The Ram-Laxamn: Ramayana in 10 Minutes
Ram-Laxamn: ఇక్ష్వాకుల వంశీకుడైన దశరథ మహారాజు కోసల దేశానికి అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలించు చుండెను. అతనికి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎంత కాలం గడిచినా సంతానం కలుగని దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ అగ్ని కుండం నుండి ఒక దివ్య పురుషుడు పాయసంతో నిండి ఉన్న ఒక కలశాన్ని దశరథునికి ఇచ్చి ఆ పాయసాన్ని భార్యలు సేవిస్తే పుత్ర సంతానం కల్గుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు.
ఆ పాయసాన్ని సేవించిన ముగ్గురు భార్యలు గర్భవతులై కౌసల్యకు Sri Ramudu, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శతృఘ్నులు జన్మించారు. వారు అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారయి గురువు వద్ద విద్యలు నేర్చుకుంటున్నారు. కుమారులంటే దశరథునికెంతో ప్రేమ. శ్రీరాముడంటే ప్రాణం. రామున్ని చూడకుండ దశరథుడు క్షణం కూడ ఉండలేరు.
ఒకనాడు దశరథుని వద్దకు విశ్వామిత్రుడనే ముని వచ్చి “మహారాజా! నేనొక యాగం చేయుచున్నాను. దాన్ని మారీచుడు, సుబాహుడు అను రాక్షసులు ఆ యాగాన్ని పాడు చేయుచున్నారు. యాగరక్షణార్థం Sri Ram న్ని నావెంట పంపు” అన్నాడు విశ్వామిత్రుడు. “మునీంద్రా! రాముడు పన్నెండేండ్ల బాలుడు. విద్యకూడ పూర్తి కాలేదు. మీ యాగ రక్షణకు నేనే వస్తాను మహర్షి”. అన్నాడు దశరథుడు. రామున్నె పంపాలని పట్టుపట్టాడు. విశ్వామిత్రుడు.
కులగురువైన వసిష్ట మహర్షి విశ్వామిత్రుని కోపాన్ని గ్రహించి, దశరథునికి నచ్చజెప్పి రామున్ని పంపిస్తే మేలు జరుగుతుందని నచ్చ చెప్పాడు. విధి లేక దశరథుడు రామునికి తోడుగా Laxman ని కూడ ముని వెంట పంపడానికి అంగీకరించారు. రామలక్ష్మణులు విల్లంబులు చేత పట్టి విశ్వామిత్రుని వెంట వెళ్ళారు. రామలక్ష్మణు లు విశ్వామిత్రుని వెంట వెడుతుండగా తాటకి అనే రాక్షసి అడ్డుపడింది. వెంటనే శ్రీరాముడు బాణం ఎక్కుపెట్టి సంధించి తాటకిని వధించాడు.
Ram-Laxamn లకు విశ్వామిత్రుడు దివ్య మంత్రాలను ఎన్నో ఉపదేశించాడు. విశ్వామిత్రుడు యాగము ప్రారంభించారు. రామలక్ష్మణులు యాగ భూమి వద్ద కాపలా ఉన్నారు. ఆకాశం నుండి మారీచుడు, సుబాహుడు తమ రాక్షస పరివారంతో యజ్ఞం పాడు చేయుటకు రక్తమాంసాలు కుమ్మరిస్తూ యాగం పాడు చేయడానికి ప్రయత్నించారు. రామలక్ష్మణులు వారి ఆటలను సాగనీయక బాణం సంధించి మారీచుణ్ణి కొట్టాడు.
ఆ ధాటికి ఆగలేక మారీచుడు వెయ్యి ఆమడల దూరంలో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఇంకో బాణంతో సుబాహుణ్ని రాక్షస పరివారాన్నంతటిని చంపివేశాడు. యజ్ఞము ఏ విఘ్నము లేకుండా. జరిగినది. అక్కడ నుండి బయలుదేరి విశ్వామిత్రుడు Ram-Laxamn లతో మిధిలా నగరమునకు ప్రయాణమయ్యాడు. దారిలో గౌతముని భార్య అహల్య శాపమున పాషాణమై పడి ఉండగా రాముని పాదం సోకి ఆమె శాపవిముక్తి పొందినది.
మిథిలా నగర రాజైన జనక మహారాజుయాగం చేయడానికి భూమిని దున్నుచుండగా నాగలి చాలులో ఒక బంగారు పెబై దొరికింది. దానిని తెరిచి చూడగా చంద్రబింబంలా వెలిగిపోతున పాప కనబడినది. సంతానం లేని జనక మహారాజు ఆ పాపకు సీతా అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచారు. యుక్త వయస్సు వచ్చిన సీతకు కళ్యాణం చేయ నిశ్చయించుకున్నాడు.
కాని తగిన వరుడు లభించలేదు. జనకుని ఇంటిలో గొప్ప శివ ధనస్సు ఉన్నది. దాన్ని ఎత్తి ఎక్కు పెట్టిన వీరునికి తన కుమార్తె సీతను “మేష్టి ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించి స్వయంవరం ఏర్పాటు చేశాడు. విశ్వామిత్రుడు Ram-Laxamn లతో మిధిలా నగరమునకు – ఆ చేరుకున్నారు. Ram-Laxamn ల గురించి జనకునికి తెలిపినాడు. చెప్పి జనక మహారాజు సంతసించి సీతకు తగిన వరుడు రాముడేనని ద్గురు గ్రహించి శివధనస్సును సభామంటపమునకు తెప్పించారు.
అంతట Sri Ramudu విశ్వామిత్రునకు నమస్కరించి, ఆజ్ఞను పొంది, సభాపతు లందరూ ఆశ్చర్యపోయేలా శ్రీరాముడు శివధ నస్సును ఎక్కు పెట్టి పెళ్ళున విరిచాడు. జనకుడు ఆనందభరితుడై సీత ను రామునకిచ్చి కళ్యాణం చేస్తున్నట్టు ప్రకటించాడు. జనకుని సోదరుని కుమార్తెలతో లక్ష్మణునకు ఊర్మిళను, భరతునకు మాండవిని, శతృఘ్నుడికి శుతకీర్తిని ఇచ్చి వివాహం జరిపించారు.
ఆ విధంగా సీతారామ కళ్యాణం అతి వైభవంగా జరిగినది. ఆనందంతో అందరూ మిధిల నుండి అయోధ్యకు బయలు దేరి వెళ్ళారు. Sri Ramudi కి పట్టాభిషేకం చేయతలపెట్టి ముహూర్తం నిశ్చయించాడు దశరథుడు.
దశరథుని ముద్దుల భార్య కైకేయి తన చెలికత్తె మంధర మాయ మాటలకు లోనై పట్టాభిషేకం చెడగొట్ట తలపెట్టింది. పూర్వం శంబరాసుడితో యుద్ధం సంభవించి నప్పుడు కైకేయి సహాయపడింది. అందుకు దశరథుడు కైకేయికి రెండు వరాలు కోరుకొమన్నాడు. అప్పుడామె అడుగలేదు. ఇప్పుడు అవి దశరథునికి గుర్తు చేసి ఒకటి రాముణ్ని పదునాల్గు సంవత్స రాలు అడవులకు, రెండొవది తన కుమారుడైన భరతునకు పట్టాభిషేకం చేయమని కోరింది. ఆ మాటలు విన్న దశరథుడు కృంగి మూర్ఛపోయాడు. అంతటి శ్రీరాముడు తల్లి మాటకు అడ్డు చెప్పక, రాజ లాంఛనాలను విడనాడి, నారదుస్తులు ధరించి లక్ష్మణుడు వెంటరాగా సీతాదేవితో అరణ్యవాసం బయలుదేరాడు.
గోదావరి తీరాన పంచవటి చేరుకొని అక్కడ పర్ణశాల కుల కణుని చెల్లెలు శూర్పణఖ శ్రీరాము ని చూచి తన్మయత్వంతో పేరు గుంచుకొని జీవన గడుపసాగారు. కొంత కాలం తరువాత దారిలో ఉండు – సీతను పెళ్ళాడమని కోరింది. నాకు భార్య ఉన్నదని లక్ష్మణుని దగ్గరకు వేశారు వెళ్ళమని చెప్పాడు. అంతట లక్ష్మణుడు దానికి బుద్ధి చెప్పాలని మన్న ముక్కు చెవులు కోసి వేశాడు. శూర్పణఖ ఏడుస్తూ తన అన్న నాడు రావణుని దగ్గరకు వెళ్ళి సీత అందం గురించి వివరంగా చెప్పి డేనని “నీ చెల్లికి జరిగిన పరాభవానికి ఆమెను చెరపట్టి నీ చెల్లెలు వారు మనస్సు శాంతింపచేయి” అని మొరపెట్టుకున్నది శూర్పణఖ.
రావణుడు మారీచుని సహాయంతో సీతను అపహరించి లంకలోని అశోక ఉద్యానవనంలో పెట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ, బయలుదేరారు. పక్షిరాజైన జటాయువు ద్వారా సీతజాడ తెలుసుకొని లంకాపురి వైపు నడక సాగించారు. అంతట భక్తురాలైన శబరి ఆతిధ్యం స్వీకరించి ఆమెకు మోక్షం ప్రసాదించాడు. ఋష్యమూక పర్వతం చేరి రాజైన సుగ్రీవున్ని, అతని మంత్రి అయిన ఆంజనేయున్ని కలిసి జరిగిన విషయం తెలియజేసారు Ram-Laxamn లు.
వాలి తనను ఏ విధంగా రాజ్యభ్రష్టుడ్ని చేసినది తెలియ జేశాడు Ram-Laxamn లకు సుగ్రీవుడు. వాలిని చంపి కిష్కింధకు సీతను వెతకడంలో సహాయపడతానని శ్రీరామునికి రాజును చేస్తానని సుగ్రీవునికి మాట ఇచ్చాడు శ్రీరాముడు. ఆ విధంగానే మాట ఇచ్చాడు సుగ్రీవుడు. తరువాత వాలి సుగ్రీవులు ఘోరంగా యుద్ధం జరుగు చుండగా శ్రీరాముడు బాణముతో వాలిని సీతజాడకోసం వానరులను నలుమూలల పంపాడు సుగ్రీవుడు. వధించాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజయినాడు. పిదప జాంబవంతుడు, హనుమంతుడు దక్షిణ దిక్కుగా బయలు దేరారు. హనుమంతుడు కార్యం సాధిస్తాడని శ్రీరామునకు నమ్మకం కుదిరి తన చేతి ఉంగరం ఆనవాలుగా తన చేతి ఉంగరం ఇచ్చి పంపాడు.
జటాయువు అన్న అయిన పక్షరాజు ద్వార సీత లంకలో చెరబట్టి ఉన్నదని తెలుసుకొని దక్షిణ సముద్రం చేరుకున్నాడు. ఆంజనేయుడు. సముద్రం దాటి లంకా పట్టణం చేరుకొని, లంకిణి గర్వమణచి లంకలో ప్రవేశించాడు హనుమంతుడు. సీతకోసం లంక మొత్తం వెతికి చివరకు అశోక వనం చేరాడు. అశోకవనంలో రాక్షస కాంతల మధ్య శోకిస్తున్న సీత కనిపించింది. రాముడు చెప్పిన వివరాలు అన్ని ఆమెలో కనబడినవి తను తెచ్చి ఉంగరంను సీతకు అందించి శ్రీరాముని గురించి వివరములు తెలియజేశారు. అశోక ‘వనాన్ని పాడు చేసి లంకా దహనం గావించి కిష్కింలో ఉన్న శ్రీరామ చంద్రుడ్ని చేరు కున్నాడు హనుమంతుడు.
సుగ్రీవుని నాయకత్వాన Ram-Laxamn లు, లెక్కలేనంత వానరసైన్యాన్ని సమకూర్చుకొని సముద్ర తీరాన్ని చేరుకున్నారు. శ్రీ శ్రీరాముడు వానరుల సహాయంతో సముద్రంపై వారధి నిర్మించి, సముద్రం దాటి లంకలో ప్రవేశించారు అందరు. వానరవీరులకు రాక్షసులకు యుద్ధం ప్రారంభమైనవి. రాక్షస సైన్యం కుప్పలుగా నేలకూలారు. రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. శ్రీరాముడు బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించి రావణుని నేల కూల్చి తను చెరనుండి విడిపించాడు.
ఆ విధంగా రాముని 14 సంవత్సరముల వనవాస దీక్ష పూర్తి అయినది. సీతా సమేతంగా అయోధ్యకు వచ్చాడు శ్రీరామచంద్రుడు. అయోధ్య ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఆ విధంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగినది. రామరాజ్యం సుఖసంతోషాలతో వర్ధిల్లినది.
2 thoughts on “ The Ram-Laxamn: Ramayana in 10 Minutes”