున్న ఈ హిల్ స్టేషన్ 4170 మీటర్ల ఎత్తులో వుంది. ఇది గొప్ప శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. మణిమహేశ్లో ఓ సరస్సు కూడా వుంది. ఇక్కడి నుంచి మనం కైలాస పర్వతాన్ని చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ట్రెక్కింగికి ఉపయోగిస్తారు. భార్మ్మావోర్ నుంచి ఈ క్షేత్రం 35 కి.మీ. దూరంలో వుంది, ‘హడ్సా’, దాంచా అనే గ్రామాలగుండా కొండపైకి నడుస్తూ చేరాలి. భార్మావూర్లో వసతి లభిస్తుంది.

ఢిల్లీ నుంచి పఠాన్ కోట ద్వారా యిక్కడి చేరుకోవాల్సి వుంటుంది. చంబా యిక్కడికి 55 కి.మీ. దూరంలో వుంది. ధర్మశాల నుంచి కూడా యిక్కడికి చేరుకోవచ్చు. భందాల్ వ్యాలీ ఈ లోయని ట్రెక్కింగికి ఉపయోగిస్తారు. చంబా లోయలో నుంచి కిష్టావర్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు. ధగ్నిధార్ అనే చోటు నుంచి జమ్మూ, కాశ్మీర్ రీజియన్లో వున్న ఈ పర్వత శ్రేణికి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది. సలూనీ అనే చోటు నుంచి చంబాలోయ మొదలవుతుంది.

సిరాజ్ : సిరాజ్ ఓ చారిత్రక స్థానం! సట్లెజ్ నదీ తీరంలో వుంది. కులూ నుంచీ, Shimla నుంచీ యిక్కడికి చేరుకోవచ్చు. ప్రకృతి పర్యాటకుల మనస్సుని దోచేస్తుంది. దాపులోని అడవులకు ముంతకారా, పానే లనే చోటుల్లో అనేక విశ్రాంతి గృహాలున్నాయి. ఈ ప్రాంతంలోని శిథిల మందిరాల్ని మనం తప్పక చూడాలి.

ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. శ్రీఖండ మహాదేవ శిఖరం యిక్కడికి దాపులోనే వుంది. 5155 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు ట్రెక్కింగ్ చేసేవారికిది బేస్ క్యాంపుగా ఉపయోగపడుతోంది.

నూర్పూర్ : పఠాన్ కోట్కి 22 కి.మీ. దూరంలో వున్న ఈ ప్రాంతం చారిత్రికంగా పేరు పొందింది. గతంలో దీన్ని ‘ధామేరి’ అని పిలిచేవారు. రాజా బాసు అనే రాజు క్రీ.శ. 1580-1613ల మధ్య ‘నూర్పూర్ ‘ని పరిపాలించాడు. అతని కాలంలోనే ఈ నగరం చాలా అభివృద్ధి చెందింది. ఈ రాజు కొడుకు అయిన సూరజ్మల్ చరిత్ర ప్రసిద్ధి చెందాడు.

రాజా సూరజ్మల్, మొఘల్ చక్రవర్తి జహంగీర్ నెదిరించి ఓడిపోయాడు. తన విజయ సూచకంగా ‘ధామేరి’ పేరు మార్చి తన భార్య నూర్జహాన్ పేరిట ఈ పట్టణానికి ‘నూర్పూర్ అని పేరుని ప్రచారంలోకి తీసుకు వచ్చాడు జహంగీర్ చక్రవర్తి, యిక్కడి కోటని భారీ స్థాయిలో నిర్మించారు. స్థానికంగా బ్రిరాజ్ మందిరం వుంది. ఈ మందిరాన్ని శ్రీకృష్ణ దేవుడికి అంకితం చేసారు. ఈ నూర్పూర్ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ వుంటుంది.

 మాసురూర్ : ధర్మశాలకు 42 కి.మీ. దూరంలో వున్న ఈ చారిత్రిక స్థానం ఎనిమిదవ శతాబ్దం కాలం నాటిది. ఇక్కడనేక మందిరాన్ని కొండల్ని తొలిచి మలిచారు. యివి అజంతా ఎల్లోరా గుహల్ని మరిపిస్తాయి. యిక్కడి రామాలయం ముఖ్య మందిరంగా భావించబడుతోంది. ఎనిమిది వందల మీటర్ల ఎత్తున వున్న ఈ హిల్ స్టేషన్ పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ధర్మశాలను దర్శించే వారంతా యిక్కడికి వస్తుంటారు. యిక్కడికి ధవళదార్ లేదా ధవళగిరి హిమవత్ పర్వతం దర్శనం యిస్తూ వుంటుంది.

మషోబ్రా : సిమ్లాకి 12 కి.మీ. దూరంలో వుందీ ‘మషోబ్రా’ అనే ట్రెక్కింగ్ క్రీడాకారుల కూడలి స్థలం. చుట్టూ దట్టమయిన అడవులతో నయనానందకరంగా వుంటుంది మషోబ్రా గ్రామం. మషోబ్రా నుంచి నడుస్తూ ‘శీపుర్’ అనే ప్రాంతానికి చేరుకుంటూ వుంటారు పర్యాటకులు, ట్రెక్కింగ్ క్రీడల్నిక్కడి నుంచి ‘షాలీ’ పర్వత శిఖరం దాకా నిర్వహిస్తుంటారు. ఇక్కడనేకం చిరు నదులు ప్రవహిస్తుంటాయి. వాటి చుట్టూ అనేకమందిరాలు శిథిలావస్థలో వున్నాయి. కాని కొన్నింటిలో పూజలు నిర్వహించబడుతున్నాయి.

క్రాగ్నానో అనే విశ్రాంతి గృహాన్ని ఓ ఇటాలియన్ దేశస్థుడిక్కడ కట్టించి నివసించాడట. అదిపుడు యాత్రికులకు, పర్యాటకులకు, ట్రెక్కింగ్ క్రీడాకారులకు ఉపయోగపడుతోంది. ఇక్కడికి Shimla నుంచి రోడ్డు వుంది. కాని కార్లు మాత్రమే నడుస్తుంటాయిక్కడ.

రామపూర్, సరహాన్: సిమ్లాకు 140 కి.మీ. దూరంలో సట్లెజ్ నదీ తీరంలో వుందీ చిన్న సైజు పట్టణం. ఇది చేరు మార్గం ప్రారంభమవుతుంది. ఒకప్పటి బుల్స్టార్ వంశపు రాజులకు రాజధానిగా వుండేది. ఇక్కడి రాజభవనం చెక్కు చెదరకుండా ఓ దర్శనీయ ప్రాంతంగా మారింది.

దాపులోని దత్తానగర్, నీరత్ గ్రామాల్లో చాలా అందమైన మందిరాలున్నాయి. అవికాక దాపులోని ‘సరహాన్’ అనే చోట ‘భీముకాళి’ మందిర సముదాయం వుంది. ఇది ఓ శక్తిపీఠంగా గుర్తించబడింది. ఇక్కడి నుంచే కిన్నోర్ హిమవత్ పర్వతాలకు

చోపాల్ : సిమ్లాకి వంద కి.మీ. దూరంలో వున్న ఈ చిన్న పట్టణం ‘చూర్ ‘చందానీ’ శిఖర ద్వారంగా పనిచేస్తోంది. చూర్ చందాని అంటే ‘మౌంటెన్ ఆఫ్ సిల్వర్ బ్యాంగిల్’ అని ఇంగ్లీషు అర్థాన్ని అన్వయించుకోవాలి. దీన్నే ‘మార్గార్’ పర్వతం అంటూ ఈ మధ్యకాలంలో పిలుస్తున్నారు. దాపులోని శివాలయం, లంకాబీర్ అని రావణాసురుడి ఆలయం యిక్కడి ఆకర్షణలు.

హట్ కోటె : సిమ్లాక్ 120 కి.మీ. దూరంలో వున్న పౌరాణిక స్థానంలో అనేక మందిరాలు దాదాపు ఐదు కి.మీ. దూరం మేర విస్తరించి వున్నాయి. హెబ్బార్ నది వొద్దున వున్న ఈ క్షేత్రంలో కొంత కాలం మహాభారత కాలం నాటి పంచపాండవులు నివసించారని స్థల పురాణం వక్కాణిస్తోంది.

స్థానిక మహిషాసుర మర్దనీ దేవాలయంలోని అమ్మవారు ‘హటేశ్వరి’ అని పిలువబడుతోంది. దేవాలయాలన్నీ ఎనిమిదవ శతాబ్ద కాలం నాటివి. ఈ ప్రాంతాన్ని దర్శించే యాత్రికుల కోసం అనేక విశ్రమాలయాలు, హోటళ్ళు పనిచేస్తున్నాయి. హిమాచలప్రదేశ్ టూరిజంవారు ‘హోటల్ హెబ్బార్’ పేరిట ఈ మధ్యనే సౌకర్యాలు గల వసతి గృహాన్ని కట్టించారు.

ద్రోహు : సిమ్లాకి 130 కి.మీ. దూరంలో హట్ కోటెకి దగా వున్న ఓ చిన్న స్టేషను ‘రోహురు’. ఈ పర్యాటక స్థలం 1550 మీటర్ల ఎత్తులో వుంది. పాట్ కోటిని దర్శించిన యాత్రికులిక్కడికి కూడా వస్తుంటారు. ఈ ఊర్లు కూడా ‘పెబ్బార్’ నది వొడ్డున్నే వుంది. ఓ రకంగా చెప్పాలంటే ఫెబ్బార్ నదీలోయ యిక్కడి నుంచే ఆరంభమవుతుంది.

‘ఇక్కడ ‘శత్రుదేవతా’ మందిరం వుంది. యివికాక మరికొన్ని మందిరాలు ‘రోహ్రు’కు చుట్టు ప్రక్కల్లో వున్నాయి. యిక్కడ కూడా వసతి సౌకర్యాలు వున్నాయి. కాని యాత్రికులెక్కువగా ”పాట్కిటె’లోనే బస చేస్తుంటారు.

 దోద్రా క్వార్: రోహ్రూకతి సమీపంలో వున్న ఈ కొండ పట్టణానికి రోడ్డు మార్గం లేదు. ట్రెక్కింగ్ క్రీడాకారులు ప్రక్కనున్న లోయలోకీ లేదా ‘షరాంగ్’ హిమగిరికీ కాలినడకన వెళుతుంటారు. ఇక్కడనేక జలపాతాలున్నాయి. లెక్కలేనన్ని సెలయేర్లు ప్రవహిస్తున్నాయి. యిక్కడ కర్రలతో నిర్మించిన గుళ్ళు కొన్ని వున్నాయి. కాని వాటిని దర్శించే వారే కరువయ్యారు.

ఛాలెట్స్ నల్ దెహరా : ఛాలెట్స్ నల్ దెహరా చాలా దట్టమైన అరణ్యంలో కూడిన కొండలో లోతైన లోయలో వుంటుంది. ఇక్కడ విశ్రాంతి, vacation కోసం కుటుంబంతో వుండవచ్చు. గోల్ఫ్ ఇంకా ఇతర క్రీడలు, మైదానాలు, కాన్ఫరెన్స్ హాల్స్ వున్నాయి. ప్రతి ఒక్క గదిలోనుంచి ఎంతో ఆహ్లాదకరమైన దృశ్యాలను Window నుంచి చూడవచ్చు. ఛాలెట్స్ హోటళ్ళు అన్నీ ఆధునికంగా, దారు శిల్పంతో నిండి వున్నాయి.

కులూ, మనాలీ, పార్వతీ వ్యాలీ మరియు సిమ్లా వంటి హిమాలయాల అందాల లోకం నుంచి మీరు ప్రయాణాన్ని ముగించుకునే వేళ, మిగిలేది మంచు తవ్విన జ్ఞాపకాలు, లోయల ఆహ్లాదకర దృశ్యాలు మరియు సూర్యాస్తమయపు స్వర్ణ క్షణాలే. ఇవి సాధారణ పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాకుండా, మనసుకు శాంతినిచ్చే ప్రకృతి ఆశ్రయాలుగా నిలుస్తాయి. సాహసానికి నిండిన ఆహ్వానం కావొచ్చు, లేక నిశ్శబ్ద పర్వతాల మౌన సంచారమవొచ్చు – ప్రతి ప్రదేశమూ ఓ ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఈ ప్రయాణం మీకు స్ఫూర్తినిచ్చి, మళ్లీ అక్కడికి వెళ్లాలనే కోరికను రేపుతుంది. అప్పటివరకు, పర్వతాల మాయాజాలాన్ని హృదయంలో నిలుపుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *