Discover Assam: A Complete Travel Guide to India’s Hidden Paradise
Assam ను అన్వేషించండి: భారతదేశపు దాగి ఉన్న స్వర్గధామానికి సంపూర్ణ ప్రయాణ గైడ్: అస్సాం – భారతదేశం యొక్క ఉత్తర-తూర్పు భాగంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన స్వర్గధామం. ఇది ప్రకృతి రమణీయత, సంస్కృతి సంప్రదాయాలు, మరియు అనేక దైవిక స్థలాలతో ఒక గొప్ప గమ్యంగా మారింది. గార్గి జలపాతాల నుండి బ్రహ్మపుత్రా నది తీరాల వరకూ, టి తోటల కొద్దీ, ఆసామ్ అనేది ప్రతి పర్యాటకుడికి ఒక ప్రత్యేక అనుభవం అందిస్తుంది.
ఈ ప్రయాణ గైడ్లో, మీరు ఆసామ్లో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు, విశేష ఆహారం, సాంస్కృతిక వారసత్వం మరియు చారిత్రిక వైభవం గురించి తెలుసుకుంటారు. ప్రతి అడుగు, ప్రతి నదీ తీర, ప్రతి అడవి భాగం అసలైన ఆసామ్ను అన్వేషించే ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.
ఈ గైడ్ మీకు అసలు ఆసామ్ను అనుభవించే పథాన్ని చూపిస్తుంది, ఈ అద్భుతమైన ప్రదేశం యొక్క ప్రకృతి, సంస్కృతి మరియు ఆధ్యాత్మిక విలువలను మీ జీవితంలో ఎప్పటికీ మిగుల్చేలా. మీరు ఈ ప్రత్యేక రాష్ట్రంలో చేసిన ప్రతి ప్రయాణం కొత్త జ్ఞాపకాలను సృష్టిస్తుంది
Assam రాష్ట్ర వైశాల్యం 78 వేల 430 చ.కి.మీ. వుంటుంది. ఈ రాష్ట్ర రాజధాని గౌహతి, ఈ రాష్ట్రానికి తూర్పున నాగాలాండ్ పశ్చిమాన వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ దక్షిణంలో త్రిపుర, మిజోరం, మణిపూర్, ఉత్తరం అరుణాచలప్రదేశ్ మరియు భూటాన్ సరిహద్దు లుగా వున్నాయి. ప్రజలు Assam, బంగ్లా భాషల్ని మాట్లాడతారు.
గౌహతి, తేజాపూర్, జోర్పాట్, డిబ్రూవర్, లక్ష్మీపూర్, సిల్చార్లు విమానాశ్రయాలు యాంధ్రో పొలాజికల్ మ్యూజియం, యూనివర్సిటీ, అస్సాం రాష్ట్ర మ్యూజియం. అస్సాం ఫారెస్ట్ మ్యూజియం అస్సాం కుటీర పరిశ్రమల మ్యూజియంలు వున్నాయి. కామాఖ్య గుడి, తాంత్రిక పూజకు ప్రధాన కేంద్రం, ఉమానంద గుడి. శివరాత్రి పండుగకు ప్రసిద్ధి చెందింది.

హజో:ఇది హిందూ, ముస్లిం, బౌద్ధులకు పుణ్యక్షేత్రం. ఇక్కడ అనేక రకాల గుళ్ళు, మసీదులు, బుద్ధచైత్యాలు వున్నాయి. Assam అన్నపదం అసోమా అన్న సంస్కృత పదం నుంచి వచ్చింది. ఇది హిమాలయ పర్వతపాదాల వద్ద నీలికొండలతోను ఎర్రటి నదులతోను నిండి వుంటుంది. ఇక్కడ తేయాకు తోటలు వైల్డ్ లైఫ్ రిజర్వేషన్లు వున్నాయి. ఇక్కడ రెన్కొరోస్క్, రక్షిత ప్రాంతం. ఒకటి పనిచేస్తోంది. ఇక్కడ యాక్టిస్టిక్, మంగూలియన్ ద్రవిడియన్, ఆర్యన్లు ఐకమత్యంగా వుంటున్నారు. Guwahatiకి ప్రాచీన నామం ప్రాగ్జోతిషపురం. దీన్ని నరకాసురుడు నిర్మించినట్లు పురాణాలలో చెప్పారు. అతని కొడుకు భగత్ దత్తుడు పెద్దజగ సేనతో కౌరవుల తరపున పోరాడి మరనించినట్లు మహాభారతం చెపుతుంది.
స్థానిక శిలాశాసనాల్లో హ్యూనా త్సాంగ్ అనే చైనా యాత్రికుడు క్రీ.శ. 783లో ఇక్కడి చక్రవర్తి కుమార భాస్కర వర్మ ఆహ్వనం పై వచ్చినట్లు వుంది. అహోములుల 13వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి వచ్చినపుడు అస్సాం చరిత్రనే మార్చి వేసారు. Karsarichutiamoran రాజులను ఓడించి దాదాపు ఆరు శతాబ్దాలపాటు పరిపాలన చేశారు. 1826 లో బ్రిటీష్ వారు burmians తో ఎన్నో యుద్ధాలు చేసి వారిని ఓడించారు. వేరే ప్రాంతాన్ని వదిలి వెల్ళిపోయారు. 1874లో Assamను ప్రత్యేక రాష్ట్రం చేసి దానికి ఒక ప్రధాన కమిషనర్ ను నియమించారు.
Guwahati Travel Guide: Unique Experiences by the Banks of the Brahmaputra గౌహతి ప్రయాణ గైడ్: బ్రహ్మపుత్రా తీరాన విశేష అనుభవాలు:
గౌహతి: ప్రకృతి అందాలతో, పురాతన దేవాలయాలతో, సంపన్న సంస్కృతితో కప్పబడి ఉన్న నగరం గౌహతి. ఆసామ్ రాష్ట్రానికి గుండె వలె పనిచేసే ఈ నగరం, బ్రహ్మపుత్రా నది తీరాన విశాలంగా విస్తరించి ఉంది. ఇది తూర్పు భారతదేశపు ముఖ్యమైన గేట్వేగా మాత్రమే కాకుండా, ఆధ్యాత్మికత, చరిత్ర, ఆధునికతకి అద్భుతమైన మేళవింపు.
ఈ ప్రయాణ గైడ్లో, మీరు గౌహతిలో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు, రుచికరమైన స్థానిక ఆహారం, స్థానిక కళలు మరియు సాంస్కృతిక అనుభవాలపై పూర్తి సమాచారం పొందుతారు. బ్రహ్మపుత్రా నది తీరాన పడే సాయంకాల సుందర దృశ్యాలు నుంచి, కమాఖ్యా దేవాలయం వంటి పవిత్ర స్థలాలు వరకు – ప్రతి కోణం మీ హృదయంలో నిలిచిపోతుంది.
భారతదేశపు పూర్వోత్తర భాగంలో హిమాలయాలకు దిగువన విస్తరించిన పచ్చని పైరు భూముల అందాల రాష్ట్రం Assam..! ఈ రాష్ట్రానికి రాజధాని గౌహతి ! ఈ నగరాన్ని అస్సాం కు సింహద్వారంగా పరిగణిస్తున్నారు. వ్యాయంగా అయితే యిది తూర్పు భారతదేశానికి సింహద్వారం అనుకోవాలి.
పౌరాణిక ఆధారాల ననుసరించి Guwahati ప్రాగ్జ్యోతిషపురం’ గా చెప్పబడుతోంది. స్థానిక నవగ్రహ మందిరం అందుకని ద్రష్టత్ష్తరంగా మిగిలివుంది. అది కాకుండా ఈ ప్రాంతాన్ని దర్శించిన ప్రఖ్యాత చైనా యాత్రికుడు హ్యూనా త్సాంగ్ ఈస్టరన్ సిటీ ఆఫ్ ఆస్ట్రాలజీ’ వర్ణించాడు.
ఇహ యితర చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ.శ. 1228 లో బర్మానుంచి అహోంసు అనబడే ఓ గిరిజన సంతతి యిక్కడికి వలస వచ్చింది. వారంతా హిందూ మతస్థులుగానే పరిగణించబడ్డారు. ఈ ‘అహోంసు తెగ మూలంగానే ఈ రాష్ట్రానికి అస్సాం అనే పేరు స్థిరపడిపోయింది. కొన్నేళ్ళ క్రితం వరకూ తూర్పు భారతదేశాన్నంతా ‘Assam‘ అనే నిలిచేవారు. కాని భాషా రాష్ట్ర జన పరంపరలో ఈ నేల ఏడు ముక్కలుగా విభజించబడిపోయింది. అరుణాచలప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరంలు అలా ఏర్పడిన రాష్ట్రాలుగా మనం చూస్తున్నాం.
Guwahati నగరం దేశంలోని అతి పెద్ద నదుల్లో ఒకటయిన బ్రహ్మపుత్రా నదీతీరంలో నెలకొని వుంది. హిమాలయాల్లో నుంచి దూకుతూ శరవేగంతో పయనం సాగిస్తూ పరవళ్ళు త్రొక్క ఈ నవే గర్భంలో ప్రతిరోజూ కనిపించే సూర్యామయం దృశ్యం మరుపురాని ఓ కమనీయ అనుభూతిని కలిగిస్తుంది. పౌరాణిక ప్రతిష్టం కలిగిన అనేక ప్రాంతాలు Guwahatiలో వున్నాయి.
అందులో ‘ నీలాచలం కొండపైన నెలకొని వున్న కామాఖ్య దేవాలయం అతి ముఖ్యమయింది. గౌహతి నగరానికి పది కిలోమీటర్ల దూరాన నదీతీరానున్న ఈ గొప్ప తీర్థస్థానానికి విచిత్రమైన పురాణ
నిర్జీవి అయిన తన ప్రథమ సతి శరీరాన్ని శివుడు ఆకాశమార్గాన తీసుకువెడుతుండగా ఆమె మర్యాదయం యిక్కడ రాలిపోయిందట …….ఆ యోని రాలినా చోటూనే విశ్వకర్మ చేత దేవాలయం నిర్మించబడిందట. ఆ చోటూ తాంత్రిక సిద్ధులూ, యోగులూ, ఈ క్షేత్రాన్ని అధిక సంఖ్యలో దర్శిస్తూ వుంటారు. ఈ మందిరాన్ని శక్తి స్థలంగా పిలుస్తరించటం కూడా జరుగుతోంది. ప్రతి ఏటా యిక్కడ అంబుచి ‘ అనబడే ఉత్సవాన్ని ‘ ఆగష్ట్ ‘ మాసంలో నిర్వహిస్తూ వుంటారు. ఆ సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల నుండి జనం ఇక్కడికి తరలి రావటం జరుగుతోంది.
కామాఖ్య దేవాలయంలోకి వెళ్ళే ముందు భక్తులంతా బయట వున్న పుష్కరిణిలో స్నానాలు చేస్తారు. దేవి మందిరం వున్న ఈ కొండ పైకి చకని రోడ్డు మార్గం వుంది. కొండపై నుంచి చూస్తే గౌహతీ నగరం ఎప్పుడూ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అదే సూర్యాసమయం సమయంలో అయితే ఈ దృశ్యాన్ని చూసి తరించిన వాళ్ళం అవుతాము. విదేశీయుల దండయాత్రల కాలంలో ఈ దేవాలయం అనేక ధ్వంసం అయిపోయింది. అయితే ప్రతిసారీ కూడా పునర్నిర్మింపబడుతూనే వుంది. అలా జరగటం భక్తుల భక్తి శ్రద్ధలకి నిదర్శనంగా చెప్పుకోవాలి.
నీలాచలం కొండపైనే భువనేశ్వరీ దేవాలయం కూడా వుంది. శక్తి నవరూపాల్లో ఒకటయిన ఓ దేవీ మందిరంగా దీన్ని పరిగణించటం జరుగుతోంది. ఈ దేవాలయంలో ‘ శక్తి ఉదరం’ భద్ర పరచబడిందని స్థానికుల నమ్మకం. గౌహతీ నగరాన్ని ఎపుడయినా సందర్శించవచ్చు! ఈ పట్టణానికి నేరుగా రోడ్డు, రైలు వాయుమార్గాల సౌకర్యం వుంది తూర్పు భారత రాష్ట్రాల యాత్రకి తొలి అనుబంధయానంగా మనం గౌహతీని చేరుకోవాలి. వాతావరణం శీతా కాలంలో 10° సెంటిగ్రేడ్ వేసవిలో 35° సెంటిగ్రేడ్ మధ్యలో వుంటుంది. కాబట్టి ప్రత్యేకమయిన ఏర్పాట్లేవీ అవసరం లేదు.
నగరంలో చక్కని వసతి సౌకర్యాలు లభిస్తాయి. తూర్పు భారతదేశంలోని ఏడు రాష్ట్రాలకీ తలమానికం Assam రాష్ట్రం! ఆ రాష్ట్ర కిరీటంలో ఓ కలికితురాయి. బ్రహ్మపుత్రా సజీవనదీ జలాలతో అస్సాం రాష్ట్రం సర్వధా సస్యశ్యామల ధాత్రిగా ప్రసిద్ధి గాంచింది. నేల నాలుగు చెరగులా పచ్చిక అలుముకుని ‘గ్రీన్ లాండ్ ఆఫ్ ఇండియా ‘ అనే గొప్ప పేరుని ఈ ప్రాంతానికి తెచ్చి పెట్టింది.
బ్రహ్మపుత్ర !…. పూర్వోత్తర హిమాలయాల్ని అతి లాఘవంగా దూకేస్తూ ప్రపంచ వేగాన్ని సంతరించుకున్న Brahmaputraనదీ వేగాన్ని తట్టుకుని నిలదొక్కుకుని నిలచిన భూభాగంగా Assam రాష్ట్రం పరిగణించబడుతోంది.
మార్గమధ్యంలో అనేక ఉపనదుల్ని తనలో కలుపుకుని తన ప్రవాహ మార్గంలోని పరిసరాల్ని పంట పొలాలుగా మారుస్తూ గౌహతి ని చేరిన ఈ నదీప్రవాహాన్ని చూడవలసిందే గాని వర్ణించనలవి కాదు… నీటి ప్రవాహం మందగించిన చోట ఓ సముద్రం గానూ అసలు అలలు కదలని చోట ఓ సరస్సు గానూ… మిగతా యానంలో బ్రహ్మాండమైన వేగం గల నదిగానూ ఈ నది అనేక రూపాంతరాల్ని సంతరించుకుంటూ సాగర గర్భం వైపు తరలివెడుతుంది.
ఈ నదీ పరీవాహక ప్రాంతం అంతా గతంలో ఎంతోమంది విదేశీయుల దండయాత్రలకు గురికాబడింది. కాని చివరకు బర్మా దేశీయులయిన అహోం గిరిజన జాతి మనుగడలో ఓ స్థిర జన జీవన చైతన్యాన్ని అలవరుచుకుంది. గౌహతీ నదీ తీరం అవతలివైపు బ్రహ్మాండమైన అడవులకు నెలవుగా మారింది. యివతలి వైపు సుందర రాష్ట్ర రాజధాని నగరం విస్తరించింది. ఈ నదీ గర్భంలోని ద్వీపాల్లో ఎన్నో మందిరాల అవశేషాలు మనకి కనిపిస్తాయి.

ఆనాటి ‘ప్రాగ్జో జ్యోతిషనగరం’ గా చెప్పుకోబడుతోన్న గౌహతీ నగరాన్ని ‘ది లైట్ ఆఫ్ ది ఈస్ట్’ అని కూడా పిలిచేవారు. గౌహతీ నగరాన్ని చేరేందుకు ఢిల్లీ నుంచీ కలకత్తా నుంచీ సరాసరి విమాన సౌకర్యం వుంది. యిక్కడి నుంచి అనేక ప్రాంతాలకు వాయుదూత్ సర్వీసులు నడుస్తున్నాయి. గౌహతీ నగరాన్ని చేర్చే రైలు బళ్ళలో Assam ఎక్సప్రెస్, తీసస్సుకియా మెయిల్, త్రివేండ్రం ఎక్స్ ప్రెస్, కామరూప్ ఎక్స్ ప్రెస్లు ముఖ్యమైనవి. అస్సాం రాష్ట్ర రవాణాశాఖ మిగతా రాష్ట్ర నగరాలకి బస్సు సౌకర్యాల్ని కొనసాగిస్తోంది.
బ్రహ్మపుత్ర నదీ తీరంలోని చిత్రాచల పర్వత శిఖరంపైన ఓ ప్రాచీన నవగ్రహపూజా మందిరంవుంది. మందిరం వున్న చోటనే అలనాటి ‘ప్రాగ్జో జ్యోతిష నగరం’ వుండేదంటారిక్కడి జనం.
ఈ నవగ్రహ మందిరంలో ఏకశిలా నిర్మితమైన సవగ్రహరూపాలున్నాయి. ఈ మందిరాంతర్భాగంలో వెలుగు సరిగా లేనందున విగ్రహాలంత స్పష్టంగా కనిపించటం లేదు.
స్థానిక దర్శనీయస్థలాల్లో వశిష్టాశ్రమం చెప్పుకోదగ్గది. ఈ ఆశ్రమ ప్రారంభంలోనే బ్రహ్మపుత్రాన ఉపనదులయిన సంధ్య, లలిత, కాంత అనబడే చిరునదులు ప్రవహిస్తున్నాయి. ఈ చిరునదుల మధ్య ప్రాంతం ఆకుపచ్చని పొలాలతో దట్టమయిన చిట్టడవులతో చ్చరించారు. సర్వాంగసుందరంగా కనిపిస్తుంది.
బ్రహ్మపుత్రా నదీ మధ్య ద్వీపంలోని ఉమానంద దేవాలయాన్ని యాత్రీకులు అధిక సంఖ్యలో దర్శిస్తూ వుంటారు. దీన్నే పీకాక్ అయిలండ్ అని కూడా పిలుస్తారు. ఈ ఉమానంద దేవాలయం ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఓ శివాలయం !… మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రం లక్షలాది భక్తులతో కిటకిట లాడిపోతుంది.
బ్రహ్మపుత్రా నదీ తీరంలోనే గౌహతీ బొటానికల్ గార్డెన్స్… Assam జంతు ప్రదర్శనశాలలు కూడా తప్పక దర్శించదగిన ప్రదేశాలుగా భావించాలి! Brahmaputra నదీ ఉత్తరతీరంలో గౌహతీ నగరానికి ఓ 24 కిలోమీటర్ల దూరంలో ‘సువాలూచి’ ని అస్సాం రాష్ట్రం కళాకేంద్రంగా భావిస్తారు. యిక్కడ పట్టుచేనేత ఓ కుటీరపరిశ్రమగా కొనసాగించబడుతోంది.
ఈ ప్రాంతంలో ‘బిహుస్’, మఘచిహు, బోహాగ్ చిహూ, రంగోలీ బిహూ, అనే ఉత్సవాల్ని సాంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తూ వుంటారు. దుర్గా పూజ ఉత్సవం కూడా చాలా బాగా జరుగుతుంది. గౌహతీని చేరిన యాత్రికులకు ఈ ఉత్సవాలకి సంబంధించిన వివరాలన్నీ Assam పర్యాటక శాఖ కార్యాలయంలో లభిస్తాయి.
గౌహతి అనేది సాంస్కృతిక స్మృతులతో, ప్రకృతి రమణీయతతో కూడుకున్న ఒక అద్భుతమైన గమ్యం. బ్రహ్మపుత్రా నది తీరాన ఉన్న ఈ నగరంలో మీరు ప్రయాణం చేస్తే, ఒకే సమయంలో ఆధ్యాత్మికత, ప్రకృతి, సంస్కృతి మరియు ఆధునికతను అనుభవిస్తారు. ఇది మీకు ఒక సమగ్రమైన పర్యాటక అనుభవాన్ని అందిస్తుంది, ప్రతి కోణంలో కొత్త అనుభూతులు, జ్ఞాపకాలు సృష్టిస్తుంది.

మీరు గౌహతికి వెళ్లడానికి సిద్ధం అయితే, ఈ గైడ్ మీ పర్యటనను మరింత ప్రత్యేకంగా, స్మరణీయంగా చేయడంలో సహాయపడుతుంది. బ్రహ్మపుత్రా నదీ తీరాన విశేష అనుభవాలు మీ జీవితం లో అనువాదమైన మరచిపోలేని మధుర క్షణాలను అందిస్తాయి. మీరు ఈ నగరాన్ని సందర్శించి, దాని అందాలు మరియు సాంస్కృతిక గౌరవాన్ని అనుభవించే సమయం సమీపంలోనే ఉంది. ఒక అద్భుతమైన యాత్ర కోసం, గౌహతి ఎదురు చూస్తుంది!
Majuli – The World’s Largest River Island You Must Visit ప్రపంచంలో అతిపెద్ద నదీదీవి మజూలీ: మీ యాత్రకు తప్పనిసరి స్థలం:
మజూలీ – ఆసామ్ రాష్ట్రంలో బ్రహ్మపుత్రా నదిలో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద నదీ దీవి, అనుభవించాల్సిన అద్భుతమైన ఒక ప్రదేశం. ఈ ప్రాంతం తన ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు, మరియు మదురమైన సంస్కృతితో ప్రసిద్ధి చెందింది. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన మజూలీ, నిజంగా ఒక స్వర్గధామం.

ప్రకృతి ప్రేమికులు, సంస్కృతి అంగీకరించే వారు, మరియు ప్రశాంతత కోరుకునే యాత్రికులకు మజూలీ మిమ్మల్ని ఎప్పటికీ ఆకట్టుకుంటుంది. ఇది అసలు ఆసామ్ను అర్థం చేసుకోవడానికి, ఆగమానుగతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికి, మరియు బంధం మెరుపు తీసుకొనే సాహసప్రియుల కోసం అనేక అవకాశాలను అందిస్తుంది. దీవిలోని అడవులు, సాగరాలు, సంప్రదాయ సత్రాలు, గ్రామీణ జీవితం అన్ని మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రయాణంలో నడిపిస్తాయి.
మీరు ఈ అద్భుతమైన ద్వీపంలో అడుగు పెట్టేంత సేపు, మీరు ఒక వేరే ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది – ప్రతి అడుగు ప్రకృతి శక్తి, సంప్రదాయ, మరియు హార్మనీయస్ జీవితం తో నిండి ఉంటుంది.
అస్సాం రాష్ట్రంలోని ‘జోర్ట్’ పట్టణానికి సమీపంలో బ్రహ్మపుత్రా నదీ గర్భాన నిలిచి వున్న ద్వీపం….. మజూలీ! ఈ ద్వీపం ప్రపంచంలోనే పెద్దదయిన ‘రివర్ ఐలాండ్’ గా పేరుపొందింది. అతి వేగంగా సాగరతీరానికి పరుగులు తీసే బ్రహ్మపుత్రానదీ జలాల తాకిడికి క్రమక్రమంగా ఈ ద్వీప భూభాగం తరుగుతూ పోతోంది. అయినా కూడా ఈ ద్వీపం అంతా కూడా పచ్చని అడవులతో…. అనేక రకాల సహజ పుష్ప సంతతితో సర్వాంగ సుందరంగా కనిపిస్తూ వుంటుంది. శీతాకాలంలో ‘మజూలీ’ అందాలు యినుమడిస్తాయి.

జోర్ట్ నగర పరిసరాల్లోని ‘నీమతీ’ తీరం నుంచి ఈ ద్వీపానికి అనేక నాటు పడవులు నడుస్తూ వుంటాయి. ద్వీపంలోని తీరాన్ని ‘కమల కారీ ఘాట్’ అంటూ వ్యవహరించటం జరుగుతోంది. ఇక్కడ చిన్న పడవలే కాకుండా పెద్ద పెద్ద లాంచీలు కూడా ఉపయోగంలో వున్నాయి. ‘లకీంపూర్’ అనే ప్రాంతం నుంచి కూడా ఈ ద్వీపానికి పడవ సౌకర్యం వుంది.
‘నీమతీ’ తీరంలో పడవలు ఓ నిర్ధారిత ప్రాంతాన్నుంచి సాధారణంగా బయలుదేరవు. బ్రహ్మపుత్రా నదీ జల స్థాయిననుసరించి ఈ పడవలు బస చేసివుంటాయి. వర్షాకాలంలో ఈ పడవలన్నీ కూడా ‘కోకిలా’ నదిలోకి చేరతాయి. కోకిల బ్రహ్మపుత్రకి ఉపనదిగా పరిగణించబడుతోంది.. ఈ కోకిలా నదిలో బసచేయబడిన ‘బల్లకట్టు’ ల్లోకి ‘మజూలీ’ విహారానికి జీపుల్ని ఎక్కిస్తూ వుంటారు.
అయితే చాలా ముందుగా అంటే తూర్పు తెల్లవారక ముందే ఈ సౌకర్యం అందుబాటులో వుంటుంది.నీమతీ ఘాట్ ప్రాంతమంతా సూర్యోదయానికే ముందే అల్లకల్లోలంగా వుంటుంది. జోర్ట్ నుంచి యాత్రికులే కాకుండా ‘మసూలీ’ ద్వీపంలోని వర్తకులంతా కూడా తెల్లవారక ముందే యిక్కడికి చేరుకుంటారు. అక్కణ్ణుంచి పడవల సరంగులకు క్షణం తీరిక లేకుండా దినం గడిచిపోతుంది. నీమతీ ఘాట్లో ప్రయాణికుల్ని దింపేసిన బస్సులన్నీ కూడా దగ్గర్లోని ‘కమలబారీ’ పట్టణంలో నిలిచిపోతాయి. ఈ పట్టణం నుంచే సరుకులు చాలా వరకు మజూలీకి రవాణా అవుతాయి.

ఒకప్పుడు ‘మజూలీ’ ద్వీపం / వైశాల్యం ‘1300’ చదరపు కిలోమీటర్లు వుండేది. అదిపుడు కేవలం 900 చదరపు కిలోమీటర్ల వరకు తరిగిపోయింది.ఈ ద్వీపానికి చాలా పురాతన చరిత్ర వుంది. Assam రాష్ట్ర ప్రాచీన సంస్కృతికీ, కళపోషణకీ, జీవన విధానానికీ ఈ ప్రతిబింబం అని చెప్పుకోవచ్చు. చేనేత వస్త్రాలకీ ద్వీపం చాలా పేరు పొందింది.
క్రీస్తు పూర్వ కాలంలోనే ప్రాచీన ‘బోడో’ జాతి సంతతి యిక్కడ స్థిరపడి పోయింది. ఆ రోజుల్లో ఈ ద్వీపాన్ని హాబాంగ్’ అనేవారు. ‘హాబాంగ్’ అంటే పెద్ద భూభాగం అని అర్థం … క్రీ.శ. 1180 లో ‘చుటియా’ రాజవంశీయు ‘బీర్వాల్’ మహారాజు ‘Majuli‘ ని తన రాజధానిగా చేసుకుని పాలించాడు. ఆ రాచరికపు రోజుల్లో ఈ ద్వీపాన్ని ‘రానాపూర్’ అనేవారు. క్రీ.శ 1300 లో ‘వరాహ’ రాజ వంశానికి చెందిన ‘చంద్రహాస’ మహారాజు పాలనలో మజూలీకి దక్షిణదిశలో ‘దాకినీ పాట్’ అనే పేరుతో అతని రాజనివాసం నిర్మించబడింది.
క్రీ.శ. 1916 సంవత్సరాల మధ్యలో ఈ ప్రాంతంలో రాజవంశాలకు బదులుగా వైష్ణవ, మత పునరుద్ధరణకు కంకణం కట్టుకున్న వంకర దేవ మహాపురుష ఆధీనంలో వుంది. చారిత్రిక ఆధారాలననుసరించి శంకర దేవుడి నిర్మితాలయిన అనేక సత్రాలు ఈ నాటికి నిలిచి వున్నాయి. ఆ గురుదేవుల ఆధీనంలో ఒకనాటి రాజభవనం కూడా సత్రంగా మార్పు చెందింది. అప్పటినుంచీ ‘మజూలీ‘ ఓ పవిత్ర యాత్రా స్థలంగా మారిపోయింది. ‘Majuli‘ సర్వజాతి సమైక్యతకి చిహ్నంగా గుర్తించబడింది.
కొన్ని వందల సంవత్సరాల క్రిత ‘అహోం’ తెగకి చెందిన ‘గదాధర సింహుడనే రాజు’ Majuli ని కైవసం చేసుకోవాలని చూశాడు కాని ‘Majuli లోని మతాచార్యులందుకు అడ్డుకోవటం జరిగింది. కాని 1780 లో ‘రాహరామదాసు’ అనబడే ‘మోమారియా రాజు’ మజూలీ ని బలవంతంగా వశపరుచుకుని ఆనాటి వరకు సర్వమత ఐక్యతకి చిహ్నంగా నిలిచిపోయిన సత్రాలన్నిటినీ కొల్లగొట్టటం జరిగింది.
అయినా కూడా ప్రాచీన వైభవాన్ని నిలుపుకున్న ‘దాకినీ పాట్’, ‘కమలబారీ’ ‘గరామూర్’, ‘అవునతి’ సత్రాలు తమ దేవాలయాలతో బాటుగా ఈనాడు కూడా యాత్రికుల్ని ఆకర్షిస్తూనే వున్నాయి.
కలకత్తా నుంచి గౌహతీకి రైల్లో వచ్చి జోర్ట్ మీదుగా ‘మజూలీ’ చేరుకోవచ్చు !… భారీ వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని దర్శించటం అంత శ్రేయస్కరం కాదు. చలికాలంలో ఉన్నిదుస్తుల అవసరం తప్పనిసరి. మజూలీ‘ లో వసతి సౌకర్యాలు సులభంగానే లభిస్తాయి.
Kaziranga National Park: Step into the Wild Kingdom: కాజిరంగా జాతీయ ఉద్యానవనం: వన్యప్రాణుల రాజ్యంలో అడుగు పెట్టండి:
కాజిరంగా (Kaziranga) – ఇది ఆసామ్ రాష్ట్రంలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ఒక ప్రసిద్ధమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది ప్రత్యేకంగా ఏకకుంభ రైనోసరస్ (one-horned rhinoceros) కోసం ప్రసిద్ధి చెందింది.
తూర్పు హిమాలయాల్లోని పల్లపు ప్రాంతాలు ప్రకృతి ప్రసాదించిన వరాలుగా భావించాలి. చక్కని చిక్కని దట్టమైన అడవుల్లో నుంచి రోడ్డు అనేక మలుపులు తిరుగుతూ వెడుతూ వుంటే యాత్రికులకి కనిపించే అద్భుత సుందర దృశ్యాలు వారి శ్వాసక్రియని ఆపుచేస్తాయి. ఆ అడవుల మధ్య నుంచి బస్సు బాణంలా దూసుకుని ‘జోరాబత్’ అనే గ్రామాన్ని చేరుతుంది.
జోరాబత్ నుంచి దారి రెండుగా చీలుతుంది. ఓ మార్గం మేఘాలయ రాష్ట్ర రాజధాని ‘షిల్లాంగ్’ కూ మరోదారి భారతదేశపు ప్రప్రథమ ఖడ్గమృగ అభయారణ్యం ‘Kaziranga‘ కూ వెడతాయి. ఎత్తైన ప్రాంతం నుంచి చూస్తే పచ్చని పొలాల మధ్యన వున్న ఈ దారి ఓ సన్నని గీతలా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోని ‘టీ’ తోటల వనాలు విశ్వవిఖ్యాతిని గాంచాయి.యిక్కడి నేలంతా చిరుసరస్సులతో సర్వాంగ సుందరంగా గోచరిస్తుంది.
బ్రహ్మపుత్రా నదీ పల్లపు ప్రాంతంలో తూర్పు నుంచి పడమరకు ఏటవాలుగా దాదాపు నాలుగు వందల ముఫ్ఫై చదరపు మైళ్ళు విస్తరించి వున్న ‘కాజీరంగా’ అభయారణ్యానికి క్రీ.శ. 1906 లోనే రూపకల్పన జరిగింది. అనాడు కేవలం నాలుగా వందలతో ప్రారంభించబడిన ఈ వనంలో నేడు దాదాపు రెండు వేల వొంటికొమ్ము ఖడ్గమృగాలున్నాయని అంచనా. ‘కార్బీ’ ఎంగ్లింగ్’ పర్వత శ్రేణి ఈ అభయారణ్యానికి ఓ గోడలా నుంచుని వుంటుంది. దట్టమైన అడవులు భయంకరంగా కనిపిస్తాయి.

ఈ అభయారణ్యంలో బ్రహ్మపుత్రకి ఉపనదులయిన మోరా, డిఫలూ, బెంగుగా, బోజురి, దిరింగ్, కొహరా, దెహింగ్, బాలుకు జ్రి, దియోపానీలు ప్రవహిస్తున్నాయి. ఈ నదులు సారవంతమైన మట్టిని తమతో తీసుకుని వచ్చి అక్కడక్కడా సరస్సుల్లా రూపు చెందాయి. ఈ సరస్సుల్ని ‘ఫీల్స్’ అంటారు.
ఈ అభయారణ్యంలోని ప్రతీ దృశ్యం ప్రకృతి మనకి సమర్పించిన ఓ అద్భుత బహుమతిలా తోస్తుంది. ఈ నేషనల్ పార్క్ని సందర్శించిన వాళ్ళని అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. యిక్కడి ఏనుగు సవారీ ఓ ఆకర్షణగా భావించాల్సి వుంటుంది.
ఏనుగుల పైన వెడుతున్నపుడు మనకు అనేక రకాల ఆటవిక ప్రాణులు అతి సమీపంలో కనిపిస్తాయి. ఈ ఏనుగుల పై సవారీ చేసే యాత్రికులు తెల్లని వస్త్రాలు ధరించకూడదు. మధ్యలో ఏనుగుని ఆపి దిగరాదు పెద్దగా మాట్లాడకూడదు !… సిగరెట్లు త్రాగకూడదు.
సడన్ మూవ్మెంట్స్ చేయకూడదు. ఈ నియమాలని ఉల్లంఘించిన పక్షంలో యాత్రికుల క్షేమానికి హాని కలుగుతుందని చెప్పబడుతోంది. జీపులోనో వ్యాన్ లోనో కూడా వెళ్ళవచ్చు. కాని ఏనుగు స్వారీలో కనిపించినట్లుగా మనకు జంతుజాలం యితర వాహన యానంలో కనిపించదు.
ఈ అరణ్యంలో ‘అడవిదున్న’ ల సంతతి కూడా ఎక్కువగానే వుంది. అలాగే యితర పక్షి సంతతి కూడా !… ఈ అరణ్య, ప్రారంభదశలోనే యాత్రికుల సౌకర్యార్ధం ఓ ‘యాత్రా నిలయం’ పనిచేస్తోంది. ‘బేగూరి’ అనే చోట మరో పెద్ద యాత్రా విశ్రామ గృహం వుంది. ‘కొహరీ’ లో కూడా చక్కని వసతి లభిస్తుంది. కలకత్తా నుంచి రైల్లోనూ,…… రోడ్డు మార్గంలోనూ ….. విమానం ద్వారానూ యిక్కడికి చేరుకోవచ్చు.
కలకత్తా నుంచి ‘జోర్హాట్’ కు నేరుగా విమాన సౌకర్యం వుంది. జోర్హాట్ కాజిరంగాకు 84 కిలోమీటర్ల దూరంలో వుంది. కాజిరంగాకి భూటాన్ దేశం సరిహద్దుగా వుంది. యిక్కడి ‘మానస’ అనే చోటు యాత్రికులను విపరీతంగా ఆకర్షిస్తూ వుంటుంది. ఫిబ్రవరి – జూలై మాసాల్లో కాజీరంగాని దర్శించాలి..

అస్సాం రాష్ట్రంలో ప్రవహిస్తోన్న బ్రహ్మపుత్రా భృధగంగా నదుల సంగమ ప్రాంతం తేజ్పూర్ ! ఈ పట్టణం గౌహతికి 180 కిలోమీటర్ల దూరంలో వుంది. తేజ్పూర్ని చేరుకోవడానికి చక్కని రోడ్డు మార్గంతో బాటుగా గౌహతీ …కలకత్తా నుంచి విమాన సౌకర్యం కూడా ఉంది. తేజ్పూరికి ఓ బ్రాంచి రైలు మార్గం ప్రత్యేకంగా వుంది. రాంగాపూర్ జంక్షన్ నుంచి రైళ్ళు యిక్కడకి నడుస్తూ వుంటాయి.
పౌరాణికంగా తేజ్పూరికి ఓ ప్రత్యేక స్థానం వుంది. భాగవత | కథలో నుదహరింపబడిన రాజా బాణుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించి వుంటాడని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భారతకథలో వినిపించే స్థలాల పేర్లు కొన్ని ఇక్కడ మనకళ్ళకి కనిపిస్తాయి… దేవీ కూటం, ఉషావనం…. వర్షకోటి…వనపురం, సోనితప్పురం… మొదలగునవి…
స్థలపురాణం ప్రకారం . బాణుని కూతురయిన ఉష అతిలోక సౌందర్యవతి !… ఆమెని శ్రీకృష్ణుడి మనుమడయిన అనిరుద్ధుడు అమితంగా ప్రేమించాడు. చివరికి ఉష ఆ రాజ్యాన్నుంచి అపహరించబడుతుంది. ఈ ఉషాపహరణం వెనుక శ్రీకృష్ణుని హస్తం వుందని తెలిసిన బాణుడు అశక్తుడయి సహాయం కోసం స్థానిక మహాభైరవ మందిరానికి వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు.
కాని అందువల్ల ఫలితం ఏమీ వుండదు. ఉషాపరిణయం సక్రమంగా జరిగిపోతుంది. అదీ కథ. అయితే ఉషాపహరణ సమయంలో ఆమె వలువలు కొన్ని వచ్చి నేలకి వాలాయట. ఆ వస్త్రాల చిహ్నాల్ని తేజ్పూర్ లోని ‘బాముని కొండల’ పై చూడటంకోసం జనం వెడుతుంటారు.
ఉష దుస్తుల చిత్రాలు ‘బాముని’ కొండపైన రాతిఫలకాల్లో శిల్పాకృతుల్లో మనకి కనిపిస్తాయి. ఈ ప్రాంతం యాత్రికులకి ఓ దర్శనీయ స్థానంగా రూపుదిద్దుకుంది. అందువల్ల స్థానికులకి ఈ కొండ ఓ పిక్నిక్ స్థానంగా ఉపయోగంలో వుంది.
ఈ కొండపైన ఓ ఏడు శివాలయాలు కనిపిస్తాయి. అవి అన్నీ కూడా జీర్ణదశలో వున్నాయి. ప్రస్థుతం ఈ శిథిలాలయాలని ఆర్కిలాజికల్ డిపార్ట్మెంటువారు పునరుద్ధరించే ప్రయత్నాల్లో వున్నారు. తేజ్పూర్ పరిసరాల్లోనే గుప్తకాలంనాటి శిలాశిల్ప అవశేషాలు కొన్ని బయటపడ్డాయి. అందులో ‘ద్వాపర్వతియా’ అనే గ్రామంలో దొరికిన ‘శిలా చిత్రద్వారం’ చాలా ముఖ్యమయింది. ఈ రాతి తలుపు క్రీ.శ. 5 వ శతాబ్దకాలం నాటిదిగా గుర్తించబడింది.
1685 వ సంవత్సరంలో గంగాధర సింహుడిచే నిర్మించబడిందని చెప్పుకోబడుతోన్న విశ్వనాథదేవాలయం బ్రహ్మపుత్రా భృధగంగా నదీ సంగమ మధ్యస్థానంలోని ఓ లంకలో వుంది. వర్షాకాలంలో ఈ దేవాలయం మునిగిపోతూ వుంటుంది.
తేజ్పూర్కి దగ్గరలోనే వున్న ‘జోర్హాట్’ లో అనేక టీ తోటలు సాగు చేయబడుతున్నాయి. బ్రహ్మపుత్రాన యిక్కడ చాలా వైశాల్యాన్ని సంతరించుకుంటుంది. యిక్కడ నది మధ్యలో ఓ విశాలమైన లంక వుంది. అనేక బౌద్ధారామాలు నెలకొని వున్నాయి.
‘Majuli‘ అనబడే లంకని చేరుకునేందుకు ‘జోర్హాట్’ నుంచి దాదాపు కొద్ది కిలోమీటర్లు ప్రయాణం చేసాక ‘నీమతీఘాట్’ నుంచి పడవలో ఈ లంకని చేరుకునే అవకాశాన్ని కల్పించారు. ‘జోర్హాట్’ పరిసర ప్రాంతంలో వున్న ‘నంబూర్’ అభయారణ్యం మధ్యలో అనేక వేడి నీటి బుగ్గ బావులున్నాయి. .ఈ వేడినీటితో అనేక చర్మవ్యాధులు నయమవుతాయట!
బ్రహ్మపుత్రానదీ ఉత్తర తీరంలో జోర్హాట్కి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ‘ఓరాంగ్’ అనే వన్య మృగ అభయారణ్యం వుంది. ఈ అరణ్యంలో ఖడ్గమృగాలూ, దుప్పి, లేడి, జింక మొదలగు జంతువులే కాక అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయి. ఈ అభయారణ్యాన్ని యాత్రికులు అధికసంఖ్యలో దర్శిస్తూ వుంటారు.
‘తేజ్ పూర్, జోర్ట్, ఓరాంగ్’ లలో యాత్రీకుల సౌకర్యార్థం అనేక విశ్రమాలయాలున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ బస్సులీ ప్రాంతాలకి యాత్రీకుల్ని చేరవేసే ఏర్పాట్లు చేయబడ్డాయి.
తేజ్ పూర్ ప్రాంతంలో శీతోష్ణస్థితులు సమపాళ్ళలో ఎల్లపుడూ జనరంజకంగా వుంటాయి. ఇక్కడి గిరిజనులు తయారుచేసే పిల్లన గ్రోవి, బుట్టలు, వెదురు గొట్టాలు, వగైరాలకి మంచి గిరాకీ వుంటుంది
Dibrugarh Tourism Guide: An Unmissable Slice of Assam డిబ్రూగర్ టూరిజం గైడ్: ఆసామ్ లోని మరిచిపోలేని కోణం:
డిబ్రూగర్ (Dibrugarh) – ఈ నగరం ఆసామ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన వాణిజ్య, విద్యా, మరియు పర్యాటక కేంద్రం. ఇది “టీ సిటీ ఆఫ్ ఇండియా” అని కూడా పిలవబడుతుంది, ఎందుకంటే ఇది భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన ‘టీ’ తోటలలో ఒకదానికి గృహంగా నిలుస్తుంది. బ్రహ్మపుత్రా నది తీరాన ఉన్న ఈ నగరం, సహజసిద్ధ అందాలు మరియు సంస్కృతితో సమృద్ధిగా ఉంటుంది.
మన దేశపు తూర్పు హిమగిరి లోయలో, Assam రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపారకేంద్రంగా ‘డిబ్రూగర్’ నగరం చెలామణి అవుతోంది. భారత భూభాగంలోని చిట్టచివరి నగరంగా భాసిల్లుతోన్న ఈ డిబ్రూగర్ పట్టణమే దేశంలోని చిట్టచివరి రైల్వేస్టేషన్ అన్న ఖ్యాతిని కూడా గడించింది.
యిక్కడ ప్రవహిస్తోన్న బ్రహ్మపుత్రానది తన విశ్వరూపాన్ని చూపుతున్నట్లుగా అతి భయంకరమైన వేగంతో ‘ప్రవహిస్తూ వుంటుంది. డిబ్రూగర్ పట్టణం నుంచి కలకత్తాకూ.. న్యూఢిల్లీకి నేరుగా ప్రయాణం చేసేందుకు రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి.
ఈ ప్రాంతం తేయాకు తోటలకు ఓ పుట్టినిల్లు. యిక్కడి తోటలు విశ్వ విఖ్యాతిని గాంచిన ‘అస్సాం’ దీని ఉత్పత్తిని చేస్తున్నాయి. అనేక టీ ఉత్పత్తి కేంద్రాలిక్కడ పనిచేస్తున్నాయి.
ఇక్కడికి దగ్గర్లోని ‘దులిజాన్’ పట్టణం కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిని చెందింది. ఎన్నో చమురు కర్మాగారాలిక్కడ పనిచేస్తున్నాయి. దేశంలోని చమురు గనులకు యిది పేరొందిన స్థలంగా చెప్పబడుతోంది. అయిల్ అండ్ నేచురల్ కమీషన్ వారు వారి మొట్టమొదటి చమురు బావిని యిక్కడే త్రవ్వటం జరిగింది. స్థానిక ‘దిగ్చోయ్’ ప్రాంతంలో భారతదేశపు చమురు ఉత్పత్తిముఖ్యకేంద్రం పనిచేస్తోంది. యిక్కడ చమురు ఉత్పత్తి శాఖ అధికార భవనాల్ని వరుసగా కొండలంచున కట్టుకుంటూ వెళ్ళారు.
దులిజాన్ లోనే ‘మార్గరితా’ అనబడే ఓ చమురు శుద్ధి కర్మాగారం పనిచేస్తోంది. ఈ ఫ్యాక్టరీని ఇటలీ దేశపు యువరాణి ‘మార్గంతా’ పేరిట నిర్మించారు. ‘ఈ ప్రాంతంలోనే అనేక బొగ్గుగనులు కూడా వున్నాయి. స్థానిక Assam ఆయిల్ కంపెనీ గెస్ట్ హౌస్ లో యాత్రీకులు విశ్రమించవచ్చు.
బ్రహ్మపుత్రానదీ తీరంలో గౌహతీ నగరానికి కేవలం ’64’ కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఓ మంచి నీటిసరస్సు కూడా యాత్రీకుల్ని విపరీతంగా ఆకర్షిస్తూ వుంటుంది. యిక్కడ చేపల వేటకు అనుమతిని తీసుకోవాల్సి వుంటుంది. ఈ సరస్సుని ‘చందూబీ’ సరస్సు అని పిలుస్తారు.
అలాగే గౌహతీ పట్టణానికి 180 కిలోమీటర్ల దూరంలో, భూటాన్ సరిహద్దు ప్రాంతంలో ‘దరాంగ్’ అనే బుయాల’ సంత జరుగుతూ వుంటుంది. భూటాన్ దేశీయుల్నిక్కడ ‘బుటియా’ అని పిలుస్తూ వుంటారు.

ఈ బుటియాలు తమ ప్రాంతపు గొర్రెల్నీ, గుర్రాల్నీ, ఉన్ని ఉత్పత్తుల్నీ ఈ సంతకు తరలిస్తారు. అమ్మకాల తర్వాత తిరుగు ప్రయాణంలో తమ వెంట ఉప్పునీ, చేపల్నీ, చేనేత వస్త్రాల్నీ తీసికెడుతూ వుంటారు. ఈ బుటియా సంతలు సాధారణంగా మార్చి – నవంబరు మాసాల మధ్యకాలంలో నిర్వహించబడుతూ వుంటాయి.
యిహ ‘హాజ్’ అనబడే గ్రామం ఓ పవిత్ర యాత్రాస్థలంగా చెప్పుకోబడుతోంది. బ్రహ్మపుత్రానదీ తీరంలో వున్న ఈ గ్రామంలో హిందూమత సంస్కృతీ చిహ్నంగా, హయగ్రీవ మాధవ మందిరం వుంది. విష్ణుమూర్తి ‘హయగ్రీవం’ అంటే అశ్వరూపంలో కనిపించే మందిరం దేశం మొత్తంలో యిదొక్కటేనని విశ్వసనీయంగా చెప్పుకుంటూ వుంటారు. అంతే కాకుండా గౌతమ బుద్ధుడు కూడా యిక్కడే నిర్యాణం చెందాడన్న ఓ వదంతి కూడా స్థానికుల్లో బలంగా పాదుకుని పోయింది.
అలాగే ‘పానోమెక్కా’ అనే మసీదు కూడా యిక్కడే వుంది. ‘ఫిర్గా సుద్దీన్ అలీయా’ అనే ముస్లింప్రవక్త చేత నిర్మించబడినట్లుగా చెప్పబడే ఈ క్షేత్రం ముస్లిం యాత్రికులని అధిక సంఖ్యలో ఆకర్షిస్తూ వుంటుంది. పైన చెప్పబడిన యాత్రా విశేషాలన్నీ ఒక ఎత్తయితే ‘హాఫ్ బాండ్’ అనే గ్రామ యాత్రని ఓ విశేష యాత్రగా చెప్పాల్సి వుంటుంది.
‘హాఫ్ బాండ్’ ప్రాంతంలో ఓ సరస్సుని అనుకుని విస్తరించి వున్న ఈ గ్రామంలో ఓ వింత కార్యక్రమం ప్రతి చీకటి రోజూ నిర్వహింపబడుతూ వుంటుంది. చీకట్లో కొందరు దివిటీల్ని వెలిగించి నుంచుని వుంటే ఆ దివిటీ మంటల్లోకి ఎక్కణ్ణుంచో వచ్చే అమాయక పక్షిమూకల ఆత్మార్పణ దృశ్యం మనల్ని కదిలించి వేస్తుంది.
ఆ పక్షులెక్కణ్ణుంచి వస్తాయో ఎందుకలా చచ్చిపోతాయో అన్న విషయాన్ని యింతవరకు ఎవరూ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఈ విషయాన్ని పరిశోధించే యాత్రికుల సంఖ్యమాత్రం విశ్వవ్యాప్తంగా పెరిగిపోతుంది. ఆ పరిశోధకుల సౌకర్యార్థం ‘జటింగా’ అనే చోట ఓ గెస్ట్ హౌస్ని నిర్మించారు.