Vidura Neeti – A Friend’s Nature Influences Our Life: Vidura part-9

Vidura Neeti – A Friend’s Nature Influences Our Life: Vidura part-9

Vidura Neeti – A Friend’s Nature Influences Our Life: Vidura part-9

Vidura Neeti – A Friend’s Nature Influences Our Life: Vidura part-9 ఎవరితో స్నేహం చేస్తే వారిలాగే…. యాదృశాంతోప సేవతే యాదృచ్ఛేఛ భవితుం తాదృగ్భవతి పూరుషః! మనుజుడు ఎట్టివారితో సహవాసం చేస్తే, ఎవరికి సేవలు చేస్తే, ఎవరిలా ‘మారాలని భావిస్తాడో అట్టివానిగానే మారిపోతాడు. సజ్జనునితో, దుర్జనునితో, తాపసితో, దొంగతో.. ఇలా ఎవరితో సహవాసం చేస్తే ఆ లక్షణాలు బట్టలకు రంగంటుకున్నట్లుగా తాను పొందుతాడు.

వ్యక్తికి సమాజంలో మిత హిత సత్యవాక్కులు గౌరవాన్ని ఇస్తాయి. మితంగా “మాటలాడటం అంటే తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వినడం మంచిది… ఆ మాట్లాడటం ఇతరులుకు హితంగా మాట్లాడటం వల్ల వారి అభిమానాన్ని పొందగలుగుతాము. చొల్లువాగుడు కార్యభంగానికి కారణమౌతుంది. 

సత్యము మాట్లాడటం వల్ల భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో ఎదుగుదల నిశ్చితమౌతుంది. వస్తు సంబంధితమైనది “వాస్తవం”, కాగా అందరూ ఒప్పుకునేది “నిజం”, కాగా సార్వకాలికమైనది, సార్వజనీనమైనది “సత్యము”. నిజానికి మాట్లాడటముకన్నా మౌనమే మేలు అంటారు. ఒకవేళ అవసరమై మాటలాడవలసివచ్చిన సమయంలో ధర్మాన్ని అతిక్రమించకుండా సత్యాన్నే మాట్లాడటం ఉత్తమోత్తమం. మానవులను మూడు వర్గాలుగా పెద్దలు గుర్తించారు. దూరదృష్టి కలిగినవాడు, తాత్కాలిక దృష్టి కలిగిన వాడు, అసలే దృష్టి లేనివాడు. వీరినే సాత్విక రాజస తామస ప్రవృత్తులు కలిగిన వారిగా చెపుతారు. అన్వేషణ, జ్ఞానసాధన, సమదర్శన, సమవర్తన, సమత్వభావన, ఆలోచనలో సమత్వం, నిత్యసంతోష మనస్సు… ఈ లక్షణాలు కలిగిన వారిది సాత్విక ప్రవృత్తిగా చెపుతారు. వీరికి దూరదృష్టి ఉంటుంది.

అహంకారం, స్వార్థపరత, అమితమైన ఆశ, నేనే సరైన వాడిననే భావన, అధికారం నాదే అని విర్రవీగే తత్త్వం… ఈ లక్షణాలు కలిగిన వారిది రాజన ప్రవృత్తిగా చెపుతారు. వీరికి తాత్కాలిక దృష్టి ఉంటుంది. తెలియని తనము, దానిని ఒప్పుకోకపోవడము, ప్రతిదానికీ ఎదుటివారితో వాదించడం, తెలివితో ఆలోచించలేకపోవడము, తన మార్గం తప్పు మార్గమని తెలిసినా దానివల్ల తనకపకారం అని తెలిసినా, పట్టువదలక పతనాధ్వంలో ఈ లక్షణాలు కలిగిన వారిది తామస ప్రవృత్తిగా చెపుతారు. వీరు సాధారణంగా చపలచిత్తులుగా ఉంటారు. కారణం లేకుండానే కోపగిస్తారు లేదా.. ప్రసన్నులగుతారు.. 

నిజం చెప్పాలంటే వీరు గాలివాటుకు చలించే మేఘం వంటి సాగిపోవడం మనస్సు కలవారు. అయితే సాత్వికుని దూరదృష్టి, రాజసుని ఆలోచన, తామసుని క్రియాశీలత ఈ మూడూ కలసిన వేళ కార్యం ఆవిష్కృతమౌతుంది. తెలియని సందర్భాలలో తెలిసిన వారిపై ఆధారపడటం (Dependence), తనకు తెలిసిన సందర్భాలలో తనపై తానే పై ఆధారపడటం (Independence), సామాజిక క్షేత్రాలలో సంఘటిత శక్తిపై పై ఆధారపడటం (Interdependence), సార్వత్రిక విజయానికై ఒకరికి మరొకరు తోడవడం వల్ల కార్యసాధన సులువవుతుంది.

ఆహార సామాగ్రిని తానే సమకూర్చుకుంటుంది. అలాగే బాల్యం నుండే మానవుని వృక్షం తన వేళ్ళ ద్వారా పరిసరాల నుండి తన పెరుగుదలకు అవసరమైన అవచేతన జాగృతంకాగా పరిసరాల నుండే తనకు అవసరమైన అన్ని విషయాలనూ ఆకళింపు చేసుకుంటుంది. మానవ జీవనమూ సకల జీవుల జీవనంతో ముడిపడి.. విశ్వము వ్యవహరించే అనంతకాలు ప్రవృత్తిలోని “లయ”తో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. సార్వత్రిక విజయాన్ని కాంక్షించిన వేళ ఉత్పత్తి, ఉత్పాదకతలు అవసరమౌతాయి. అవి వస్తువులే కానవసరం లేదు. సంస్కృతిపరంగానూ అన్వయించుకోవచ్చు. సంస్థ పురోగతిలో సంఘటిత శక్తియే విజయసాధనలో పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. 

భాగస్వాములౌతారు. సిబ్బంది శక్తి సామర్ధ్యాలను యాజమాన్యం గుర్తించాలి, సంస్థ ప్రగతిలో యాజమాన్యం, సిబ్బంది. విశ్వసించాలి. ఎవరెవరి అర్హతలను అనుసరించి ఆయా విభాగాలలో వారిని కలిపి బృందాలుగా ఏర్పరచాలి. వారిలోని సామర్ధ్యాన్ని వెలికితీసేందుకు అవసరమైన ప్రేరణ కల్పించేందుకు, సరైన వాతావరణాన్ని కల్పించాలి. ఆ ప్రక్రియ ద్వారా వారి వ్యక్తిగత ప్రగతి, సంస్థ సుగతి, దేశ అభ్యుదయము ఎలా ఉండబోతుందో… వారు దర్శించగలిగిన స్ఫూర్తిని వారిలో నింపాలి. అవసరమైన సాంకేతికతను సంతరించుకునే దిశలో శిక్షణను ఇవ్వాలి. ఇప్పించాలి. ఆ శిక్షణనిచ్చే వ్యక్తులు/ సంస్థల సమర్ధతను తెలుసుకోవాలి. ఆ శిక్షణపొందిన సిబ్బంది చైతన్యవంతులయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

రాజా! దుశ్శాసనుడు, తనపై తనకే నమ్మకము లేనివాడై, పెద్దవారు బోధించినా ఆ మంచిని గ్రహించలేక, మిత్రులను నిరాకరిస్తూ తన సహజ స్వభావమైన కోపాన్ని ఆదరిస్తూ ఉన్నవాడు. అలాంటి అధముని ఆదరిస్తున్నాడు దుర్యోధనుడు. వారికి వత్తాసుపలుకుతూ కపట వర్తనతో వారిలోని దుర్గుణాలను పెంచుతున్నాడు శకుని. తనకు లేని శక్తిసామర్ధ్యాలను ఉన్నట్లుగా తాను భ్రమిస్తూ దుర్యోధనుని భ్రమింపచేస్తూ డాంబిక జీవనాన్ని సాగిస్తున్నవాడు కర్ణుడు. వారి ఆధ్వర్యంలో యుద్ధాన్ని నీవు ఆమోదిస్తున్నావు. శాంతి ఎలా సాధ్యపడుతుంది?

vidura wisdom

శుభములు కావాలి అంటే ఉత్తములనే సేవించాలి. గతిలేని సమయంలో మధ్యములను సేవించడం సమంజసమే కాని ఏ పరిస్థితులలోనూ అధములను సేవించకూడదు… ఆదరించకూడదు. అయినా నీవు వారినే ఆదరిస్తూ.. శుభములు కోరుకుంటున్నావు. దీపం పట్టుకొని దారిలో నడుస్తుంటే దీపం వెలుతురు ముందున్న మీద పడుతుంది. తరువాత ఆ స్థలం మీదికి దీపమే వస్తుంది. వెలుతురు ముందుకుపోతుంది. వెనుక చీకటి ఆక్రమిస్తూనే ఉంటుంది. ఆ దీపపు కాంతి వంటివారు ఉత్తములు.

సమాజానికి శ్రేయస్కరమైన ఒక ఉదాత్తమైన కార్యావిష్కరణలో ఉత్తమ, మధ్యమ, అధమ మనస్తత్వాలు కలిగిన వారినందరినీ భాగస్వాములను చేయాలి. ఎలాగైతే వత్తి, నూనెలు విడివిడిగా మంటను ఆర్పేవే అయినా దీపంగా లోకానికి వెలుగునిస్తాయో అలాగే మూడు మనస్తత్వాలు కలిగిన వారు కూడా కలసి ఉదాత్తమైన కార్యాన్ని సాధించగలరు.

High thinking is the source of progress. ఉన్నతమైన ఆలోచనలే ప్రగతికి మూలం

అనవాప్యంచ శోకేనా శరీరం చోపతప్యతే అమిత్రాశ్చ ప్రహృష్యంతి మాస్మ శోకే మనః కృథాః! రాజా! ఏడుపు వలన రాగోరినది రాదు.. పైగా శరీరము మండిపోవును. అంతేకాదు పగవారు సంతోషిస్తారు. కనుక శోకమున మనసు పెట్టకుము. అంతేకాదు.. కుమిలిపోవడం వల్ల రూపము చెడుతుంది. బలము తగ్గుతుంది. జ్ఞానము నశిస్తుంది. రోగాలు ప్రబలుతాయి. నిజానికి తెలియని దానిని తెలుసుకోవడం ఉత్తమోత్తమం. అయితే దానిని ఆచరణలోకి తేనంతవరకు దాని ప్రయోజనం పరిమితమే. తెలుసుకోవడం అనేది తెలియని తనాన్ని లేదా తెలియని “తనను” కోల్పోవడమే.

దుఃఖించడం, కుమిలిపోవడం వల్ల మానవుని పౌరుషం నీరుకారిపోతుంది. వీటికి మూలం ఆలోచనలు. ఆలోచనలే ప్రగతికి కాని పతనానికి గాని చేరుస్తాయి. ఆరోగ్యవంతమైన ఆలోచనల వల్ల చెడు ఫలితాన్ని ఏనాడూ పొందము. చెడు ఆలోచనలు మాత్రమే చెడు ఫలితాన్ని ఇస్తాయి. మామిడి చెట్టుకు మామిడి పండ్లు వేప చెట్టుకు వేపకాయలు మాత్రమే కాస్తాయి కదా.

మనమేదో దిశలో చేసిన చెడు ఆలోచనల ఫలితమే బాధలు, భయాలు. అంతశ్చేతనలో మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణల ఫలితంగా సంతోషం కాని బాధ కాని వ్యక్తమౌతాయి. దానికి పరిస్థితులు వత్తాసు పలుకుతాయి.. ఆ భావోద్వేగాలను బలోపేతం చేస్తాయి. చెడు ఆలోచనలు ఎప్పుడూ భౌతిక సంపదలు, పేరు ప్రఖ్యాతులు, అధికార డాంబికాదుల వెంట పరిగెత్తిస్తుంటాయి. వీటితో బలోపేతమైన “ఆశ” ఊహల సౌధాలలో ఊరేగుతూ దౌర్భాగ్యాన్ని వెంట తెస్తుంది. కనీస అవసరాలకన్నా భౌతిక సంపదలు ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా అది దౌర్భాగ్యంగానే పరిగణించాలి.

పశుప్రాయమైన ఆలోచనాసరళి అలవాట్లుగా మారి వ్యక్తిలోని సున్నితత్త్వాన్ని మ్రింగివేస్తుంది. ఆ అలవాట్లే పేదరికానికి, అనారోగ్యానికి కారణభూతమౌతాయి. భయం, అనుమానం, సందేహాలతో కూడిన ఆలోచనలు బలహీనమైన, పౌరుషం లేని అస్థిరమైన అలవాట్లుగా మనసులో రూపు దిద్దుకుంటాయి. అవే వ్యక్తి వైఫల్యాలకు కారణమౌతాయి. దానితో పనికిమాలిన, బానిస మనస్తత్వం మనిషి వ్యక్తిత్వంగా మారి, ఇతరులపై ఆధారపడే వ్యక్తిత్వం తయారవుతుంది.

బద్ధకానికి ఆలవాలమైన ఆలోచనలు నిజాయితీ లేని అలవాట్లకు దారి చూపుతాయి. ఒకరిపై ద్వేషం పెంచుకున్న ఆలోచనల వల్ల మనిషిలో హింసా ప్రవృత్తి వెలుగు చూస్తుంది. రాజా! నీ ఆలోచనలను మంచివైపు మళ్ళించు. ధర్మాన్ని నిలుపు.. అదే నీకు శాంతి నిస్తుంది. సామాజికస్థాయిలో ఏకత్వాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదించేది ధర్మమే. నీ చుట్టూ చేరిన నీ సలహాదారులు ప్రతిభావంతులు, సమర్ధులే కాదు.. నీ శ్రేయస్సును, ప్రజల శ్రేయస్సును కోరేవారు కావాలి. నేను చెప్పే సూక్తులు నీ చెవి చేరడం. లేదు. కార్యావిష్కరణలో సమగ్ర స్వరూప నిరూపణ చేయడమే సూక్తి. భౌతిక ప్రగతి, ఆధ్యాత్మిక సుగతి, శాంతి, అభ్యుదయము లాంటివి చేకూరడం సూక్తుల వల్ల పరమమైన ప్రయోజనము. ధనకనక వస్తు వాహనాలకన్నా ఆచరణాత్మకమైన ఒక మంచి మాట జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. The words that enlighten the soul are more precious than Jewels… అంటాడు Vidura.

How to overcome feelings of guilt? అపరాధ భావనను జయించేది ఎలా?

ధృతరాష్ట్ర విదుర సంవాదంలో.. ఓ విదురా! పాండవులు లోలోపల కుములుతున్న నిప్పుకణికల లాంటివారు. నేను వారిని వంచించాను. వారు నా కుమారులను యుద్ధంలో నాశనం చేస్తారనే భయం నన్ను పీడిస్తున్నది. దానితో నా మనసు కళవళపాటు చెందుతున్నది. భయం వల్ల చీకాకు కలుగుతున్నది. మనసు నుండి ఈ ఉద్విగ్నతను, కలతను అధిగమించే విధానం ఏమిటో చెప్పుమని ధృతరాష్ట్రుడు విదురుని అడుగుతున్నాడు. దానికి సమాధానంగా Vidura…

విద్య, తపస్సు, ఇంద్రియ నిగ్రహణము, దురాశను పూర్తిగా విడిచిపెట్టడం వల్ల ఉద్విగ్నత కనుమరుగై మనసుకు శాంతి లభిస్తుంది. అలాగే బుద్ధి బలము చేత భయాన్ని త్రోసివేయాలి. గురుసేవన వల్ల జ్ఞానం కలుగుతుంది. తపస్సు వల్ల యోగము, యోగము చేత శాంతి లభిస్తాయని చెపుతాడు.

ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న ఒక పెద్ద సంస్థలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. వాటి మధ్య అభిప్రాయభేదాలు పెరిగి ఒకరినొకరు మోసం చేసుకునే స్థాయికి చేరాయి. ఆ రెండు వర్గాలలో ఒక వర్గం చేసిన మోసం వల్ల రెండవ వారి అధికారాలకు భగ్నం వాటిల్లింది. ఆ వైషమ్యాల వల్ల సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. దీనిని ఇప్పుడు పరిష్కరించడం ఎలా? ఇది ఆ నాయకుని ముందున్న సమస్య. తనకు నమ్మకస్తుడైన హితైషిని మార్గం చూపమని అడుగుతున్నాడు. అతనన్నాడు….

pandavulu- pandavas

రాజా! ఇరువర్గాలలో ఉన్న నాయకులలో మంచి లక్షణాలు అంతర్గతంగా ఉన్నాయి. ఆ లక్షణాలు సంస్థను ఉన్నత స్థానానికి చేర్చగలవు. కాని ఇప్పుడు చెలరేగిన మనస్పర్ధల వల్ల ఇరువర్గాలు ఒకరిని మరొకరు ద్వేషించుకునే స్థాయికి వచ్చారు. ఏ సంస్థలోనైనా అధికారాన్ని దక్కించుకునేందుకు క్రిందిస్థాయి మేనేజర్లు ఆరాటపడటం సహజమే. నాయకుడు ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలి. కేంద్రానికి నిజానికి అంతర్గత సంఘర్షణలు, వైరుధ్యాలు వెలుగుచూడాలి. ఏ అధికార ఆ అధికార కేంద్రము ప్రత్యేకమే అయినా అన్నీ కలసి ఉమ్మడి లక్ష్యానికై పని చేయడం వల్లనే సంస్థ ఉన్నత ఫలితాలు సాధించగలుగుతుంది.

అన్నింటినీ ప్రాథమిక స్థాయిలో నాయకుడు గుర్తించి కేంద్ర స్థాయిలోనే పరిష్కరించాలి. దానితో సంస్థలోని అన్ని విభాగాల మధ్య సమన్వయంతో కూడిన శాంతి, అభ్యుదయం సాధించడం సాధ్యపడుతుంది. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడే. వారి మధ్య స్పర్ధపల్ల వారి ప్రతిభాపాటవాలు ఉన్నతీకరించబడతాయి. ఆయా విభాగాల అధిపతులు శక్తిసామర్ధ్యాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారి సామర్థ్యానికి తగిన బాధ్యతను అప్పగిస్తే కార్యసాధన సజావుగా జరుగుతుంది. అందరికన్నా ఉత్తమ సామర్ధ్యాన్ని కనబరచిన వారిని ఉత్తరోత్తర నాయకునిగా ప్రకటించడం, మిగిలిన వారికి గౌరవప్రదమైన బాధ్యతలను అప్పగించడం వల్ల సంస్థ ప్రగతిని సాధించగలుగుతుంది.

నాయకత్వం అనేది ఒకరిస్తే వచ్చేది కాదు. తాను తన శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించి సాధించాల్సింది. అర్హతను పెంచుకోని ఆశించాలే కాని ఎవరో అయాచితంగా ఇచ్చే దానికై ఆశపడటం సమంజసం కాదు. ఉచితంగా లభించినది ఏదీ విలువైనదిగా కనిపించదు. అలక్ష్యానికి గురౌతుంది… కొండొకచో అది దుర్వినియోగమౌతుంది. సమస్యల పరిష్కారంలో స్పర్ధవల్ల అంతర్గత సామర్ధ్యం, శ్రేష్టత, ఉత్తమత్వం పరిమితులను దాటి ప్రదర్శితమౌతుంది. అలాంటి ఉత్తమత్వాన్ని నాయకుడు అంగీకరించాలి, ఆమోదించాలి. అభినందించాలి, మెచ్చుకోవాలి, తగిన విధంగా గౌరవించాలి. అప్పుడే విభాగాలన్నీ ప్రేరణ పొంది తమ శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగిస్తూ సంస్థ ప్రగతికి దోహదపడతాయి.

రెండు వర్గాలలోని అధికారులు క్రియాశీలకమైనవారు… పరిణత మనస్కులు, వారు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు సాగితే సంస్థ ఉన్నతీకరించబడి వినియోగదారులు (ప్రజల) అవసరాలను తీరుస్తూ వారికి చేరువవుతుంది. సంస్థ ప్రగతి వల్ల ఉద్యోగుల స్థాయీ అభివృద్ధి చెందుతుంది. ఆనందం అంతటా వ్యాప్తమౌతుంది. సంస్థలో నిరంతర ప్రగతి వల్ల శాంతి వల్ల నాయకునికి లభించే సమయం సాంకేతిక ఉన్నతీకరణకై వెచ్చించడం సాధ్యపడుతుంది. ఉద్యోగులు సరైన మార్గదర్శన పొంది కష్టపడి పనిచేస్తారు, బుద్ధితో ఆలోచించి పని చేస్తారు. దానివల్ల ఆశించిన దానికి మించిన ఫలితాలు సాధించగలుగుతాము.

కాబట్టి.. నాయకుడు ఎల్లప్పుడు అంతర్గత స్పర్ధలకు మూల కారణం ఏమిటో గుర్తించి దాని పరిష్కరణ దిశలో ఏది ఉత్తమమో నిర్ణయించుకోవాలి. చురుకుగా ప్రవర్తించాలి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, సృజనాత్మక విధానాన్ని ఆమోదించాలి. సమయాన్ని ఫలవంతమైనదిగా చేసుకోవాలి.. అప్పుడే సంస్థలో జాత్యంతరీకరణ జరుగుతుంది. జాతి అంటే స్థాయి.

Reasons for bliss పరమానంద కారణాలు:

స్వధీతస్య సుయుద్ధస్య సుకృతస్య చ కర్మణః తపసశ్చ సుతప్తస్య తస్యాన్తో సుఖమేధతే! చక్కగా నేర్చిన చదువు, చక్కగా చేసిన యుద్ధము, చక్కగా చేసిన పని, చక్కగా నిర్వహించిన తపస్సు ఇవి ముగిసిన పిమ్మట మనుషులకు పరమానందాన్నిస్తాయి.

చదువు అక్షరజ్ఞానాన్ని పెంచేది మాత్రమే కాదు, అది సంస్కారాన్నివ్వాలి. ఆలోచనా పరిధిని పెంచాలి. చదువు వల్ల వివేచనా జ్ఞానం పెరగాలి. సత్ అసత్ల మధ్య భేదాన్ని అవగాహన చేసుకునే వికాసాన్ని ఇవ్వాలి. పరిసరాలపై అవగాహన పెంచుకొని పొందిన ప్రాకృతిక స్పందనలను జీవితానికి అన్వయించుకోవడం… ఈ ప్రక్రియలో ఆనందాన్ని పొందడం చదువు యొక్క ప్రాధమిక లక్షణం. అలాంటి చదువును చక్కగా నేర్వడం అంటే… ప్రయోజనాన్ని, ప్రయత్నాన్ని అనుసంధానించడం తద్వారా వికాసాన్ని పొందడమే. యుద్ధము అంటే ధైర్యంతో పరిస్థితులనెదిరించడం… అవగాహన పెంచుకోవడం. యుద్ధము యొక్క లక్ష్యం తాను గెలవడం. అందులో శాంతి ఉంటుందా? గెలవడం అనే దానిని వివిధ రకాలుగా చూడవచ్చు.

యుద్ధం అనేది ఒక సమస్య.. దానిలో నీవు గెలుస్తావు… ఆవలి పక్షం ఓడుతుంది. లేదా నీవు ఓడి ఆవలి పక్షం గెలవనూవచ్చు. దీని వల్ల సమస్య పరిష్కారం అవుతుందా అంటే అనుమానమే. గెలిచిన వాడు గెలుపును సుస్థిరం చేసుకోవాలని చూస్తుంటాడు, ఓడినవాడు గెలిచేందుకు అవకాశం కోసం చూస్తుంటాడు. దానితో ఇరువురిలోనూ మనశ్శాంతి కరువవుతుంది. అలాకాక సమస్యకు రెండే పరిష్కారాలున్నాయనే భావన నుండి మరిన్ని ప్రత్యామ్నాయాలను ఆలోచించడం వల్ల ఆలోచనా పరిధి విస్తృతమౌతుంది. అందరికీ ఆమోదయోగ్యమైన విధానమూ ఆవిష్కృతమౌతుంది.

దీనికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తే ఎదుటి వారితో సంధి చేసుకోవచ్చు. అయితే మనమే సంధిని కోరితే ఎదుటివారు బలవంతులైనా, బలహీనులైనా మనలను తక్కువ చేసి చూసే అవకాశమూ ఉన్నది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇరువురు గెలిచే విధానాన్ని ఆలోచించవచ్చు. దానినే విజయం అందాము. ఈ విజయం వల్ల ఈ ఇరువురే కాకుండా వీరితో సంబంధం ఉన్న అందరికీ మేలు జరుగుతుంది. యుద్ధం ద్వారా అందరినీ విభజించడం కన్నా సంధి వల్ల కలపడం ప్రయోజనకారి. దాని వల్ల సమాజమూ బలోపేతమౌతుంది.

యుద్ధం వల్ల ఒకరికి గెలుపు మరొకరికి ఓటమి కలుగుతుంది. గెలుపు మరొకరిపై ఆధిపత్యాన్ని సాధించే మనస్తత్వాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదది అధికారం, స్థాయిభేదం మొదలైన వాటికి ప్రతీకగా నిలుస్తుంది. అలాకాక ఇరువురూ గెలిచే మార్గాన్ని అన్వేషించగలిగితే… శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. ఒకరి విజయం మరొకరికి ఓటమి కాకూడదన్న ఆలోచనయే ఉత్తమోత్తమం.

రాజా! ఈ దృక్పథాన్ని సాధించడానికి ఇంకా ఎన్నో అవకాశాలు మన ముందున్నాయి.. ఆలోచించు, అంటున్నాడు విదురుడు. మీరు (కౌరవులు) గెలిస్తే పాండవులు; పాండవులు గెలిస్తే మీరు ఓడినట్లే. అంటే ఒక పక్షం మరొక పక్షంపై అధికారాన్ని సాధించడమే. ఈ పద్ధతిలో నాయకుడు తన మార్గంలో నడుస్తాడు… ఒక రైలు ఇంజను వెంట భోగీలు నడిచినట్లుగా ఇతరులు తన మార్గంలో నడవాలని భావిస్తాడు. ఈ దృక్పథం ఉన్నవారు, తన అధికారాన్ని, పదవిని, అర్హతలను, బలాబలాలను, పరిచయాలను ఒకటేమిటి అన్నింటినీ తమ గెలుపుకై వాడుకుంటారు. చాలా మందిలో ఇది పుట్టుకతో వస్తుంది లేదా ఇంటి వాతావరణం అలాంటి మనస్తత్వాన్ని కలిగిస్తుంది.

సాధారణంగా తల్లి దండ్రులు తమ పిల్లలలో ఒకరిని మరొకరితో పోల్చడం వల్ల ఈ దృక్పథం పిల్లలలో వారికి తెలియకుండానే అలవడుతుంది.. ఇరువురిలో ఒకరికి ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడంలో ఉండే చురుకుదనం మరొకరికి లేకపోవచ్చు…. అలాగే మరొకరికి ముందు వారికన్న మరొక అంశంపై అవగాహన హెచ్చుగా ఉండవచ్చు… తెలిసీ తెలియక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజమూ చేసే ఈ పోలికల వల్ల ఆ స్వభావం బలపడితే అది దుష్పరిణామాలకూ దారితీయవచ్చు. ఆటల పోటీలలో, న్యాయస్థానంలోని వ్యాజ్యాలలో.. ఒకరు గెలిచి మరొకరు ఓడడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్య పోటీతత్త్వం ఆత్మవిశ్వాస లేమితో లేదా ఎదుటివారిపై నమ్మకం లేకపోవడం వల్ల కలుగుతుంది. తాము గెలిచి మరొకరు ఓడాలనే స్వభావాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన పోటీతత్త్వం వల్ల ఎదుటివారిని అవగాహన చేసుకోవడం, వారికన్నా సామర్ధ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం సాధ్యపడుతుంది.

దీనిలో నుండి ఆవిష్కృతమయ్యేదే ఓటమి/గెలుపు. ఒకరు గెలిస్తే మరొకరి ఓటమి లేదా ఒకరి ఓటమి మరొకరి గెలుపు. అందరినీ మెప్పించాలని చూస్తూ త్యాగం చేస్తున్నామనే భావనతో ఓటమిని ఆహ్వానించడం… ఓటమి/ గెలుపు. ఇది ఎదుటివారిలో అహంకారాన్ని నింపవచ్చు. తమ స్వంత అభిప్రాయాలను ప్రకటించే ధైర్యం కూడా లేని బలహీనత, తపన ఈ దృక్పథానికి మూలం. నాయకునిలో ఈ దృక్పథం సంస్థను ఇలాంటి వారు జీవితంలో పిరికివారుగా మిగిలిపోతారు. మంచివారనిపించుకోవాలనే రాజ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. దానిపై ఆధారపడిన వారిని నిరాధారులను చేస్తుంది. వీరిలో అత్యధికులు గెలవాలని వారి మనసులలో ఉన్నా తమలోని భావాలను అణిచివేసుకొని పరిస్థితులకు తలొగ్గి ఓటమిని ఆహ్వానిస్తారు. అయితే వారిలోని అవ్యక్త భావనలు పూర్తిగా సమసిపోని కారణంగా మరొక వికృతరూపంలో వెలుగుచూస్తాయి. అలాంటి వారిలో పెరిగే ఒత్తిడి కారణంగా మానసిక సమతుల్యత దెబ్బతినడం, శారీరక రుగ్మతలు బయటపడటం జరుగుతుంది.

కొన్ని సమయాలలో ఇరుపక్షాలూ పట్టుదలలకు పోయి ఓటమి/ఓటమిని కొనితెచ్చుకుంటారు. దీనివల్ల ఇరుపక్షాలూ నష్టపోతాయి. ఓడిన వారు ఓడుతారు…. అవశేషంగా మిగిలి, అన్ని విధాలుగా నష్టపోయి గెలిచిన వారి గెలుపూ నిరర్ధకమౌతుంది. కొన్ని సమయాలలో కొందరు ఇతరుల ప్రమేయం లేనంతవరకు తమ మార్గంలో అభ్యుదయ మార్గంలో పయనించి గెలుస్తారు. ఇదొక మార్గం.. దీని వల్ల ఎవరికీ నష్టం లేదు. విషయ ప్రాధాన్యతను అనుసరించి ఇందులో ఏ మార్గాన్ని అనుసరించినా అది మన బలహీనత ప్రాతిపదికగా జరగకూడదు. గెలవడం ప్రాధాన్యం కానప్పుడు, ఎదుటివారు ఆత్మీయులైనప్పుడు, వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరం ఉన్నప్పుడు, మనం తగ్గి ఎదుటివారిని గెలిపించడం కూడా ఉత్తమమైన మార్గమే. కాని అది అలవాటుగా మారడం ప్రమాదకరం.

ఇందులో ఏది ఉత్తమమైనది అంటే అది ఆయా పరిస్థితుల వాస్తవికతపై ఆధారపడి ఉంటుంది. ఆ పరిస్థితులను అవగాహన చేసుకోవడం తగిన విధంగా వర్తించడం ముఖ్యం గాని, అన్ని సమయాలలో ఒకే విధానాన్ని అవలంభించడం సరికాదు. అన్యాయం, అధర్మం కలసి దాడిచేసిన సమయంలో చేతులు ముడుచుకు కూర్చోవడం అసమర్ధత, చేతకానితనం అవుతుందే కాని మన త్యాగానికి చిహ్నం కానేరదు. ఉన్నత వ్యక్తిత్వం, సమయానుకూలంగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంది. కొన్నిమార్లు మన తాత్కాలిక ఓటమి దీర్ఘకాలిక గెలుపుకు, తాత్కాలిక గెలుపు దీర్ఘకాలిక ఓటమికి నాంది పలకవచ్చు.

తనపై తనకు స్పృహతో కూడిన అవగాహన, దూరదృష్టిని పెంచే ఊహాశక్తి, బలమైన కోరిక… ఇవి మనస్సాక్షితో కలసిన వేళ వ్యక్తిత్వం పరిణతి చెందుతుంది. ఆ వ్యక్తిలోని ఆలోచనలు ఆచరణాత్మకమైన వేళ.. విజయసాధన… శాంతిస్థాపన సులువవుతుంది. నిజానికి పరస్పరాధారిత దృక్పథానికి నాయకునిలోని శీలనిర్మాణమే ప్రాతిపదిక. శీలనిర్మాణంలో నిజాయితీ, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, పరిణతి, సహనం, సహానుభూతి, ఆత్మవిశ్వాసం లాంటివి ప్రధాన భూమికలు.. ఇవన్నీ కలిస్తేనే పరస్పరాధారిత సమాజమనే స్వప్నం సాకారమౌతుంది. ఇందులో మానవ సంబంధాలు అత్యంత కీలకమైనవి. 

అలాగే ఇతరులతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించడం, వాటిని త్రికరణశుద్ధిగా అమలుచేయడం ముఖ్యమైనది… ఆదరణీయమైనది. ఆ కార్యాచరణలో సంబంధిత వ్యక్తులనూ, వ్యవస్థలను అన్నింటినీ భాగస్వాములను చేయడం ద్వారా మానవ వనరులనూ, వారి ప్రతిభావ్యుత్పత్తులను సమర్ధవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కార్యసాధనలో సమ్మిళితశక్తి అత్యంత ప్రభావవంతమైనది. పరస్పరాధారిత ఆలోచనా విధానం, సహకారతత్త్వం వల్ల అద్భుత ఫలితాలు సాధించడం సాధ్యమౌతుంది. వ్యవస్థలోని సభ్యులందరికీ అర్హతల ప్రాతిపదికగా బాధ్యతలను అప్పగించడం ద్వారా… విజయం లభిస్తుంది. ఆ ఫలితాన్ని అందరికీ పంచడం ద్వారా ఆ విజయం సుస్థిరమౌతుంది.

మంచివారిని చెడువ్యవస్థలో పెడితే లేదా మంచివారు ఏ ప్రలోభాలకో లొంగిపోయి చెడువ్యవస్థలో అడుగుపెడితే చెడు ఫలితాలు వస్తాయి. నాయకుడు, తన అనుయాయులలో ఫలితాలను, ఫలితాలను సాధించే శక్తిని ప్రభావవంతంగా రూపుదిద్దుకునే విధంగా ప్రేరణనివ్వాలి… సరైన అవకాశాలనూ ఇవ్వాలి. పలు సమస్యలు ఒకేసారి పలకరించిన వేళ ఏది ముఖ్యమైనదో తెలుసుకోవడం, రాబోయే ఫలితాలను ఊహించడం, సరిగా వాటిని అంచనా వేయడం… ఆ సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయాలను వెదకడం వల్ల పరిష్కారం సులువవుతుంది. సమస్యను ఎదుటివారి కోణం నుండి చూడటం, అవతలి వారి భావోద్వేగాలను అవగాహన చేసుకొని గౌరవించడం… ఎదుటివారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.

చేసే పనిలో పరిణతి కనిపించాలి. ప్రత్యేకత కనిపించాలి. యాంత్రికమైన పని విధానం వల్ల ఫలితాలూ యాంత్రికంగానే ఉంటాయి. ముగ్గురు వ్యక్తులు ఒక ఆలయాన్ని కడుతున్నారు. అక్కడి నుండి వెళుతున్న బాటసారి ఆగి “నీవేం చేస్తున్నావని” ఒకరిని అడిగాడు. అతడు కోపంగా కనిపించడం లేదా ఇంత ఎండలో భార్యాపిల్లల పోషణకై శ్రమిస్తున్నానన్నాడు. మరొకరిని ఇదే ప్రశ్న వేసాడతడు. అతనన్నాడు… నేను తీసుకుంటున్న డబ్బుకు అప్పగించిన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానన్నాడు. మూడవవాడిని అదే ప్రశ్న అడిగాడు… ఒక గొప్ప భగవదాలయం నిర్మిస్తున్న కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. నా వంతు సేవ చేస్తున్నానన్నాడతడు. అదీ వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే ఆలోచనా విధానం. అదొక భాగ్యంగా భావిస్తూ పనిని భగవదారాధనగా భావించే వారికి ఫలితమూ ఉంటుంది.. సంతృప్తి ఉంటుంది. దానినే తపస్సుగా భావించి ఆచరిస్తే లభించేది పరమానందమే…

రాజా! పాండవులకు, కౌరవులకు నీవే ఆధారమైనవాడివి. సమస్య లోతులను తెలిసినవాడివి. ఆలోచించు… అంటాడు విదురుడు.

మిగితాది పార్ట్ 10 లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *